Prakasam

News August 8, 2024

పొదిలి: అమ్మకు వందనం పథకం పేరుతో మోసం

image

సైబర్ మోసగాళ్లు కొత్త మోసానికి తెరలేపుతున్నారు. తాజాగా అమ్మకు వందనం పథకం పేరుతో పొదిలిలో బుధవారం ఒకరికి కుచ్చు టోపీ పెట్టారు. బాధితుడి వివరాల ప్రకారం.. పొదిలికి చెందిన రామకృష్ణకు వాలంటీర్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. తాను సచివాలయం నుంచి మాట్లాడుతున్నానని అమ్మకు వందనం పథకం డబ్బులు ఖాతాలో జమ అవ్వలేదా అని అడిగారు. తెలియదు అనగా ఫోన్ పే ఓపెన్ చేసి ఇలా చేయాలంటూ రూ.22వేలు మాయం చేశారు. కేసు నమోదైంది.

News August 8, 2024

లింగసముద్రం: రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

image

లింగసముద్రంలోని కమ్మిశెట్టి రామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సాఫ్ట్‌ బాల్‌ ఆటలో రాణించడంతో రాష్ట్ర స్థాయి ఆటలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమ్మడిశెట్టి మాధవరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపికైన వెంకటేశ్, ప్రతిమలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీఈటీలు పాల్గొన్నారు.

News August 7, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

* పొదిలి: కుమారుడి కంటి గాయం.. తల్లిదండ్రుల ఆవేదన* చీరాల నేతలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు* కరుణానిధి కుటుంబీకులది ఒంగోలే * గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించిన ప్రకాశం కలెక్టర్* ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో చీరాల విద్యార్థిని మృతి* జిల్లా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి* చీరాలలో యువకుడు దారుణ హత్య * దోర్నాల్లో చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య* సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

News August 7, 2024

పొదిలి: కుమారుడి కంటికి గాయం.. తల్లిదండ్రుల ఆవేదన

image

తమ కుమారుడు రామ్ లక్ష్మణ్‌ను ఉపాధ్యాయుడు బెత్తంలో కొట్టడంతో కంటికి గాయమైందని పొదిలికి చెందిన రమణమ్మ వాపోయారు. దీంతో తమ కుమారుడు చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. శస్త్ర చికిత్స చేయించినా చూపు వస్తోందో లేదో అని వైద్యులు చెప్పారని ఆమె వివరించారు. వైద్యం కోసం ఉపాధ్యాయుడు డబ్బులివ్వడానికి నిరాకరించాడని, దీంతో తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు చెప్పారు. తమకు సాయం చేయాలని కోరారు.

News August 7, 2024

చీరాల నేతలతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు

image

చీరాలలో నేడు చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీరాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. చీరాలకు చెందిన నేతలతో చంద్రబాబు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోవడం, అలాగే చేనేత రంగం గురించి ప్రసంగించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పలువురు మంత్రులు సైతం కార్యక్రమంలో పాల్గొంటారు.

News August 7, 2024

ఒంగోలు: ముత్తువెల్ కరుణానిధి మన తెలుగువారే.!

image

తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువ కాలం CMగా పనిచేసిన వ్యక్తి కరుణానిధి. 13 సార్లు MLAగా ఎన్నికై గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. వారి పూర్వీకులది ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామం. వారి ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పనిచేశారని సమాచారం. కాగా నేడు కరుణానిధి మరణించిన రోజు కావడంతో ఈ విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.

News August 7, 2024

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రకృత్తి విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో మంగళవారం సమీక్షించి మాట్లాడారు. 2047 నాటికి జిల్లా సాధించాల్సిన అభివృద్ధిని తెలిపేలా ప్రణాళికలు ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల టూర్‌ డైరీలను పరిశీలిస్తానని తెలిపారు.

News August 7, 2024

ఇడుపులపాయ IIITలో చీరాల విద్యార్థిని ఆత్మహత్య

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంది. చీరాలకు చెందిన యువతి(17) ఇడుపులపాయలో ఉన్న ఒంగోలు క్యాంపస్‌లో చదువుతోంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి బాత్ రూంలో ఉరేసుకుంది. విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 7, 2024

చీరాలలో కలకలం రేపుతున్న వరుస హత్యలు

image

వరుస హత్యలతో చీరాల అట్టుడుకుతోందని 2 నెలల వ్యవధిలో 4 హత్యలు జరిగాయని స్థానికులు భయపడుతున్నారు. ఈపూరుపాలెంలో ఇద్దరు మహిళలు, చీరాల పట్టణంలో ఇద్దరు యువకులు హతమయ్యారు. ఈపూరుపాలెంలో సుచరిత అనే యువతి హత్యాచారానికి గురవ్వగా, రిటైర్డ్ టీచర్ లలితమ్మ దుండగుడి కత్తి దాడికి బలైంది. చీరాలలో సంతోష్ అనే కర్రీస్ పాయింట్ యజమాని, <<13794466>>తాజాగా ఈపూరుపాలెం యువకుడు ఆరిఫ్ హతమవ్వగా<<>> పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

News August 7, 2024

చీరాలలో యువకుడి దారుణ హత్య

image

బాపట్ల జిల్లా చీరాల ఆదినారాయణపురం వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సైకిల్ మీద వెళ్తున్న సయ్యద్ అరీఫ్ (18)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆరిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైకిల్ కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో వాగ్వాదం జరిగి.. ఆగ్రహించి కారు డ్రైవర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.