India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వేళ ఈ మ.3 గం.లోపు సచివాలయాలు, RBKలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజా ప్రతినిధుల చిత్రపటాలను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. బొబ్బిలి గొల్లవీధికి చెందిన పార్వతి ఆదివారం ఉదయం పూల్ బాగ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒక వృద్ధుడు మృతి చెందిన ఘటనపై ఆదివారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అన్వర్ భాషా తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 12వ తేదీన 50 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. అతని పేరు వివరాలు తెలియలేదని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వృద్ధుడి గురించి తెలిసిన వాళ్ళు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద నేడు జరగనున్న TDP కూటమి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు PM మోదీ హజరవుతుండగా, పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ సాయంత్రం 4.10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7కు హైదరాబాద్ వెళతారు.

దేవరాపల్లి (మం) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డెక్క చిరంజీవి(32) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు విధినిర్వహణలో భాగంగా ములకలాపల్లి పాలకేంద్రం వద్ద విద్యుత్ స్తంభానికి కట్టిన పోస్టర్ను తొలగించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎస్.ఐ డి.నాగేంద్ర ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 6 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. బద్వేలు, రాజంపేట, కోడూరు, జమ్మలమడుగు స్థానాల్లో TDPతో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీకి ఏ సీట్లు వెళ్తాయో చూడాలి. ఏదేమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.

పెందుర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం సబ్బవరంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీకి నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారని, పొత్తులో భాగంగా ఈ సీటును బండారి కేటాయిస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మేరకు టీడీపీ నాయకులు, బండారు అనుచరులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. 2 పర్యాయాలు మలికిపురం మండలం చింతలమోరి సర్పంచిగా, ఒకసారి పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేసిన రాపాక 2009, 2019 ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం రాపాకను నియమించగా బరిలో ఉన్నారు.

సాధారణ ఎన్నికల దృష్ట్యా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోను, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కార్యాలయంలోను కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సంబంధిత పిర్యాదులు, సమాచారం అందించవచ్చని ఆయన వివరించారు.
Sorry, no posts matched your criteria.