Prakasam

News August 2, 2024

MPలతో సమావేశమైన ప్రకాశం MLAలు

image

న్యూఢిల్లీలో గురువారం ప్రకాశం జిల్లా MLAలు, ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, ముత్తుముల అశోక్ రెడ్డితో పాటు, టీడీపీ నేతలు దామచర్ల సత్య, గొట్టిపాటి లక్ష్మీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడితో సమావేశమయ్యారు. జిల్లా MLAలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ప్రాజెక్టులు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఢిల్లీ వెళ్లారు.

News August 2, 2024

ప్రకాశం ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ కారణాలతో ఘర్షణలకు పాల్పడితే రౌడీషీట్లు తెరుస్తామన్నారు. మహిళలు, చిన్నారులు, విద్యార్థునులను ఎవరైనా వేధిస్తే కటకటాల ఊసలు లెక్కిస్తారని హెచ్చరించారు. జిల్లాలో భూకబ్జాలకు పాల్పడితే పోలీస్ పవర్ ఏంటో చూపిస్తామన్నారు. ఇప్పటికే నేరాలు చేసి బెయిల్‌పై కాని, విడుదలైన వారిపై పోలీసుల నిఘా ఉంటుందని సూచించారు.

News August 2, 2024

MPలతో సమావేశమైన ప్రకాశం MLAలు

image

న్యూఢిల్లీలో గురువారం ప్రకాశం జిల్లా MLAలు, ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డితో పాటు, దామచర్ల సత్య, గొట్టిపాటి లక్ష్మీ తదితరులు రాష్ట్ర ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడితో సమావేశమయ్యారు. జిల్లా MLAలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ప్రాజెక్టులు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఢిల్లీ వెళ్లారు.

News August 2, 2024

తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం: ప్రకాశం కలెక్టర్

image

తల్లి పాలు ఇవ్వడం ద్వారా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలరని, దానిని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు. తల్లిగా తను కూడా ఇదే నిర్ణయం తీసుకున్నానని జిల్లా కలెక్టర్ తమీర్ అన్సారీ గురువారం పిలుపునిచ్చారు. ఒంగోలు GGH (రిమ్స్)లో బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలను కలెక్టర్ లాంచనంగా ప్రారంభించారు. తల్లి పాలు బిడ్డకు అందించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.

News August 1, 2024

ప్రకాశం: ‘గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలి’

image

ప్రభుత్వ సహాయంతో మంజూరైన గృహాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ గృహాలు నిర్మించుకునేలా చైతన్య పరచాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.

News August 1, 2024

శ్రీశైలం జెన్‌కో అధికారులతో మంత్రి గొట్టిపాటి సమావేశం

image

అద్దంకి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గురువారం శ్రీశైలం జన్ కో ప్లాంట్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలాశయంలో నీటి సామర్థ్యం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతరాయం లేని విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందించడానికి చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News August 1, 2024

ప్రకాశం: ‘గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలి’

image

ప్రభుత్వ సహాయంతో మంజూరైన గృహాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ గృహాలు నిర్మించుకునేలా చైతన్య పరచాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.

News August 1, 2024

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా MP మాగుంట

image

పార్లమెంట్ ఏర్పాటు చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. 15 మంది సభ్యులు గల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికలలో 19 నామినేషన్లు రాగా, వారిలో నలుగురు ఉపసంహరించుకున్న క్రమంలో మిగిలిన వారిని సభ్యులుగా పార్లమెంట్ నియమించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీల సభ్యుడిగా ఎన్నికైన ఒంగోలు ఎంపీ మాగుంటకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

News August 1, 2024

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా MP మాగుంట

image

పార్లమెంట్ ఏర్పాటు చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. 15 మంది సభ్యులు గల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికలలో 19 నామినేషన్లు రాగా, వారిలో నలుగురు ఉపసంహరించుకున్న క్రమంలో మిగిలిన వారిని సభ్యులుగా పార్లమెంట్ నియమించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీల సభ్యుడిగా ఎన్నికైన ఒంగోలు ఎంపీ మాగుంటకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

News August 1, 2024

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

image

పోలీస్ సిబ్బందికి సంబంధించిన అన్ని రికార్డులను డీపీఓ కార్యాలయంలో ఎప్పటికప్పుడు వివరాలు నమోదయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని డీపీఓ కార్యాలయంలో సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.