Prakasam

News July 21, 2024

స్పా సెంటర్లపై ప్రకాశం ఎస్పీ కీలక వ్యాఖ్యలు

image

స్పా సెంటర్ల పేరుతో చట్ట విరుద్ధమైన, అసాంఘిక, అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. 16 స్పా సెంటర్లపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. గుంటూరు రోడ్డులోని ఒక స్పా సెంటర్, అంజయ్య రోడ్డులో ఒకటి, బాలాజీరావుపేటలోని ఒక స్పా సెంటర్లో కొందరిని పట్టుకున్నామని తెలిపారు.

News July 21, 2024

మార్కాపురం: బస్సు ప్రమాదంలో మరొకరు మృతి

image

మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13672913>>ఒకరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మార్కాపూరం జిల్లా వైద్యశాలకు తరలించారు.

News July 21, 2024

మార్కాపురం: రైలు కింద పడి LIC ఏజెంట్ ఆత్మహత్య

image

LIC ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మార్కాపురం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. LIC ఏజెంట్‌గా పనిచేస్తున్న హమీద్ ఆదివారం రైల్వే స్టేషన్‌లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హమీద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మార్కాపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 21, 2024

ప్రజారోగ్య భద్రతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సంబందిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకం అని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో కలిసి డయేరియా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య భద్రతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News July 20, 2024

ఒంగోలు: మహిళకు ఎస్పీ సత్వర న్యాయం

image

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ దామోదర్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. శుక్రవారం ఒంగోలులోని ఉమన్ పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా ఓ మహిళ ఒక ఆకతాయి తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేశారు. ఎస్పీ వెంటనే విచారణ చేపట్టి మిట్ట అనిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

News July 20, 2024

సింగరాయకొండ: పాకల రైల్వే గేట్ మూసివేత

image

సింగరాయకొండ, పాకల మధ్య ఉన్న రైల్వే గేట్‌ని జులై 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అత్యవసర రైల్వే పనుల కారణంగా మూసివేస్తున్నట్లు సింగరాయకొండ రైల్వే శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 28వ తేదీ వరకు సోమరాజు పల్లి రైల్వే గేట్‌ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

News July 20, 2024

టంగుటూరు: ఇద్దరు యువకులు గల్లంతు.. ఒకరి మృతి

image

టంగుటూరు మండలంలో వాసేపల్లిపాడుకు చెందిన ఇద్దరు యువకులు ఈతకి వెళ్లి ఇద్దరు గల్లంతు అయ్యారు. వారిని వెంకటేశ్,(22) నవీన్(22) గా గుర్తించారు. గల్లంతయిన వ్యక్తుల్లో వెంకటేశ్ మృతదేహం లభ్యం కాగా, నవీన్ మృతదేహం కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మట్టి కోసం తీసిన పెద్ద గుంతలు ఉండటంతోనే మృతిచెందినట్లు స్థానికులు తెలపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

ప్రకాశం: గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉద్యోగాలు

image

గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాయవరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆశాలత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఫిజిక్స్- 1 పోస్టు, గణితం-2, ఆంగ్లం-1, హిందీ-2, సివిక్స్-1, పీటీఈ- 5 పోస్టులు, జీఎన్ఎం నర్స్- 1 పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు లోపు దరఖాస్తులను చీమకుర్తి గురుకుల పాఠశాలల్లో అందజేయాలన్నారు.

News July 20, 2024

ఒంగోలులో జాబ్ మేళా.. జీతం ఎంతంటే?

image

నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 23న ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాది కార్యాలయ అధికారి టి.భరద్వాజ్ తెలిపారు. ఏదైనా విభాగంలో డిప్లొమా, ITI, టెన్త్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు రావాలన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.14.500 నుంచి రూ.21 వేల వరకు వేతనం ఇస్తారని, అధనంగా ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. వివరాలకు 08592 281776ను సంప్రదించాలన్నారు.

News July 20, 2024

జగన్‌పై మంత్రి గొట్టిపాటి సంచలన వ్యాఖ్యలు

image

వినుకొండలో జరిగిన హత్యను టీడీపీ ప్రభుత్వానికి ఆపాదించడం హేయమైన చర్యని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వివాదాన్ని రెచ్చగొట్టేందుకే జగన్ వినుకొండలో పర్యటిస్తున్నారని, హత్యా రాజకీయాలకు పేటెంట్ హక్కు వైసీపీకే దక్కుతుందని ఆరోపించారు. చంద్రబాబు వద్ద జగన్ ఆటలు సాగవనే విషయం తెలుకోవాలని అన్నారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.