Prakasam

News August 1, 2024

ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న అడిషనల్ SP

image

చీమకుర్తి మండలం కూనంనేని వారిపాలెంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ కార్యక్రమాన్ని ప్రారంభించగా,, ఎస్పీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

News August 1, 2024

కందుకూరు: ఓ తల్లిదండ్రుల ఆవేదన ఇదీ..!

image

ఉలవపాడు యువకుడు ఒంగోలులో నర్సింగ్ చదువుతున్నాడు. అతని ప్రవర్తనను స్నేహితులు హేళన చేశారు. ఇదే సమయంలో అతడికి హిజ్రాలు పరిచయం కావడంతో ఇంటికి రావడం, తల్లిదండ్రలతో మాట్లాడటం మానేశాడు. మిస్సింగ్ కేసు ఉండటంతో నిన్న అతడిని ఉలవపాడు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 150 మంది హిజ్రాలు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఎవరితో వెళ్లాలి అనే నిర్ణయం అతడికి వదిలేయగా హిజ్రాలతో వెళ్లడంతో తల్లిదండ్రులు విలపించారు.

News August 1, 2024

టంగుటూరు: పొగాకు గరిష్ఠ ధర రూ.360

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారం పొగాకు గరిష్ఠ ధర రూ.360 పలికింది. ఎం.నిడమానూరు క్లస్టర్ గ్రామాలకు చెందిన రైతులు 1041 బేళ్లను వేలానికి తీసుకువచ్చారు. వాటిలో 965 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 76 బేళ్లను తిరస్కరించారు. పొగాకు సరాసరి ధర కేజీ రూ.313.79, కనిష్ఠ ధర రూ.205 పలికిందని పొగాకు వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

News August 1, 2024

సీఎం ప్రకటనతో జిల్లా వాలంటీర్లలో ఆనందం

image

జిల్లాలో 6385 మంది వాలంటీర్ల ఆశలు చిగురించాయి. దీనికి ప్రధాన కారణం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటించడమే. ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా రాజీనామా చేయకుండా 6385 మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, అందుకు గల విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రభుత్వం సైతం ప్రకటించింది. అయితే జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్‌ల పరిస్థితి తేలాల్సి ఉంది.

News August 1, 2024

నేడు ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాకు నేడు పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ప్రకటించిన విపత్తుల సంస్థ జిల్లాలోని పలు మండలాలలో ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళవద్దని వెళ్లొద్దని సూచించింది.

News August 1, 2024

సైబర్ మోసాల పట్ల జాగ్రత్త: ఎస్పీ దామోదర్ 

image

తక్కువ మొత్తంలో పెట్టుబడులు-ఎక్కువ మొత్తంలో ఆదాయాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దామోదర్ కోరారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, కంపెనీ బ్రాండ్‌ను పోలిన వెబ్‌సైట్‌లను రూపొందించి సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని అన్నారు. వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. 

News July 31, 2024

ప్రకాశం: 81.42 కి. మీ రాష్ట్ర రహదారి అభివృద్ధికి ఆమోదం

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 27 రాష్ట్ర రహదారులను P.P.P స్కీం ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓడరేవు నుంచి చీరాల-పర్చూరు-చిలకలూరిపేట-నరసరావుపేట మీదగా పిడుగురాళ్ల చేరుకునే 81.42 కి. మీ రహదారి అభివృద్ధికి ఆమోదముద్ర తెలిపింది.

News July 31, 2024

ప్రకాశం: రేపటి నుంచి జంగిల్ సఫారీ నిషేధం

image

నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విహార ప్రదేశాలను నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు దోర్నాల అటవీ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. శ్రీశైలం రహదారిలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న జంగిల్ సఫారీని ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నారు. వర్షాకాలంతో పాటు పులుల ఏకాంతానికి భంగం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 

News July 31, 2024

ప్రకాశం: ఆ అధికారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ

image

ఆ అధికారి అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ద్విసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రకాశం జిల్లా సహకార శాఖ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి తోట సాయినాథ్ పై పలు ఆరోపణలు రాగా, జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. DCO, విభిన్న ప్రతిభావంతులు సహాయ సంచాలకులు ఇప్పటికే విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణకు పలువురు బాధితులు హాజరై తమ వాదన వినిపించినట్లు సమాచారం. ఇక అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది తేలాల్సిఉంది.

News July 31, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 మంది తహశీల్దార్లకు పోస్టింగ్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా EC ఆదేశాల మేరకు పలువురు తహశీల్దార్లు పక్క జిల్లాలకు బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్లిన 25 మంది తహశీల్దార్లు ఆయా జిల్లాల నుంచి రిలీవ్ పొంది, 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి 25 మంది తహశీల్దార్లకు జిల్లాలో పోస్టింగ్ కల్పిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.