India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్దిపాడు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పరిశ్రమ శుభ్రత కార్యక్రమాన్ని ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా 15% జీఎస్డీపీ వృద్ధిరేటు లక్ష్యంతో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు.
సింగరాయకొండలో భాష్యం స్కూల్ బస్సు అదుపుతప్పి పంట కాలవలోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. 13 మంది స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లుతుండగా అదుపు తప్పి పంట పొలాల్లోకి వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మార్కాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి కె. శ్రీనివాసులును దూషించిన కేసులో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కార్యాలయం లోపలికి వచ్చి విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి దిగి కులం పేరుతో దూషించినట్లు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మార్కాపురానికి చెందిన గాలి వెంకటరామిరెడ్డి, పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం (బుల్లి) అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
మర్రిపూడి మండలం రామాయపాలెంలో కొద్దిరోజులుగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ వైద్యం అందక గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ గ్రామం నుంచి 10 మందికి పైగా ఒంగోలులోని కార్పొరేట్ వైద్యశాలల్లో చేరారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని కొందరు గ్రామంలోనే RMPలచే వైద్యం చేయించుకుంటున్నారు. గురువారం మరికొందరు ఒంగోలు ఆసుపత్రులకు వెళ్లినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
ఒంగోలు నడిబొడ్డులో పట్టపగలే 15 ఏళ్ల బాలుడు టక్కరి దొంగగా మారాడు. పట్టణంలోని ఓ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల బ్యాగులో నుంచి పర్సులు, చిప్స్ సునాయాసంగా చోరీ చేశాడు. అనంతరం ఫోటోగ్రాఫర్లు తమ బ్యాగులు చెల్లా చెదురుగా పడి ఉండటానికి గమనించి షోరూమ్లోని సీసీ కెమెరాలు చెక్ చేశారు. దీంతో బాలుడి ఉదంతం బయటపడింది.
పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని సీవియన్ రీడింగ్ రూమ్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా APSFL కేబుల్ ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.కేబుల్ ఆపరేటర్ల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని తెలిపారు.
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి సమాజంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేలా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయటంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాల అమలులో పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అధికారులు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. యువ ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాధారణ జనాభాకు ఓటర్ల జాబితా నిష్పత్తిని సరి చూసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.