India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 3వ తేదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరులో పర్యటిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చీరాలకు వస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడతారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. తాజాగా బలరాం కుమారుడు వెంకటేశ్ చీరాల నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో బలరాం, వెంకటేశ్పై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
జిల్లాలో తొలి దశలో 696 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు డీఈవో డి.సుభద్ర తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన లాటరీలో జిల్లాలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు పలువురు విద్యార్థులు అర్హత సాధించారన్నారు. వీరిలో బీసీలు 234, మైనార్టీలు 53, ఓసీలు 147, ఎస్సీ 244, ఎస్టీ విద్యార్థులు 18 మంది ఉన్నారన్నారు.
చీరాలలో మంగళవారం దారుణం జరిగింది. రైల్వేస్టేషన్లోని మూడో నంబరు ఫ్లాట్ఫారంను దాటుతున్న ఓ గుర్తు తెలియని మహిళను తమిళనాడు ఎక్స్ప్రెస్ ప్రమాదవశాత్తు ఢీకొంది. ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చని రైల్వే ఎస్సై కొండయ్య తెలిపారు. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యంకాలేదు. వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.
ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఏఈడీ)లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు డీసెట్-24 నోటిఫికేషన్ విడుదలైనట్లు DEO సుభద్ర తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో మే 8 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను మే9 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. మే 24న పరీక్ష ఉండగా, మే 30న ఫలితాలు ప్రకటిస్తారు.
వెలిగండ్ల మండలం తమ్మినేనిపల్లికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి గుంటూరులో మంగళవారం అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ పైనుంచి జారిపడి మృతి చెందారు. ఈ ప్రమాదంపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సివుంది.
ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఒంగోలు వచ్చిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను దామచర్ల జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకేను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై బాలకృష్ణ ఆరా తీసినట్లు తెలిసింది. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న సూపరింటెండెంట్ తోపాటు పలువురు ఉద్యోగులు వారి మాతృశాఖకు తిరిగి వెళ్లారు. కొన్నేళ్ల నుంచి పలువురు ఉద్యోగులు వైద్యశాఖ అనుబంధ శాఖల్లో పనిచేస్తూ డిప్యూటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖకు వచ్చారు. వైద్యశాఖ సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాసరావుతో పాటు మరో ఐదుగురు ఉద్యోగులు మంగళవారం రిలీవ్ అయ్యి మాతృశాఖకు వెళ్లారు.
బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశానికి లాటరీ విధానంలో 696 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. వీరిలో బీసీలు 234 మంది, మైనార్టీలు 53 మంది, ఓసీలు 147, ఎస్సీలు 244, ఎస్టీలు 18 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మే 10వ తేదీలోపు సంబంధిత పత్రాలు సమర్పించి ప్రవేశం పొందాలన్నారు.
Sorry, no posts matched your criteria.