Prakasam

News February 9, 2025

ప్రకాశం జిల్లా ఎస్పీ కీలక సూచనలు

image

ఒంగోలులో ఆదివారం రైజ్ కళాశాల, టెక్ బుల్ సమస్థ అధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు హెల్మెట్  రక్షణ కవచం లాంటిదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు.  ఈ రన్‌లో పాల్గొన్న  ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.

News February 9, 2025

బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు: కలెక్టర్

image

మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. రైజ్ కళాశాల, టెక్ బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలులో 5K రన్ నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన, మాదకద్రవ్యాల నివారణ కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు మినీ స్టేడియం వద్ద ముగిసింది

News February 9, 2025

ప్రకాశం జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

ప్రకాశం జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న ప్రకాశం జిల్లాలో గరిష్ఠంగా 33.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరినీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 9, 2025

ప్రకాశం: రేపటినుంచి పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సోమవారం నుంచి 20వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పరీక్షలను నిర్వహించాలని తెలిపారు.

News February 9, 2025

ప్రకాశం: 17 మద్యం షాపులకు 160 దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 17 మద్యం షాపులకు 160 దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అన్నారు. ఈ ధరఖాస్తుల ద్వారా రూ.2 లక్షల చొప్పున రూ.3.20 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈనెల 10న ఒంగోలులోని స్థానిక అంబేడ్కర్ భవన్‌లో లాటరీ పద్ధతిలో కలెక్టర్ షాపులు కేటాయిస్తామన్నారు.

News February 9, 2025

ప్రకాశం జిల్లా పునర్విభజనపై మీ కామెంట్..!

image

అద్దంకిని బాపట్ల, కందుకూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. ఆ రెండు ఏరియాల ప్రజలకు గతంలో 50KM లోపే జిల్లా కేంద్రం(ఒంగోలు) ఉండేది. ఇప్పుడు ఆ దూరం పెరిగింది. ప్రస్తుతం మార్కాపురాన్ని జిల్లా చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలోనే అద్దంకి, కందుకూరును తిరిగి ప్రకాశంలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ ఏరియాను మార్కాపురం లేదా ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంచాలో కామెంట్ చేయండి.

News February 8, 2025

MP మాగుంటకు మరో కీలక పదవి

image

జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) మెంబెర్‌గా ఒంగోలు MPమాగుంట శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ మాగుంట ఇప్పటికే కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల శాఖ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

News February 8, 2025

ఒంగోలు: తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలి: కలెక్టర్

image

వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్, జేసీతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, వార్డుల వారీగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించడంతో పాటు, ఏప్రిల్ నెల వరకు ఎంత మేర నీరు అవసరమో వాటర్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

News February 8, 2025

ఐ లవ్ ఒంగోలు అంటూ RGV ట్వీట్

image

ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఐ లవ్ ఒంగోల్. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్. 3 ఛీర్స్’ అంటూ పెగ్గుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లో ఫొటోలను మార్ఫింగ్ కేసులో ఆయన విచారణ నిమిత్తం ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

News February 8, 2025

సుగమ్య భారత్ యాత్రను ప్రారంభించిన ప్రకాశం కలెక్టర్

image

సమాజంలో దివ్యాంగులకు కూడా నూతన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. విభన్నుల ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను శుక్రవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్‌తో పాటు రాష్ట్ర విభన్న ప్రతిభా వంతులశాఖ డైరక్టర్ రవిప్రకాశ్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు.

error: Content is protected !!