Andhra Pradesh

News July 1, 2024

పిఠాపురం: పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న పవన్

image

పిఠాపురం MLAగా గెలుపొంది, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా నియోజకవర్గానికి రానున్నారు. ఉదయం 7:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 9 గంటలకు చేబ్రోలులోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత 9:45 గంటలకు గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 వరకు అక్కడే ఉండి తిరిగి 1గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు.

News July 1, 2024

CTR: నేడు 5.4 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 2.71 లక్షల మందికి సోమవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ 181.02 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. పూతలపట్టు మండలంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు. మరోవైపు తిరుపతి జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.182.33 కోట్లను అందజేయనున్నారు. మొత్తంగా 5.4 లక్షల మందికి రూ.363.05 కోట్లు పంపిణీ చేస్తారు.

News July 1, 2024

ప్రొద్దుటూరు: అసలే మైనర్.. ఆపై ముగ్గురితో డ్రైవింగ్

image

మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు గాంధీ రోడ్డులో స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడి వారిని ప్రశ్నించారు. దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించినట్లు డీఎస్పీ తెలిపారు.

News July 1, 2024

మండవల్లిలో జాతీయ రహదారిపై తిరగబడిన లారీ

image

మండవల్లిలో కైకలూరు సందు వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లారీ తిరగబడింది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా కైకలూరు సందు వద్ద రోడ్డు కటింగ్ పనులు చేస్తున్నారు. తణుకు నుంచి సింగరాయపాలెంకు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ సాయంత్రం 6.30 సమయంలో మట్టిలో దిగబడి తిరగబడింది. వేసవిలో చేయాల్సిన పనులను కాంట్రక్టర్ వర్షాకాలంలో చేపట్టారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

News July 1, 2024

కర్నూలు: నేటి నుంచి బియ్యం, జొన్నల పంపిణీ

image

నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గోదాముల్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు సరకుల నాణ్యత పరిశీలించి నివేదికలు ఇవ్వనున్నారని JC నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై నెలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేయాలని ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. కార్డుదారులు 3 కిలోల వరకు జొన్నలను బియ్యానికి బదులుగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

News July 1, 2024

గిద్దలూరు మీదుగా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు పొడిగింపు

image

గుంటూరు – సికింద్రాబాద్ ట్రైన్ నంబర్ 17253 రైలు జులై 1 నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించి ఔరంగాబాద్ ఎక్స్ ప్రెస్ రైలుగా నడుపుతున్నట్లు గిద్దలూరు కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో ఉదయం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందన్నారు. ఇదే రైలు ఔరంగాబాద్‌లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు గుంటూరు చేరుతుందన్నారు.

News July 1, 2024

విశాఖ: కోస్టల్ రైడర్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయం

image

ఏపీఎల్ సీజన్-3 మ్యాచ్‌లు ఆదివారం రాత్రి విశాఖ వైయస్సార్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాయలసీమ కింగ్స్ జట్టు 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి విజయం సాధించింది.

News July 1, 2024

MP లావు కృష్ణ దేవరాయలు నేటి పర్యటన వివరాలు

image

నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు MP లావు అందుబాటులో ఉండరని పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ గమనించవలసిందిగా తెలిపారు.

News July 1, 2024

త్వరలో మహిళలకు తీపికబురు: కోన

image

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం తీపికబురు చెబుతుందని డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. మండపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో మంత్రులు గంగిరెద్దుల్లా తలలు ఊపడం తప్పించి ఏమీ చేయలేదని అన్నారు. కూటమి మంత్రులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

News July 1, 2024

తొలిరోజే పింఛన్ 100 శాతం పంపిణీ పూర్తిచేయాలి: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

జులై 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న ఆదేశించారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద చేప‌ట్టే సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్ టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేలా కృషిచేయాల‌న్నారు.