Prakasam

News August 5, 2024

కురిచేడు: అప్పు చెల్లించకపోవడంతో ఫిర్యాదు

image

ఉంగుటూరు మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన బలే వేణుగోపాల్ పది సంవత్సరాల క్రితం బయ్యవరం వచ్చి చేపలు పెంపకం చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం కురిచేడు మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన అడుసుమల్లి వెంకట అప్పారావు వద్ద రూ.8.60 లక్షలను అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వకపోవడంతో అప్పారావు కురిచేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News August 5, 2024

ప్రకాశం జిల్లాకు నేడు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాధ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News August 5, 2024

కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు: ప్రకాశం కలెక్టర్

image

పలు మండలాల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మండల స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా బడికి వెళ్లకుండా పనికి వెళ్తున్న చిన్నారులను గుర్తించేందుకు, ఆయా శాఖ పరిధిలో గల సిబ్బంది దృష్టి సారించారు. ఈనెల 31వ తేదీ వరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News August 4, 2024

రేపు CM వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సోమవారం సీఎం చంద్రబాబు ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మీకోసం కార్యక్రమానికి గైర్హాజరవుతారన్నారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారితోపాటు, ఇతర అధికారులు మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

News August 4, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

✎రామతీర్థానికి నిలిచిన నీటి సరఫరా
✎యర్రగొండపాలెం హై స్కూల్లో అగ్నిప్రమాదం
✎ ఒంగోలు: బాలికను తల్లిని చేసిన యువకుల అరెస్ట్
✎ ప్రకాశం: పోస్టింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే బదిలీ
✎మేదరమెట్ల మిర్చి ఫ్యాక్టరీ వద్ద స్వల్ప ఉద్రిక్తత
✎ రోడ్డు ప్రమాదంలో సంతమాగులూరు వ్యక్తి మృతి
✎కందుకూరులో 54 మందికి ఉద్యోగాలు
✎ప్రకాశం: కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
✎ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

News August 4, 2024

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

image

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం చెందిన వంశీకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి శ్రీశైలం వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంలో బోడే నాయక్ తండ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రక్షణ గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 4, 2024

కొవిడ్ కాల నష్ట నివారణపై ప్రశ్నించిన MP మాగుంట

image

దేశంలో కొవిడ్-19 వ్యాప్తి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాల గురించి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. రాష్ట్రాలలోని రేషన్ కార్డుల క్రింద ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఉచిత ఆహార ధాన్యాలు కొనసాగింపు, మొదలగు కార్యక్రమాలతో నష్ట నివారణ జరిగిందన్నారు.

News August 4, 2024

ప్రకాశం: 3 నెలల తర్వాత మోగనున్న పెళ్లి బాజాలు

image

మూడంతో 3 నెలలుగా నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఫంక్షన్ హాళ్లకు గిరాకీ పెరగనుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

News August 4, 2024

అధికారులు నిద్రపోతున్నారా?: ఆదిమూలపు సురేశ్

image

‘డీలర్లు రాజీనామా చేస్తే షాపులకు ఇన్‌ఛార్జ్‌గా రెవెన్యూ అధికారులను నియమించి రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. అలా కాకుండా TDP నేతల గృహాల్లో దిగుమతి చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు నిద్రపోతున్నారా’ అని మాజీ మంత్రి సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపిలోని YCP కార్యాలయంలో శనివారం మాట్లాడారు. YCP సానుభూతి పరులని చెప్పి అర్హులైన వారి పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

News August 4, 2024

ప్రకాశం: ఫ్రెండ్షిప్ డే నాడు.. పోలీస్ ఫ్రెండ్స్ సేవలు స్మరిద్దాం

image

ఫ్రెండ్స్ అంటే కష్టాల్లో వెంట ఉండేవారు. బాధను మైమరపించే వారు. ఏ కష్టాన్నైనా ఎదురొడ్డి మన కోసం పరితపించే వారు. ఈ కోవకు చెందిన వారే పోలీసులు. అందుకే వీరిని అంటారు ఫ్రెండ్లీ పోలీస్ అని. ప్రమాదం జరిగిందా ఆపద్బాంధవులా వస్తారు. అర్థరాత్రి ఒక్క ఫోన్ కాల్ చేశామా ఇలా వచ్చేస్తారు. వరదల్లో చిక్కుకున్నామా వచ్చేది వీరే. ఇన్ని కష్టాలలో మన వెంట ఉంటున్న ప్రకాశం జిల్లా పోలీస్ ఫ్రెండ్స్‌కి శుభాకాంక్షలు చెప్పేద్దాం.