Prakasam

News February 1, 2025

దొనకొండ: సచివాలయ ఉద్యోగిపై దాడి చేసి పెన్షన్ నగదు చోరీ

image

దొనకొండ మండలం పెద్దన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ వీరం రంగారెడ్డి దగ్గర రూ.2,64,000 పెన్షన్ నగదును గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సొంతూరు చందవరం నుంచి పెద్దన్నపాలెంకు పింఛన్ పంపిణీకి వస్తుండగా బాధాపురం సమీపంలో బండి ఆపి ఉద్యోగిని కొట్టి నగదును తీసుకెళ్లారన్నారు. వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 31, 2025

సంతనూతలపాడులో అగ్ని ప్రమాదం

image

సంతనూతలపాడు మండలం గొర్ల మిట్టలో శుక్రవారం మద్దినేని సుబ్బారావు, మద్దినేని లక్ష్మీనారాయణ అనే రైతులకు చెందిన పొగాకు బేరన్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు సుమారు పది లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. పొగాకు, కర్ర టైర్లు, కాలిపోయి బారెన్ దెబ్బతిన్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 31, 2025

2న ఒంగోలులో ఆరామ క్షేత్రం ప్రారంభం

image

రంగారాయుడు చెరువు వద్ద ఒంగోలు నగర భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆరామ క్షేత్రాన్ని నిర్మించారు. దీనిని ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు పద్మశాలి సంఘ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందరూ పాల్గొనాలని కోరారు.

News January 31, 2025

ఒంగోలు: ‘సకాలంలో లక్ష్యాలను సాధించాలి’

image

జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు  గురువారం ఇండియన్ మెడికల్ హాల్‌లో  వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, కుటుంబ, సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సకాలంలో లక్ష్యాలను సాధించాలని ఆయన వైద్య సిబ్బందికి ఆదేశించారు.

News January 31, 2025

ఒంగోలు: ఫిబ్రవరి 5న వైసీపీ ‘ఫీజు పోరు’

image

ఫిబ్రవరి 5వ తేదీన జరిగే వైసీపీ ఫీజు పోరు పోస్టర్‌ను ఒంగోలు వైసీపీ కార్యాలయం వద్ద జిల్లా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రూ.3900 కోట్ల ఫీజుల బకాయి ఫీజులు చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు.

News January 30, 2025

అర్జీలను వెంటనే పరిష్కరించండి: ప్రకాశం కలెక్టర్ 

image

తర్లుపాడు తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం సందర్శించారు. ముందుగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించి, రెవెన్యూ సదస్సు, బంగారు బాల్యంపై విచారించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

News January 30, 2025

5న ప్రకాశం జిల్లాకు పవన్.. భారీ బహిరంగ సభ?

image

పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 5న ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ ఒంగోలుకు వచ్చేందుకు సుముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, తన బలాన్ని చాటుకోవాలని బాలినేని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే జనసేనలోకి పవన్ సమక్షంలో భారీగా చేరికలు ఉండనున్నట్లు టాక్. పవన్ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

News January 30, 2025

ప్రకాశం జిల్లాలోని ఆ 8 కొండలకు పేర్లు పెట్టాలి.!

image

పార్లమెంట్ సభ్యులతో మంగళవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో భాగంగా.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి CMని కలిశారు. ఒంగోలు దగ్గర విమానాశ్రయం, ఒంగోలులో మ్యూజిక్- డాన్స్ కాలేజీ, గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం చెరువు అభివృద్ధితోపాటు చెరువులోని 8 కొండలకు అష్టదిగ్గజాల పేర్లు పెట్టడం గురించి లిఖిత పూర్వకంగా కోరారు.

News January 30, 2025

పొదిలి: చెల్లిని హత్య చేసిన కేసులో అన్నకు రిమాండ్.!

image

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లెలిని సొంత అన్నే హత్య చేసిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు బుధవారం అన్నారు. పునుగోడుకు చెందిన సంధ్యను అన్న అశోక్ గత ఏడాది ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశోక్ కుమార్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

News January 30, 2025

ఒంగోలు: మద్యం తాగి వచ్చిన వారికి నో టోకెన్

image

ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న క్యాంటీన్ వద్దకు ఎందరో ప్రజలు తమ ఆకలిని తీర్చుకునేందుకు వస్తుంటారు. అదే సమయానికి పలువురు మద్యం ప్రియులు అన్న క్యాంటీన్ వద్ద హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు ఓ బోర్డును ఏర్పాటు చేశారు. మద్యం తాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వడం కుదరదని ఆ బోర్డు సారాంశం.