Prakasam

News July 20, 2024

పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ

image

పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ప్రత్యేక టీంగా ఏర్పడి త్వరగా చేధించాలన్నారు. మహిళల భద్రతకు స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు.

News July 19, 2024

ప్రకాశం: వేగం పుంజుకున్న రైల్వే లైన్ పనులు

image

ప్రకాశం జిల్లా, పశ్చిమ మెట్ట మండలాలను కలుపుతూ పోయే నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మార్గం గుంటూరు జిల్లా నడికుడి నుంచి ప్రారంభమై, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు, శ్రీకాళహస్తి వరకు 308 కి.మీ నిర్మాణం జరుగుతుంది. 37 రైల్వేస్టేషన్లకు గాను, ప్రకాశం జిల్లాలో కురిచేడు, ముండ్లమూరు, దర్శి, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పామూరు స్టేషన్లకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది.

News July 19, 2024

ప్రభుత్వ సేవలు పటిష్ఠంగా అమలు జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ సేవలు పటిష్ఠంగా అమలు జరగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ట్రెజరీ, ఆడిట్, ఎండోమెంట్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు.

News July 19, 2024

ఒంగోలు: బీజేపీలో చేరిన వైసీపీ నాయకురాలు

image

ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకురాలు జిల్లెలమూడి రమాదేవి శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరగా, కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ముఖ్య మహిళా నేతగా ఈమె ఉన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

News July 19, 2024

కనిగిరిలో స్వల్ప భూ ప్రకంపనలు

image

కనిగిరి మండలం నందన మారెళ్లలో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రకంపనాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు గ్రామస్థులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.

News July 19, 2024

ప్రకాశం: వెబ్‌సైట్‌లో NMMS మెరిట్ జాబితా

image

స్కాలర్షిప్ NMMS ప్రవేశపరీక్ష 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో అందులో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే న్యూడిల్లి వారి స్కాలర్షిప్ పోర్టల్ లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.

News July 18, 2024

వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్.ఈ

image

జిల్లాలో వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్ వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్.ఈ కెవిజి. సత్యనారాయణ అన్నారు. గురువారం ఒంగోలులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. వచ్చే 4 రోజుల సిబ్బందికి సెలవులు లేవని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయం ఉన్నట్లయితే 1912కి లేదా స్థానిక సిబ్బందికి తెలపాలని కోరారు. తడిచేతులతో విద్యుత్ పరికరాలు తాకవద్దని అన్నారు.

News July 18, 2024

ఆంధ్ర కేసరి వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఆచార్య DVR మూర్తి

image

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం(ఒంగోలు) ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఏయూ జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యులు డీవీఆర్ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆచార్య మూర్తి ఏయూ పరీక్షలు విభాగం డీన్‌గా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన విదేశీ భాషలు విభాగాధిపతిగా, జర్మన్ సెంటర్ డైరెక్టర్, జర్నలిజం విభాగాధిపతిగా, బిఓఎస్ ఛైర్మన్‌గా పదవులు నిర్వహించారు.

News July 18, 2024

మార్కాపురం: పరారైన ఖైదీ 

image

మార్కాపురంలో గురువారం ఓ రిమాండ్ ఖైదీ రైలు నుంచి దిగి పరారయ్యాడు.  విశాఖ నుంచి అనంతపురానికి తీసుకొస్తున్న క్రమంలో ఖైదీ పోలీసుల కళ్లు గప్పి  తప్పించుకున్నాడు. ఇతను గుత్తి మండలం పి.కొత్తపల్లికి చెందిన నరేశ్‌గా పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా కేసులో ముద్దాయి అయిన నరేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

News July 18, 2024

ప్రకాశం: 21 నుంచి పలు రైళ్ల పునరుద్ధరణ

image

ప్రకాశం జిల్లా మీదగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. జులై 21 నుంచి రైలు నం.17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, రైలు నం.17227 గుంటూరు-డోన్,  22 నుంచి రైలు నం.17228 డోన్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, రైలు నం.17281 గుంటూరు-నరసాపూర్ రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.