India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దారికాసి మరీ యువకుడిపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ప.గో జిల్లా తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.రామ్మూర్తి శుక్రవారం బైక్పై వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, ముత్యాల సాయి మరికొందరితో కలిసి అడ్డగించారు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లుతో వెంటపడి మరీ కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్లో కేవలం ఐదు రోజుల్లోనే అత్యవసర డ్రై డాకింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు చెందిన డ్రెడ్జ్-8 నౌక అత్యవసర మరమ్మతుల కోసం ఈనెల 21న తీసుకువచ్చారు. సంస్థ అధికారులు, సిబ్బంది 24 గంటల ప్రణాళికతో ఐదు రోజుల్లో పనులు పూర్తి చేశారు. ఈ నౌకను 1977లో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో కొన్ని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల వసతి గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరమ్మతుల నిమిత్తం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 15 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు రూ.1.35 కోట్ల నిధులు మంజూరు చేశారు.
చీమకుర్తిలో జనరల్ ఎలక్షన్లో భాగంగా చీమకుర్తికి వచ్చిన CI దుర్గాప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల చీమకుర్తి MRO ఆఫీస్ వద్ద ఓ దొంగతనం కేసులో ముద్దాయి బెయిల్పై బయటకు వెళ్లి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. అతని దగ్గర లంచం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇప్పించినట్లు అభియోగాలు రాగా.. విచారణ జరిపి ఉన్నతాధికారులు నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణాలో సంబంధం ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. ఇటీవల పట్టుబడిన ఎర్ర చందనం కేసులో బద్వేలు అర్బన్ స్టేషన్ కానిస్టేబుల్ సుధాకర్, అట్లూరు స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
చీటింగ్ కేసులో తిరుపతికి చెందిన భార్యాభర్తలకు జైలుశిక్ష పడింది. ఫిర్యాది తరఫు న్యాయవాది జి.వెంకట కుమార్ వివరాల మేరకు.. నగరానికి చెందిన కె.శ్రీనివాసులు, కె.ఓంకార లక్ష్మి ఒకరికి అప్పు తీర్చేందుకు భార్య పేరుతో ఉన్న చెక్పై భర్త సంతకం పెట్టారు. దీంతో కేసు నమోదైంది. ఒక్కొక్కరికీ మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి ఎం.సంధ్యారాణి తీర్పు చెప్పారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. జులై 1, 2వ తేదీల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకుల పెంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు జిల్లాలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర చెప్పారు. ఈ గన్నవరం మండలం బెల్లంపూడి ఎస్సీ పేటలో శుక్రవారం సర్పంచ్ బండి మహాలక్ష్మితో కలిసి పర్యటించారు. సీజనల్ జ్వరాల బాధితుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, బయట ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.