India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అవయవదానం మానవతా కోణంతో చేసే ఒక గొప్ప పనని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఓ హాస్పిటల్లో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అవయవదానం కేవలం దానం కాదు, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపే ఆచరణని తెలిపారు. అనంతరం వైద్యులను కలెక్టర్ సన్మానించారు.
విశాఖ పోర్ట్ కళ్యాణ మండపంలో శనివారం 15వ రోజ్గార్ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయన చేతులు మీదుగా 278 మంది అభ్యర్థులకు కేంద్ర నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సేవ, జీవితపు కొత్త ప్రయాణంలో పెద్ద లక్ష్యాలను సాధించడానికి అదే ఉత్సాహంతో పనిచేయాలని వారిని కోరారు. సమాజానికి ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జ్ జి.రామకృష్ణ ప్రసాద్కి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వాగతం పలికారు. అనంతపురంలోని జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్, అనంతపురం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి వర్క్షాప్ జరిగింది. ఇందులో ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ జడ్జ్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ న్యాయాధికారులు పాల్గొన్నారు.
డాక్టర్. వైఎస్సార్ వర్సిటీ లో అప్లైడ్ ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల చిత్ర కళా ప్రదర్శన శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తాము అద్భుతంగా రూపొందించిన కళలను ప్రదర్శించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య విశ్వనాథ కుమార్ విద్యార్థులు రూపొందించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని ప్రశంసించారు.. నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు తగిన సూచనలు అందజేశారు.
ప. గో. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (PGRS) మీకోసం సోమవారం జిల్లా కలెక్టరేట్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అలాగే “1100 మీకోసం కాల్ సెంటర్” ద్వారా ఫిర్యాదులను నమోదు చేయుట, నమోదు అయిన ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవచ్చన్నారు. అన్ని మండల స్థాయి డివిజన్ స్థాయిలో యథావిధిగా పీజిఆర్ఎస్ జరుగుతుందన్నారు.
మే ఒకటో తేదీన సీఎం చంద్రబాబును నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్తో శనివారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల వివరాలపై ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన నిమిత్తం శనివారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్లో ఎంపీ శ్రీ భరత్,ఎమ్మెల్యే గణబాబు, సీపీ శంఖ బ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లారు. మరల సాయంత్రం విశాఖలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.
విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసంలో కూటమి నెగ్గటంతో ఆశావాహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ పదవి TDPకి డిప్యూటీ మేయర్ జనసేనకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే డిప్యూటీ మేయర్ కోసం పలువురు TDP మహిళా కార్పొరేటర్ల భర్తలు లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కొత్తగా కూటమిలో చేరిన వారు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. మరి విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి వస్తుందో కామెంట్ చెయ్యండి.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాచలం, బి.జోగినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేసి స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్లను పరిగణించాలన్నారు. 1998/2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలు కూడా రెగ్యులర్ టీచర్లతో చేయాలన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలకు రెండో టీచర్ను నియమించాలన్నారు.
Sorry, no posts matched your criteria.