News March 16, 2024

అసంతృప్తితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవేంద్ర

image

బీజేపీలో కష్టపడి పని చేసిన పార్టీ అధిష్ఠానం గుర్తించడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. శనివారంలోని నరసింహారెడ్డి నగర్‌లో ఆయన జన్మదిన వేడుకలు అనంతరం బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్‌కు పోటీ చేయాలంటూ రాఘవేంద్రపై వర్గం ఒత్తిడి తీసుకువచ్చింది.

Similar News

News February 12, 2025

‘ఎల్ఐసీ ఉద్యోగులకు పనిభారం తగ్గించండి’

image

LICలో 3, 4 తరగతుల శ్రేణిలో ఖాళీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ రవిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని బ్రాంచ్ కార్యాలయం ముందు సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. LICలో కేవలం ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల్లోనే 3,130 మంది క్లాస్ 3, 4 తరగతుల శ్రేణి ఉద్యోగులు తగ్గారని అన్నారు. పాలసీదారులకు సేవలందించేందుకు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్నారు.

News February 11, 2025

కోరికల కొండ గురించి తెలుసా?

image

శ్రీశైలం పాదయాత్రలో పెద్ద చెరువు దాటిన తర్వాత కోరికల కొండ వస్తుంది. ఈ కొండ మీద మన కోరిక చెప్పుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం. పెళ్లి కావాలనుకునే వారు అక్కడ చిన్న పందిరి వేస్తారట. సంతానం కోరుకొనే వారు ఉయ్యాల కడతారు. సొంతిల్లు కావాలనుకునే వారు ఒక రాయి మీద ఇంకో రాయి పేరుస్తారు. కొంత మంది తమ కోరికలు ఆ కొండ మీద మట్టిలో చేతితో రాస్తారట. మరి మీరు శ్రీశైలానికి పాదయత్రగా వెళ్లారా?

News February 11, 2025

నేడు అహోబిలం రానున్న హీరో సాయిదుర్గ తేజ్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయిదుర్గ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!