Prakasam

News April 10, 2025

నారాలోకేశ్ సూచనతో చేబ్రోలు కిరణ్ దూషణలు: ఎమ్మెల్యే తాటిపర్తి

image

జగన్ కుటుంబంపై చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘విశృంఖలంగా, విచ్చలవిడిగా, వికృతంగా, వినాశనంగా, విపరీతంగా టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా పోటీపడి మరి వైసీపీ నాయకులపై, వారి కుటుంబాలపై చేస్తున్న ‘మానసిక సామూహిక ఉన్మాదం’ తారాస్థాయికి చేరిందని చెప్పటానికి సాక్ష్యం నారా లోకేశ్ సూచనతో కిరణ్ చేసిన దూషణలే’ అంటూ గురువారం ట్వీట్ చేశారు.

News April 10, 2025

ప్రకాశం: విషాదం.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

image

తాడేపల్లి పరిధిలోని ఇప్పటంలో విషాదం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పనికోసం వెళ్లిన కుటుంబంలో ఈ విషాదం జరిగింది. అపార్ట్‌మెంట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి బాధిత కుటుంబాన్ని, చిన్నారుల మృతదేహాలను అద్దంకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

News April 10, 2025

ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది: ప్రకాశం జేసీ

image

అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలుదారులకు అవసరమైన సూచనలు చేసేలా రూపొందించిన పోస్టర్లను బుధవారం ప్రకాశం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, విజయకుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు.

News April 10, 2025

ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది: ప్రకాశం జేసీ

image

అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలుదారులకు అవసరమైన సూచనలు చేసేలా రూపొందించిన పోస్టర్లను బుధవారం ప్రకాశం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, విజయకుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు.

News April 9, 2025

దిశా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ

image

ఒంగోలులో ప్రకాశం భవన్‌లో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశానికి ఛైర్మన్‌గా ఎంపీ మాగుంట వ్యవహరించారు. దిశా కమిటీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి ముందుకు నడిపించాలని ఆయన అన్నారు.

News April 9, 2025

ప్రకాశం జిల్లాలో ముగ్గురు మృతి

image

ప్రకాశం జిల్లాలో వేరు వేరు ఘటనలలో మంగళవారం ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం వల్లూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం, బైక్‌ను ఢీకొట్టడంతో వర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టంగుటూరులోని రైల్వే గేట్ వద్ద విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. అర్ధవీడులో మద్యం మత్తులో కన్న తండ్రి, కుమారుడిని కత్తితో పొడవటంతో తీవ్రగాయాలతో షాకీర్ మృతి చెందాడు.

News April 9, 2025

ఒంగోలు: మేనకోడలిపై 4ఏళ్లుగా అఘాయిత్యం

image

సొంత మేనమామ మేనకోడలిపై 4 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని బాలిక తట్టుకోలేక ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. తల్లి అరబ్ దేశంలో పని కోసం వెళ్లింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పుకున్న ఏమి చేయకపోవడంతో 4 సంవత్సరాలుగా మేనమామ చిత్రహింసలు భరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్ పరీక్షలు రాసి పనిచేసుకుంటూ ఉంది. ఎస్సై కృష్ణ పావని కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2025

ప్రకాశం: కూతురి బర్త్ డే.. తండ్రి సూసైడ్

image

కూతురి పుట్టిన రోజే తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెంలోని దేశాయిపేటలో జరిగింది. కానిస్టేబుల్ రమేశ్‌‌తో భార్య దూరంగా ఉంటూ కోర్టులో కేసు వేసింది. సోమవారం కోర్టుకు హాజరుకావాల్సిన ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 9, 2025

ప్రకాశం: తల్లికి పునర్జన్మనిచ్చి కుమారుడి మృతి

image

మద్యం మత్తులో భర్త భార్యను పొడవబోయిన కత్తికి కుమారుడు బలయ్యాడు. దీంతో తల్లికి పునర్జన్మనిచ్చి కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అర్ధవీడుకు చెందిన షేక్. ఖాసిం వలి తరచూ మద్యం తాగి ఇంటి వద్ద భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి కూడా గొడవ పడుతూ కత్తితో తన భార్యను పొడవబోగా కుమారుడు షాకీర్ అడ్డు రావటంతో కత్తిపోటుకు గురై మృతి చెందాడు.

News April 8, 2025

రూ.143 కోట్లతో మరమ్మతులు: మంత్రి స్వామి

image

మంత్రి స్వామి డెహ్రాడూన్‌లో జరుగుతున్న చింతన్ శివిర్ రెండవ రోజు సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు‌. ఈ సందర్భంగా ఏపీలో అమలు చేయనున్న పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.