Prakasam

News March 9, 2025

ప్రకాశం జిల్లా YCP నాయకులకు పదవులు.!

image

YS జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు YCP నాయకులకు శనివారం రాష్ట్రస్థాయి పదవులు వరించాయి.
➤రాష్ట్ర మహిళా కార్యదర్శిగా భూమిరెడ్డి రవణమ్మ
➤చెప్పలి కనకదుర్గ
➤మాదాల వెంకట సుబ్బారావు
➤సిరిగిరి గోపాల్‌రెడ్డి
➤దోగిపర్తి రంజిత్ కుమార్
➤బత్తుల అశోక్ కూమార్ రెడ్డి
➤కంచర్ల సుదాకర్ బాబు
➤మేడా వెంకట బద్రీనారాయణ నియమితులయ్యారు.

News March 9, 2025

ప్రకాశం జిల్లా YCP నాయకులకు పదవులు.!

image

YS జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు YCP నాయకులకు శనివారం రాష్ట్రస్థాయి పదవులు వరించాయి.
➤రాష్ట్ర మహిళా కార్యదర్శిగా భూమిరెడ్డి రవణమ్మ
➤చెప్పలి కనకదుర్గ
➤మాదాల వెంకట సుబ్బారావు
➤సిరిగిరి గోపాల్‌రెడ్డి
➤దోగిపర్తి రంజిత్ కుమార్
➤బత్తుల అశోక్ కూమార్ రెడ్డి
➤కంచర్ల సుదాకర్ బాబు
➤మేడా వెంకట బద్రీనారాయణ నియమితులయ్యారు.

News March 8, 2025

దోర్నాల: పెట్రోల్ దాడిలో ఇద్దరూ మృతి

image

పెద్దదోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో భూ వివాదం కారణంగా సైదాబీ (35), నాగూర్ వలి (23)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగూర్ వలి శుక్రవారం మధ్యాహ్నం మరణించగా, సైదాబీ రాత్రి 12:50 నిమిషాలకు మృతి చెందారు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఇద్దరూ మృతితో విషాదం నెలకొంది.

News March 8, 2025

నేడు మార్కాపురానికి CM రాక.. ఉత్కంఠ

image

మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం వాసులు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై బహిరంగ సభలో సీఎం చేసే ప్రకటనపై వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటన చేశారు. అయితే సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా మార్కాపురానికి వస్తున్న వేళ జిల్లా అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

News March 8, 2025

మార్కాపురంలో సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించిన SP

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు నేడు మార్కాపురం రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, SSG ఆఫీసర్స్ కలిసి మార్కాపురంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌ తనిఖీలను శుక్రవారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వివరించారు.

News March 7, 2025

మార్కాపురంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు.!

image

మార్కాపురం పట్టణానికి శనివారం సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు దిగనున్న హెలిప్యాడ్ స్థలం వద్ద బాంబ్ స్క్వాడ్ శుక్రవారం తనిఖీలు చేపట్టింది జిల్లా అధికార యంత్రాంగం హెలిప్యాడ్ స్థలం వద్ద ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పటిష్ఠ భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News March 7, 2025

దోర్నాలలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు

image

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై పెట్రోల్‌తో దాడి జరిగింది. దూదేకుల నాగూర్ వలిపై ఓ వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. మెరుగైన చికిత్స కోసం మార్కాపురం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

ఒంగోలు: 30 మండలాలకు అధ్యక్షుల ప్రకటన

image

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని 30 మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు షేక్. సైదా ప్రకటించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని అన్నారు. షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు.

News March 6, 2025

అధికారులకు కీలక సూచనలు చేసిన ప్రకాశం కలెక్టర్

image

ఈనెల 8వ సీఎం చంద్రబాబు మార్కాపురం పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ తమిమ్ ఆన్సరియా కీలక సూచనలు చేశారు. కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

News March 6, 2025

ఒంగోలు: పిల్లలు చెప్పిన మాట వినలేదని తల్లి సూసైడ్

image

ఒంగోలు నగరం ధారావారితోటలో వివాహిత కె.లక్ష్మీభవానీ(34) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలతోపాటు పిల్లలు కూడా చెప్పిన మాట వినడంలేదంటూ క్షణికావేశంలో ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుంది.ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు ఆమెను రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీభవాని మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు చెప్పారు.