India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పకుండా 27వ తేదీలోపు భారత్ను విడిపోవాల్సి ఉంటుందని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. ఈ నియమాన్ని పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అటువంటి వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లాలన్నారు.
మే నెలలో జరగనున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఈనెల 30లోపు చెల్లించాలని గుంటూరు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 3 సబ్జెక్టులకు రూ.110, అంతకు మించితే రూ.125 చెల్లించాలన్నారు. మే 1 నుంచి పరీక్ష ముందు రోజు వరకు చెల్లిస్తే అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్ట్కి రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్ట్కి రూ.1,000లు మే 1లోపు చెల్లించాలన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను సెక్షన్ ఫారమ్-8 కంపెనీగా నమోదు చేసే ప్రక్రియపై శనివారం చర్చ నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో JNTU వీసీ, సెంట్రల్ యూనివర్సిటీ VC, KIA ఇండియా, JSW అధికారులు పాల్గొన్నారు. సెక్షన్ ఫారమ్ 8 కంపెనీని ఏప్రిల్ 30లోపు నమోదు చేయాలన్నారు. టెండర్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సమీక్షించి, అవసరమైన దశలను పరిశీలించారు.
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ పైనుంచి పడి ఒకరు మృతి చెందారు. ఇండస్ట్రియల్ కాలనీలో ఉంటున్న గోవింద్ శనివారం మధ్యాహ్నం ఇంటి మేడపై నడుస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. మద్యం మత్తులో తూలి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సామాజిక చైతన్య ఉత్సవాలు పేరుతో సంఘం శరణం గచ్చామి హైదరాబాద్ వారిచే అంబేడ్కర్ నాటకాన్ని మే 8న ఒంగోలు అంబేడ్కర్ భవనంలో ప్రదర్శిస్తున్నట్లు కేవీపీఎస్ నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు ఆవిష్కరించారు. అంబేడ్కర్ నాటిక ప్రదర్శనను తిలకించడానికి అధిక సంఖ్యలో రావాలని కోరారు.
తల్లితండ్రులను వృద్ధాప్య దశలో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ప్రశాంతి మండిపడ్డారు. శనివారం దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి వయోవృద్ధుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్లో నమోదు అయ్యింది. కలెక్టర్ ఛాంబర్లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదుదారుడి సమక్షంలో కోర్టు నిర్వహించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ప్రతి నెల ఐదు వేలు చెల్లించాలని ఆదేశించారు.
కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను వారం రోజుల లోపు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ స్వయం ఉపాధి పథకం కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పోరేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ షం సున్నిషా బేగం శనివారం తెలిపారు. ఈ పథకం కింద మైనారిటీలకు రూ.లక్ష నుంచి 8 లక్షల రుణంలో 50% సబ్సిడీ మంజూరు చేయబడుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో 21- 55 ఏళ్ల మధ్య బీపీఎల్కు చెందిన వారు మే 25 లోపు https://apobmms.apcfss.in ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం 2025-26 కింద జిల్లా నుంచి 12,138 మంది లబ్ధి పొందారు. ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.24,27,60,000ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మెగా చెక్కును లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో శనివారం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
GVMCలో ఈనెల 28న జరగనున్న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం తెలిపారు. మేయర్ ఎన్నిక సోమవారం కానున్నందున GVMC ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. GVMC జోనల్ కార్యాలయాల్లో యథావిధిగా PGRS ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై జోనల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Sorry, no posts matched your criteria.