Andhra Pradesh

News March 16, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

గంట్యాడ మండలంలోని వసాది గ్రామ సమీపంలో కొత్త వెలగాడ రహదారి జంక్షన్‌లో రహదారిపై, శనివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.కోట మం. కొత్తూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు ఒక బైక్‌పై, వేరొక బైక్‌పై జామి మం. తానవరానికి చెందిన ముగ్గురు యువకులు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొత్తూరు వాసి మృతిచెందగా, అతని భర్యతో పాటు తానవరానికి చెందిన ముగ్గురు యువకులు గాయపడ్డారు.

News March 16, 2024

పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివి: ఎస్పీ

image

రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి,జి.రామకృష్ణ, ఎస్ లక్ష్మినారాయణరెడ్డి, ఆర్ఐ రాముడు పాల్గొన్నారు.

News March 16, 2024

వైఎస్ జగన్ రాజకీయ చరిత్ర ఇదే

image

వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప ఎంపీగా గెలిచారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు. 2014 పులివెందుల ఎమ్మెల్యేగా 75,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో, 2019లో 90,110 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా జగన్ చరిత్ర సృష్టించారు.

News March 16, 2024

ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి మనవడు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో ఉన్నారు. మంగళగిరి నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ (టీడీపీ) బరిలో ఉండగా.. తెనాలి నుంచి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ (జనసేన)లో పోటీ చేస్తున్నారు. అలాగే గురజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కాసు మహేష్ రెడ్డి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

News March 16, 2024

వెంకటగిరి: వారసుల్లో పైచేయి ఎవరిదో ! 

image

వెంకటగిరి బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ నేతల వారసులే. ఇద్దరికి ఇవే మొదటి ప్రత్యక్ష ఎన్నికలు. వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మిల కుమారుడు. టీడీపీ అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె. జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి, రామకృష్ణ ముగ్గురూ వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. మరి వారసుల్లో పైచేయి ఎవరిదో.

News March 16, 2024

ప.గో: సామాజిక వర్గాల వారీగా వైసీపీ అభ్యర్థులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే.. ఓసీ సామాజిక వర్గం నుంచి 9 మంది, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎన్నికలో బరిలో నిలుస్తున్నారు.

News March 16, 2024

అసంతృప్తితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవేంద్ర

image

బీజేపీలో కష్టపడి పని చేసిన పార్టీ అధిష్ఠానం గుర్తించడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. శనివారంలోని నరసింహారెడ్డి నగర్‌లో ఆయన జన్మదిన వేడుకలు అనంతరం బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్‌కు పోటీ చేయాలంటూ రాఘవేంద్రపై వర్గం ఒత్తిడి తీసుకువచ్చింది.

News March 16, 2024

రూ.83 లక్షల విలువ చేసే 311 సెల్ ఫోన్లు అందజేసిన ఎస్పీ

image

కొన్ని నెలల నుంచి ఉమ్మడి జిల్లాలో చోరికి గురైన 311 మొబైల్ ఫోన్లను జిల్లా SP అన్బురాజన్ శనివారం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో జిల్లా పోలీసులు ఎక్కడా రాజీపడలేదని, అనంత నుంచి 259, శ్రీ సత్యసాయి 31, కర్నూలు 10, కర్ణాటక 5, చిత్తూరు 3, తెలంగాణ 2, గుంటూరు జిల్లా నుంచి 1 రికవరీ చేసి అందిస్తున్నట్లు తెలిపారు.

News March 16, 2024

రామభద్రపురం: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

నాయుడువలస గ్రామానికి చెందిన M. నారాయణ రావు (46)చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణ రావు హైదరాబాద్‌లో చక్కెర కర్మాగారంలో పనిచేస్తూ సెలవుపై సొంతూరు కొద్ది రోజుల ముందు వచ్చారు. ఈరోజు ఇంటివద్ద ఉన్న చింతచెట్టు కాయలు కోస్తుండగా కాలుజారి పడ్డాడు. గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు హెచ్సీ సత్యనారాయణ తెలిపారు.

News March 16, 2024

వందలాది కార్లతో ర్యాలీగా బయలుదేరిన మాగుంట

image

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం తాడేపల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు నుంచి వందలాది కార్లతో తన అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.