India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 19న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 19న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రకాశం భవనంలో జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులు 22(ఏ) కేసులు, మ్యుటేషన్లు, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు వారాల గడువులోనే కేసులు పరిష్కరించాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఆలస్యం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం భవనంలో జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులు 22(ఏ) కేసులు, మ్యుటేషన్లు, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు వారాల గడువులోనే కేసులు పరిష్కరించాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఆలస్యం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగుల భరోసా కోసం ‘శక్తి’ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, శిక్షణ, సామాజిక మద్దతు అందించి వారిని స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహించనున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని దివ్యాంగుల స్వావలంబనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.

ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. లేఅవుట్ అప్రూవల్ కోసం పెండింగ్లో ఉన్న పలు సర్వే నంబర్లలోని భూములను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వివరాలను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును తనిఖీ చేశారు. ఈ పర్యటనలో అద్దంకి ఆర్డీవోతో పాటు పలువురు తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. గడువు లోపు చెల్లిస్తే సర్ ఛార్జ్, పెనాల్టీ పడదని అన్నారు. జిల్లాలో కోట్ల రూపాయల మేర బిల్లు బకాయిలు విద్యుత్ సంస్థకు పెనుభారంగా మారాయని ఆయన తెలిపారు. ఆన్లైన్లో కూడా బిల్లులు చెల్లించవచ్చు అని తెలిపారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు నెల రోజులు ‘లేడీస్ టైలరింగ్’పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు ఒంగోలులోని రూడ్సెట్లో శిక్షణ ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులన్నారు. శిక్షణలో ఉచిత భోజన, వసతి, సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్సెట్కు రావాలన్నారు.

పొన్నలూరు (M)లోని 22 గ్రామాల సమస్య ఇది. కరోనా కష్టకాలంలో యూజర్లను తమవైపు తిప్పుకున్న నెట్వర్క్లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ప్రధానంగా K.అగ్రహారంలో కొద్దిరోజులక్రితం సెల్ టవర్లు తీసేశారు. ప్రస్తుతం ఆ ప్రాంత వాసుల పరిస్థితి అడవుల్లో జీవిస్తున్నట్లే ఉంది. దీంతో సచివాలయ, బ్యాంక్ సేవలు సైతం డల్ అయ్యాయి. ఇదే ప్రాంతంలో BSNL టవర్ నిరుపయోగంగా ఉంది. 10 రోజులుగా కాల్స్ కూడా రావట్లేదని యూజర్ల ఆరోపిస్తున్నారు.

ప్రకాశం(D) మద్దిపాడు(M) అన్నంగి గ్రామానికి చెందిన మల్లవరపు నందిని ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఫిబ్రవరి 23న RRB (PO), Feb 27న SBI (JA), మార్చి 2న UBI (CSA), March 15న RRB (Clerk) ఉద్యోగాలు పొందింది. శంకరాచారి, మస్తానమ్మలకు ముగ్గురు కుమార్తెలు కాగా, నందిని చివరి అమ్మాయి. ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ పట్టుదలతో విజయం సాధించారు. 4 ఉద్యోగాలు సాధించిన ఆమె యువతకు ప్రేరణగా నిలిచారు.
Sorry, no posts matched your criteria.