Nellore

News June 11, 2024

నెల్లూరు: సీఎం ప్రమాణ స్వీకారానికి 32 ఆర్టీసీ బస్సులు

image

ఈనెల 12న విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సులు చొప్పున 32 బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు 17 ఎల్ఈడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

News June 11, 2024

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం

image

బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలువాయి మండలానికి చెందిన డిస్కం ఏఈ యశ్వంత్(26) మృతి చెందాడు. స్థానికులు వివరాల ప్రకారం.. యశ్వంత్ రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇతని కుటుంబ సభ్యులు నెల్లూరులో నివాసముంటున్నారు.

News June 11, 2024

నెల్లూరు: టపాసుల గోడౌన్లో అగ్ని ప్రమాదం.. బాలుడు మృతి

image

బోగోలు మండలం బిట్రగుంటలో టపాసుల గోడౌన్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులో ఉన్న బాలుడు సురేశ్ రైనా(13) ప్రాణాలు కోల్పోగా.. గౌడౌన్ యజమాని సుమంత్‌‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. బాలుడు కప్పరాళ్ల తిప్ప గ్రామానికి చెందినవాడు. గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బాలుడికి, గోదాము యజమానికి గాయాలు కాగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి.

News June 11, 2024

నెల్లూరు: సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యాలయాల ముస్తాబు

image

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు పాటు అన్ని కార్యాలయాల ఎదుట విద్యుత్ కాంతులతో ఉండాలని సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయంల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.

News June 10, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి 17 ఎల్ఈడీ స్క్రీన్‌లు

image

విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈనెల 12న జరగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రజలు వీక్షించేందుకు 17 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు వికాస్‌ మర్మత్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.

News June 10, 2024

చంద్రబాబుతో ఎమ్మెల్యే సోమిరెడ్డి భేటీ

image

సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న సోమిరెడ్డి చంద్రబాబుని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News June 10, 2024

పెళ్ళకూరు: విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా జారిపడి వ్యక్తి మృతి

image

పెళ్ళకూరు మండలం పాల్చూరు గ్రామంలో విషాదం చోటు చేసకుంది. విద్యుత్‌ తీగలు మరమ్మతులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభం మీద నుంచి జారిపడి ఆనందయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు (55) మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 10, 2024

నెల్లూరులో వైసీపీకి మేయర్ దంపతుల రాజీనామా

image

నెల్లూరులో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సోమవారం నెల్లూరు మేయర్ శ్రవంతి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. నాలుగు నెలల క్రితం టీడీపీలో చేరిన మేయర్ దంపతులు మూడు రోజులు తిరిగేసరికి మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు.

News June 10, 2024

జమ్మలపాలెం వద్ద మామిడికాయల లారీ బోల్తా

image

మామిడికాయల లోడుతో తిమ్మసముద్రం నుంచి వస్తున్న లారీ సోమవారం జమ్మలపాలెం వద్ద అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. తిమ్మసముద్రం నుంచి లోడుతో హైదరాబాద్ వెళుతున్న లారీ జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో లారీలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ఉండగా.. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News June 10, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నెల్లూరు విద్యార్థుల హవా

image

తాజాగా వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో మొత్తం 2,800 మంది విద్యార్థులు పాల్గొంటే.. 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో నెల్లూరులోని ధనలక్ష్మీపురానికి చెందిన సూరజ్ 134, మూలాపేటకు చెందిన బద్రీనాథ్ వర్మ 236 ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు.