India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర క్యాబినెట్ భేటీలో పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 200 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు SAEL సంస్థకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వాంటమ్ టెక్నాలజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాలిడేషన్ హబ్ కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు, QAIG సంస్థకు 2.5 ఎకరాల భూమి, రూ.108 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపారు.

జిల్లాలోని మసీదులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. మసీదుల నిర్వహణ కమిటీలు, గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్, మౌజన్లు తమ మసీదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉమీద్ పోర్టల్లో మసీదుల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 25 లోపు వీటిని పూర్తి చేయాలన్నారు.

కుప్పంలో NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2,550 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 400మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ కంపెనీకి 105 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిపురం(M) చీమనపల్లెలో రూ.989కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. రెండు దశల్లో 450మందికి ఉద్యోగాలు ఇస్తారు. వీటితో పాటు కుప్పం, శాంతిపురంలో పారిశ్రామిక పార్కులకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నెల్లూరు జిల్లాలో కొత్తగా రెండు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుత్తలూరు మండలం పాపంపల్లెలో డిఫెన్స్ రా మెటీరియల్ తయారీ యూనిట్ కోసం 349.95 ఎకరాలు కేటాయించడానికి ఓకే చెప్పింది. ఇక్కడ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అలాగే మనుబోలు మండలం మడమనూరు వద్ద 250 ఎకరాల్లో రూ.3500 కోట్లతో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యటన కేంద్రమైన పులిగుండు అభివృద్ధికి 79 ఎకరాలు ఏపీ టూరిజానికి కేటాయిస్తూ నేడు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు, 1000 అడుగుల ఎత్తయిన రెండు రాతి కొండలు చూడ ముచ్చటగా ఉంటాయి. గత ఏడాది ఇక్కడ యోగ డేను జిల్లా అధికారులు నిర్వహించారు. ఆ ఫోటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన Xలో పోస్ట్ కూడా చేసుకున్నారు.

విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్కు భారీ ఆదరణ లభిస్తోంది. 2025-26లో ఈ రూట్లో 48 లక్షల మంది ప్రయాణించడంతో దక్షిణాదిలో టాప్ రద్దీ మార్గంగా నిలిచింది. వేగం, సౌకర్యం, సమయపాలనతో ప్రయాణికులు ఈ రైలును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులకు ఇది కీలకంగా మారింది. ఈ కనెక్టివిటీతో 2 నగరాల మధ్య ఆర్థిక, సామాజిక అనుబంధం మరింత బలపడుతోంది.

నందిగాం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని సీహెచ్.గోపాల్ (40) అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. టెక్కలి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఈయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మద్దిలవానిపేట గ్రామ జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరగగా అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఇటీవల ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.28 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మందికి రూ.5 లక్షలు, గాయపడిన 29 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు.. మొత్తం రూ.1.28 కోట్లు ఇవ్వనున్నారు.

ఒంగోలులో ఒపెన్ ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. స్థానిక D.R.R.M మున్సిపల్ హైస్కూల్లో ఈనెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు DEO, క్యాంప్ ఆఫీసర్ P.V రేణుక తెలిపారు. అయితే త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నేటి నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు, మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.