Andhra Pradesh

News February 1, 2025

అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీలో సర్వర్ సమస్య

image

అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తోందని తెలిపారు. స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

News February 1, 2025

నెల్లూరులో RTC బస్సు టైర్ కింద పడి విద్యార్థి మృతి

image

నెల్లూరులో BUS కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. కొడవలూరు(M) రేగడిచెలికు చెందిన మహేందర్ నెల్లూరులో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ అనంతరం ఇంటికి వెళ్లేందుకు BUS ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లగానే ప్రయాణికుల కోసం BUS ఆపిన డ్రైవర్ అనంతరం BUSను కదిలించాడు. పుట్‌పాట్‌పై ఉన్న మహేందర్ పట్టు తప్పి BUS వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

News February 1, 2025

జామి: సర్వర్ డౌన్.. పెన్షన్ పంపిణీ ఆలస్యం

image

ఫిబ్రవరి నెలకు పెన్షన్ పంపిణీ వేకువజాము నుంచే సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే జామి, ఎస్.కోట, తదితర మండలాల్లో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ కోసం వేకువజామునే లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. సర్వర్ డౌన్ కావడంతో లబ్ధిదారులు ఇంటి వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంపై జామి మండల అధికారులు మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యను టెక్నికల్ టీమ్‌కు తెలిపామన్నారు.

News February 1, 2025

అమానుష ఘటన.. మరో 8 మంది అరెస్ట్

image

ప్రేమజంట పారిపోవడానికి సాయం చేసిందని ఆరోపిస్తూ బాలిక బంధువులు ఓ మహిళను వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెల 15న మునిమడుగులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఇప్పటి వరకు 20మంది నిందితులను అనంతపురం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News February 1, 2025

శ్రీకాకుళం: నిమ్మాడ హైవేపై కారు బోల్తా

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు ముందు టైరు పేలడంతో డివైడర్‌ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు సహాయంతో కారుని రోడ్డు పక్కన ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News February 1, 2025

మద్దిలపాలెంలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్‌ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైడ్‌లో వ్యభిచార గృహం నడిపిస్తున్న సంతోశ్ కుమార్‌‌, విటుడు పెందుర్తికి చెందిన కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News February 1, 2025

అనంత జిల్లాకు 14 మద్యం దుకాణాల కేటాయింపు

image

అనంతపురం జిల్లాలో గీత కులాలకు 14 మద్యం దుకాణాలను కేటాయించినట్లు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈడిగలకు 9, కాలాలి 1, గౌడు 2, గౌడ 1, గౌన్లకు 1 కేటాయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 17న రెవెన్యూ భవన్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తామన్నారు.

News February 1, 2025

విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ దుర్మరణం

image

కర్నూలు(D) గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గోనెగండ్ల గ్రామానికి చెందిన బోయ రంగస్వామి (46) ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.

News February 1, 2025

రోడ్డు ప్రమాదంలో వట్టిచేరుకూరు మండల వాసులు మృతి

image

గుంటూరు నగర శివారు ఏటుకూరు-ప్రత్తిపాడు రోడ్డు నల్లపాడు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు వట్టిచేరుకూరు మండలం కుర్నూతల, బయ్యారం గ్రామస్థులుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 1, 2025

నెల్లూరులో ప్రారంభమైన పెన్షన్లు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. జిల్లాలోని 3,08,266 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.132కోట్ల అధికారులు ఇవ్వనున్నారు. మరోవైపు మొదటి రోజే దాదాపు 95 శాతం వరకు పెన్షన్ల పంపిణీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద ఉంటూ పెన్షన్ నగదును అందుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.