India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని మంత్రి స్వామి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని.. త్వరలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను రోడ్డున పడేశారని విమర్శించారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీచైతన్య స్కూల్లో 6వ తరగతి విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. విచారణ నిమిత్తం కలెక్టర్ రాజాబాబు త్రిసభ్య కమిటీ నియమించారు. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి వివరణ ఇవ్వాలని స్కూల్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాళ్లు రిప్లే ఇవ్వకపోవడంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ అనుమతి రద్దు చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక వెల్లడించారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్పై భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు.. నమ్మకం, ఆదరణ, ఆశ్రయం’ అని ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంపై అభిమానాన్ని బయటపెట్టారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల (గ్రూప్-4: 12, క్లాస్-4: 30) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్ట్లు ఉన్నాయి. అర్హులైన వారు ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.prakasam.ap.gov.in వెబ్సైట్ను సందర్శించి, దరఖాస్తులను ఒంగోలు కలెక్టరేట్లో సమర్పించాలని కలెక్టర్ రాజబాబు తెలిపారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల (గ్రూప్-4: 12, క్లాస్-4: 30) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్ట్లు ఉన్నాయి. అర్హులైన వారు ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.prakasam.ap.gov.in వెబ్సైట్ను సందర్శించి, దరఖాస్తులను ఒంగోలు కలెక్టరేట్లో సమర్పించాలని కలెక్టర్ రాజబాబు తెలిపారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు విధుల్లో ఉండగా మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు కాగా మృతదేహాన్ని అక్కడికి తరలించారు. ఐదు నెలల క్రితం ఈయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 19న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 19న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 19న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.