Prakasam

News February 18, 2025

టెట్‌ విషయంలో లోకేశ్‌పై ప్రకాశం MLA సెటైర్లు

image

మంత్రి లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి X వేదికగా కామెంట్ చేశారు.”బాబు లోకేశ్ గారు మెగా డీఎస్సీ ద్వారా అధికారంలోకి వచ్చిన 6నెలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి, జగనన్న హయాంలో ఇచ్చిన DSC నోటిఫికేషన్ రద్దు చేశారన్నారు. 9 నెలల తర్వాత అడుగుతున్నా. మీ హెరిటేజ్ సంస్థ షేర్ పెరిగిందని, సంతకం పెట్టిన 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదు దొర.? అని ట్వీట్ చేశారు.

News February 18, 2025

ప్రకాశం: SP పరిష్కార వేదికకు 81 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలువైపుల నుంచి విచ్చేసిన ప్రజలు వారి ఫిర్యాదుల గురించి ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ వేదికకు 81 ఫిర్యాదుల అందినట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

News February 17, 2025

ఒంగోలులో విద్యుత్ అదాలత్ కార్యక్రమం

image

ఒంగోలులో ఈ నెల 18 తేదిన డివిజన్ స్థాయి విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఒంగోలు ఈఈ ఏం.హరిబాబు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరమ్ ఛైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ పాల్గొంటారని అన్నారు. ఉదయం 10:30 గం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కార్యక్రమం ఉంటుందని అన్నారు. దీర్ఘ కాలంగా పరిష్కారం కాని విద్యుత్ సమస్యలకు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.

News February 17, 2025

ప్రకాశం: కంభంలో మహిళ ఆత్మహత్య

image

కంభం మండలంలో వ్యాస్మాల్ తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గోవిందాపురానికి చెందిన శ్యామల భర్తతో విడిపోయి కంభంలోని బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరి మధ్య గొడవ కారణంగా మనస్తాపం చెంది ఆదివారం వ్యాస్మాల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

News February 16, 2025

విద్యార్థులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి: ఎస్పీ

image

విద్యార్థులు తమ సామర్థ్యాలకు అనుగుణంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఆదివారం ఒంగోలులో జరిగిన బాలోత్సవం కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి స్థాయి నుండే బాలలు మంచి అలవాట్లతో, ఒత్తిడి లేని విధానంలో అభివృద్ధి చెందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు

News February 16, 2025

ప్రకాశం: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

image

పల్నాడు జిల్లా నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెసిందే. హైదరాబాద్ నుంచి మద్దిపాడుకు వస్తుండగా లారీ, కారును ఢీకొట్టింది. తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

News February 16, 2025

ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News February 16, 2025

ఒంగోలు: ‘దివ్యాంగుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

image

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

News February 15, 2025

వెలిగండ్ల మండలంలో సూపర్‌వైజర్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని పద్మాపురంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం లేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవే ఫైవ్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఏనుగు ప్రతాపరెడ్డి శనివారం ఇంటి ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ భీమా నాయక్, ఎస్ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 15, 2025

కందుకూరు: చంద్రబాబు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి.!

image

సీఎం చంద్రబాబు కొద్ది సేపట్లో కందుకూరు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చే అంశంపై ఆయన ఏం చెప్తారో అన్న ఆసక్తి నియోజకవర్గ ప్రజలలో నెలకొంది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేరుస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు వాగ్దానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!