India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు చెల్లిస్తున్న సగటు వేతనాన్ని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం జిల్లాలో ఉపాధిహమీ పథకం అమలుపై తమ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెటీరియల్ కాంపోనెంట్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఎం పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఏయూలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన తాత్కాలిక నియామకాలకు పరిపాలన భవనంలో శుక్రవారం ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 10 మందికి పైగా హాజరయ్యారు. శనివారం కూడా ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుంది. ఏయూ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్ విధానంలో వీరిని నియమిస్తున్నారు.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లు, శిథిల భవనాలు వద్ద ఉండరాదని, సురక్షితప్రాంతాల్లో ప్రజలు ఉండాలని సూచించింది.
ఇటీవల ఎంపికైన కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈక్రమంలో కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ విశ్వనాథ్ శుక్రవారం పరిశీలించారు. వసతి, తరగతి గదులు, మైదానాన్ని చెక్ చేశారు. అనంతరం మొక్కల నాటి నీరు పోశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) ప్రకాశ్ బాబు, ఇతర ఉన్నత అధికారులు ఎస్పీ వెంట ఉన్నారు.
విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన స్త్రీ శక్తి పోషణ మహోత్సవం కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సంస్థలు సహా అన్ని కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మారిన జీఎస్టీపై ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్ను సవివరంగా ప్రజలకు తెలియజేయాలన్నారు.
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెషర్స్ డే’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థికి 4 ఏళ్ల B.Tech జీవితం ఎంతో కీలకం అన్నారు. ప్రతీ విద్యార్థి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కేంద్ర భాగస్వామ్యంతో మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ శాసనమండలిలో తెలిపారు. కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పారిశ్రామిక నోడ్లు, బల్క్ డ్రగ్ పార్క్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ డీకే బాలాజీ జీఎస్టీ 2.0 సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పన్ను తగ్గింపులు, వ్యాపారులకు కలిగే లాభాలు ఇంటింటికి చేరేలా చూడాలని ఆదేశించారు. మచిలీపట్నంలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు రూపకల్పన చేయాలని సూచించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అక్టోబర్ 1న సెలవు దినంగా ప్రకటించారు. మహర్నవమి సందర్భంగా ఆరోజు సెలవు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ప్రకటన విడుదల చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా అక్టోబర్ 11వ తేదీన విశ్వవిద్యాలయం పనిచేస్తుందన్నారు. అక్టోబర్ 15న ఏయూ స్నాతకోత్సవం జరగనున్న నేపథ్యంలో 11వ తేదీన వర్సిటీ యథావిధిగా పనిచేస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.