Prakasam

News March 19, 2024

అనుమానస్పద ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమానస్పద ఆర్థిక లావాదేవీలు అక్రమంగా డబ్బు తరలింపును కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగము బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్ లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమానస్పద లావాదేవీలు అంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.

News March 18, 2024

ప్రకాశం: 74 మంది ఇంటర్ అధ్యాపకులకు నోటీసులు

image

జిల్లాలో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి గైర్హాజరైన 74 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ అయ్యాయి. ఒంగోలులోని ఓ జూనియర్ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, పౌరశాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు 405 మంది అధ్యాపకులను నియమించారు. వీరిలో 331 మంది హాజరు కాగా, 74 మంది గైర్హాజరయ్యారు. వీరికి ఆర్‌ఐవో సైమన్ విక్టర్ నోటీసులు జారీ చేశారు.

News March 18, 2024

ప్రకాశం: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

అతివేగంగా వస్తున్న బైకు అదుపు తప్పడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మద్దిపాడు ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ఒంగోలు కేంద్రంగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసుకుని తిరిగి ఒంగోలు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను కొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతిచెందాడు.

News March 18, 2024

విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి: డీఈవో

image

జాతీయ ఉపకార వేతనం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికైన విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో కోరారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాలలో స్కాలర్ షిప్ నకు ఎంపికై ప్రస్తుతం 9 నుంచి ఇంటర్ చదువుతూ రెన్యూవల్ చేయించుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా తమ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని తెలిపారు.

News March 18, 2024

పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తప్పక పాటించి సహకారం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయా పార్టీల పాలసీల గురించి మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.

News March 18, 2024

గుడ్లూరు: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

మండలంలోని పొట్లూరులో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా ఉండేందుకు కొందరు విద్యుత్ తీగ ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు(53) శనివారం రాత్రి తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా కాలికి కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. దీంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News March 18, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతి చెందారు. వోలేటివారిపాలెం మండలం కొండ సముద్రానికి చెందిన వేణుగోపాల్(32) జగిత్యాల జిల్లా కొండగట్టుకు వలస వెళ్లారు. నిన్న ఉదయం పసుపులేటి శ్రీకాంత్ (27), వెంకటేశ్ (33) కూలీలను తన బైక్‌పై తీసుకుని మెట్‌పల్లిలో మేస్త్రి పనులకు బయలుదేరాడు. జగిత్యాల-కోరుట్ల మార్గంలో వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు.

News March 18, 2024

దర్శి: బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

image

రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులకు గాయాలైన సంఘటన దర్శి మండలంలోని రాజంపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రుల బంధువు కథనం మేరకు.. పొదిలి విశ్వనాథపురానికి చెందిన అస్మత్‌ బాషా, చరణ్‌తేజ బైక్‌పై దర్శి వెళ్తున్నారు. అదే మార్గంలో ముందు వెళ్తున్న రాజంపల్లికి చెందిన గుర్రపుశాల నాగార్జున గేదెలు అడ్డురావడంతో ముందు బైక్‌ను ఢీకొని పడిపోయారు. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News March 17, 2024

ప్రకాశం: హాల్ టికెట్ ఉంటే బస్సు ప్రయాణం ఫ్రీ

image

ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆర్టీసీ బస్సులలో టెన్త్ క్లాస్ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలోనీ మీ ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రాల వరకు అన్ని పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.

News March 17, 2024

అద్దంకిలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

image

అద్దంకి మండలం అమ్మాయిపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు బోల్తా పడి 15 మందికి గాయాలయ్యాయి. బొద్దికూరపాడుకు చెందిన సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యులతో మనవరాలు పుట్టువెంట్రుకలు తీసుకునేందుకు బస్సులో కోటప్పకొండకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.