India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఖరీఫ్లో పంటలు సాగు చేసిన రైతులు ఈ-క్రాప్ యాప్లో నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ జేడీ ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. సెప్టెంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులు, కౌలు రైతులు ఈ-పంట దరఖాస్తు ఫారం పూర్తి చేసి, వారి పొలం పూర్తి వివరాలు నమోదు చేసి గ్రామ వ్యవసాయ సహాయకులతో నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిపై 427 కుటుంబాలు మంగళగిరిలోని TDP కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాయి. బాలినేనికి ఓట్లు వేయలేదన్న కక్షతో వారికి చెందాల్సిన భూములను.. వేరేవాళ్లకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వినతులను స్వీకరించిన మంత్రి ఆనం రాంనారయణ రెడ్డి, TDP పొలిట్బ్యూరో సభ్యుడు వర్లరామయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నామని వివరించారు.
మానవత్వాన్ని మంటగలిపే ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం ఏల్చూరులోని దర్గా సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేశారు. సోమవారం రాత్రి అటుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి ICDS అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకొని వెంటనే శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ఇలా చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
భూ సంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ తమీమ్ అన్సారీయ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ సదస్సు 45 రోజులు పాటు జరుగుతుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు.
గ్రానైట్ బండరాయి పడి లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కనిగిరి పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. ఎస్సై త్యాగరాజు వివరాల ప్రకారం… పట్టణంలోని ఓ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ బండరాయిని క్రేన్ తో లారీ పైకి లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒరిగి లారీ డ్రైవర్ రత్తయ్యపై పడింది. గాయాలైన రత్తయ్యను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ దామోదర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఫిర్యాదులు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
ఒంగోలులోని ప్రకాశం భవన్లో ‘మీకోసం’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీ తీసుకు వచ్చిన ఓ దివ్యాంగుని కోసం వేదిక నుంచి కిందికి వచ్చి అతని వివరాలు కలెక్టర్ తెలుసుకున్నారు. మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి టి భరద్వాజ్ ఆదివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీఐ డిప్లొమా, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ చదువులు పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.
తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో APలోని పలు జిల్లాలకు చెందిన ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. <<13831591>>ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు మృతి<<>> చెందినట్లుగా ప్రచారం జరిగింది. కారణం మృతుల్లో ప్రొద్దుటూరుకు చెందిన నితిశ్ ఇంటిపేరు గిద్దలూరు కావడం, గాయపడిన చైతన్యది పొదిలని తెలియడంతో ఐదుగురు ప్రకాశం వాసులు మృతి చెందినట్లు ప్రచారం జరిగింది.
తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందినట్లు వార్తలు రాగా జిల్లాలో విషాదం నెలకొంది. దీంతో చెన్నై SRMలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులంతా ఆందోళన చెందారు.<<13831591>> ప్రకాశం వాసులు చనిపోలేదని<<>>, పొదిలికి చెందిన కొల్లూరు చైతన్యకుమార్కు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
Sorry, no posts matched your criteria.