Prakasam

News August 10, 2024

గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున జరుగుతున్న గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. స్థానిక ప్రకాశం భవనంలో శుక్రవారం హౌసింగ్, ఆర్ డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, మెప్మా, డ్వామా, జెడ్పీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం హౌసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ వహించాలన్నారు.

News August 10, 2024

పామూరు: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

image

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన సంఘటన ప్రకాశం జిల్లా పామూరులో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని డీవీపాలెం వద్ద ఉన్న చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయి మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వారిగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 10, 2024

జిల్లా సమగ్రాభివృద్ధికి యాక్షన్ ప్లాన్: కలెక్టర్

image

2047వ సంవత్సరానికి అన్ని రంగాల్లోనూ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావడం అత్యంత కీలకమని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ దిశగా బ్యాంకు రుణాలిచ్చి స్వశక్తి సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలు, బ్యాంకుల అధికారులతో కలెక్టర్ శుక్రవారం చర్చించారు.

News August 10, 2024

ప్రకాశం: 27 మంది ఎంపీడీవోలు బదిలీ

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 27 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ప్రకాశం జిల్లా జెడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీరందరూ గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోలుగా పనిచేస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బదిలీపై వచ్చారు. తిరిగి మళ్లీ వారిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వుల వెలుపడ్డాయి.

News August 10, 2024

ప్రకాశం జిల్లాలో పురాతన శాసనాలు

image

ప్రకాశం జిల్లాలో విజయనగర సామ్రాజ్య కాలం నాటి పురాతన శాసనాలు బయటపడ్డాయి. యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామ సమీపంలో రెండవ దేవరాయల కాలం నాటి శాసనాన్ని స్థానికులు గుర్తించారు. ఈ శాసనం నల్లమల అడవిలో ఉన్న నంది స్తంభానికి నాలుగు వైపులా చెక్కి ఉంది.

News August 10, 2024

చీరాలలో పర్యటించిన మాజీ ఉప రాష్ట్రపతి

image

చీరాలలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఎం. కొండయ్య రైల్వే స్టేషన్లో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాగర్లమూడిలో కుప్పుస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణకు వెంకయ్యనాయుడు హాజరయ్యేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News August 10, 2024

ఈవీఎంల చెకింగ్.. ఒంగోలులోనే ఎందుకు.?

image

ఒంగోలులో ఈ నెల 19 నుంచి 24వరకు ఈవీఎంల పరిశీలన జరగనుంది. దీనికి కారణం ఏంటంటే.. ఇటీవల ఎన్నికల్లో అవకతకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. ఈవీఎంల పరిశీలనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బెల్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసిన వారికి డమ్మీ బ్యాలెట్‌లు ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ చూపించనున్నారు. 12పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను పరిశీలించనున్నారు.

News August 10, 2024

మార్కాపురంలో మూడు రంగుల అరుదైన పక్షి

image

మార్కాపురం పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలోని చెట్టుపై శుక్రవారం మునియా పక్షి దర్శనమిచ్చింది. మూడు రంగులలో పక్షి ఉండటంతో దీనిని త్రివర్ణ మునియా అంటారని అటవీశాఖ స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు. కనిపించకుండా పోతున్న జాతుల్లో త్రివర్ణ మునియా జాతి ఒకటని అన్నారు. కళాశాల ప్రాంగణంలో చెట్లపై ఈ పక్షిని గమనించిన విద్యార్థులు వింతగా చూశారు.

News August 10, 2024

సెంట్రల్‌ జోన్‌ అథ్లెటిక్‌ పోటీలకు దోర్నాల బాలికల ఎంపిక

image

దోర్నాలలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సెంట్రల్‌ జోన్‌ అథ్లెటిక్‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అథ్లెటిక్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. సెప్టెంబరులో జరిగే సెంట్రల్‌ జోన్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు.

News August 9, 2024

త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ప్రమాదం

image

త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, టాటాఏస్ వ్యాన్ ఢీకొన్నాయి. మూడు వాహనాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. టాటాఏస్ వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.