Prakasam

News August 4, 2024

ఒంగోలు: బాలికను తల్లిని చేసిన యువకులు అరెస్ట్

image

ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని తల్లిని చేసిన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు శనివారం SP దామోదర్ తెలిపారు. అద్దంకికి చెందిన సైదబాబు బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి తల్లిని చేశాడు. విషయం తెలిసిన వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బాలికను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. ఇటీవల బాలిక కొత్తపట్నం KGBV మరుగుదొడ్డిలో మృత శిశువుకు జన్మనిచ్చిన విషయం Way2news పాఠకులకు విధితమే.

News August 4, 2024

నంబర్ ప్లేట్లపై ఫలానా తాలూకా అని రాస్తే కేసులే: ఎస్పీ హెచ్చరిక

image

ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లపై ‘వాళ్ల తాలూకా… వీళ్ళ తాలూకా’ అంటూ రాయవద్దని, అలా రాయడం నిబంధనలకు విరుద్ధమని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని స్పీకర్ ఆలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏవైనా అనుకోని ప్రమాదాలు, దొంగతనాలు జరిగిన సమయంలో ఇలా రాయడంతో అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. అటువంటి బైక్‌లపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

News August 4, 2024

ఒంగోలు: రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంద్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న 88 డిగ్రీ కళాశాలల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నిర్వహించిన రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి శనివారం ఒంగోలులో లాంఛనంగా విడుదల చేశారు. ఆయా కళాశాలల నుంచి మొత్తం 6377 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే 46.51 శాతంతో 2966 మంది ఉత్తీర్ణత సాధించారని ఏకేయూ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పద్మజ వెల్లడించారు.

News August 4, 2024

కొండపి: 878 పొగాకు బేళ్లు కొనుగోలు

image

కొండపి పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన వేలంలో పొగాకు గరిష్ఠ ధర రూ.323 పలికిందని వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. అక్కచెరువుపాలెం, గోగినేనివారిపాలెం, పైడిపాడు గ్రామాల రైతులు 951 బేళ్లు తీసుకురాగా 878 కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 89బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. కేజీ పొగాకు కనిష్ఠ ధర రూ.205, సరాసరి ధర రూ.265.07 పలికిందన్నారు. ఈ వేలంలో 24 మంది వ్యాపారులు పాల్గొన్నారు.

News August 4, 2024

ప్రకాశం వారికి స్నేహం అంటే ప్రాణం!

image

ప్రకాశం జిల్లా వారు స్నేహం అంటే ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ప్రతి ఒక్కరిలో భాగమే. ఇక స్కూల్‌‌ ఫ్రెండ్స్‌తో చేసిన చిలిపి పనులు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఎక్కడికెళ్లినా మన వెంట ఒకడు ఉండాల్సిందే. ఫేర్‌వెల్‌ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో. అటువంటి మిత్రులు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా.. కామెంట్ చేయండి.
Happy Friendship Day

News August 3, 2024

పోక్సో కేసులో.. ముగ్గురు అరెస్ట్: ప్రకాశం ఎస్పీ

image

చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ముగ్గురు వ్యక్తులు మోసం చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంగా సాగించారన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News August 3, 2024

పర్చూరు: ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆటో డ్రైవర్ శివకృష్ణ(26) మామిడి చెట్టుకి ఉరివేసుకొని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పర్చూరు ప్రాంతానికి చెందిన శివకృష్ణ చేబ్రోలులో ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతను అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 3, 2024

కొత్తపట్నం: KGBV ప్రత్యేక అధికారి, ANMపై వేటు

image

కొత్తపట్నం మండలం పాదర్తి-మోటుమాల గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో, రెండురోజుల క్రితం ఇంటర్ బాలిక ప్రసవించిన ఘటనపై కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు కలెక్టర్ ఆదేశించటంతో ప్రత్యేకాధికారి వి అరుణ కుమారి, ఏఎన్ఎం జె సత్యవతిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో సుభద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

News August 3, 2024

ప్రకాశం జిల్లాలో 40 మంది తహశీల్దార్ల స్థానచలనం

image

జిల్లాలోని 40 మంది తహశీల్దార్లకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పొరుగు జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు ఇటీవల కలెక్టరేట్లో పోస్టింగ్ నిమిత్తం రిపోర్టు చేశారు. వారితోపాటు, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కొందరికి స్థానచలనం కల్పిం చారు. కొండపి, సింగరాయకొండ, జరుగుమల్లి, ఒంగోలు డీఏవో తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News August 3, 2024

ప్రకాశం: బ్యాంకులో చోరీకి యత్నించిన మహిళ

image

యూనియన్ బ్యాంకులో ఓ మహిళ దొంగతనానికి యత్నించిన ఘటన త్రిపురాంతకం మండలం మేడపి యూనియన్‌ బ్యాంకులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ మహిళ బ్యాంక్ షటర్‌ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి లాకర్‌ తాళాలు రాకపోవడంతో వెనుదిరిగింది. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా బ్యాంకులో చోరీ చేసేందుకు ఓ మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చినట్లు దర్శి డీఎస్పీ అశోకవర్థన్‌ తెలిపారు.