India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగింది. దోర్నాల మండలం చిన్నగుడిపాడులో VROగా పనిచేస్తున్న చిన్న కొండయ్య, మరియమ్మ దంపతులకు కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై అనుమానం పెంచుకున్న చిన్న కొండయ్య తెల్లవారుజామున గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన మరియమ్మను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
మర్రిపూడి మండలంలో ఉపాధి హామీ పనుల్లో మృతుల పేర్లతో నిధులు స్వాహా చేశారు. ఈ ఉదంతం బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో డ్వామా PD జోసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావేదికలో వెలుగులోకి వచ్చింది. మండలంలో 569 పనులుకు రూ.7,52,57,643 ఖర్చు చేసినట్లు చెప్పారు. కొన్ని గ్రామాల్లో జరిగిన ఉపాది పనుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించి ప్రజావేదిక దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన PD నిధులు రికవరీకి ఆదేశించారు.
ఒంగోలులోని బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు పోలీసులు డెమో డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ అశోక్ బాబు, డీఎస్పీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఎక్స్ ప్లోజీవ్ బ్యాగును ఉంచి, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా డెమో డ్రిల్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని ఇష్టకామేశ్వరీ దేవి ఆలయానికి వెళుతూ తప్పిపోయిన 15 మంది భక్తులను పోలీసులు రక్షించారు. బుధవారం శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి ఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి కాలి నడకన వెళుతూ అటవీప్రాంతంలో తప్పిపోయి 100కు కాల్ చేయగా యర్రగొండపాలెం పోలీసులు వారికోసం నల్లమల అడవిలో గాలించి వారిని రక్షించారు. వీరంతా రేపల్లె మండలం మంత్రిపాలెం వాసులుగా గుర్తించారు.
జిల్లాలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు విజయవాడలో గాంధీజీ మున్సిపల్ హైస్కూలులో ఈనెల 21, 22వ తేదీల్లో నిర్వహించనున్న అకౌంట్ టెస్ట్కు హాజరుకావాలని DEO కిరణ్ కుమార్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే హెచ్ఎంలు ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అందరూ సకాలంలో హాజరుకావాలని చెప్పారు.
తండ్రీకొడుకు, భార్యాభర్త అనురాగం ఎంత గొప్పదో తెలిపే ఘటన ఇది. కట్టుకున్న వాడి కోసం కిడ్నీని, కన్నతండ్రి కోసం కాలేయాన్నే వదులుకున్న త్యాగమూర్తుల కథ ఇది. ఒంగోలుకు చెందిన రామారావు(54)కు కిడ్నీ, లివర్ ఫెయిల్ అయ్యాయి. ఎవరైనా అవయవాలు డొనేట్ చేస్తారేమోనని చూసినా ఫలితం లేకపోయింది. నాగవల్లి కిడ్నీని, కౌశిక్ లివర్లో కొంత భాగాన్ని రామారావుకు ఇవ్వడంతో హైదరాబాద్ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
ప్రకాశం జిల్లాలో ఈనెల 18 నుంచి 23 వరకు APPSC నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం JC ఎపీపీఎస్సీ అధికారులు, పోలీస్, విద్యుత్, వైద్యశాఖ, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
ప్రకాశం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో మంగళవారం ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జీషీట్లు ఏవిధమైన ఆలస్యం లేకుండా ఫైల్ చేయాలన్నారు. అనంతరం కోర్టులో విచారణ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఒంగోలులో ఈనెల 14న కిడ్నాపైన బాలుడి కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. త్రోవగుంట వద్ద దయామణి, మణికంఠలను అదుపులోకి తీసుకోని విచారించగా బాలుడిని తామే కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు. దయామణి మణికంఠతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఒంగోలులో ఉంటుంది. బాలుడిని ఇద్దరూ కలిసి కిడ్నాప్ చేశారని సీఐ తెలిపారు. నిందితులకు జడ్జి రిమాండ్ విధించారని సీఐ వెల్లడించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని <<14846862>>రాళ్లపాడు ప్రాజెక్ట్<<>> కుడి కాలువ గేటు మరమ్మతులకు గురైన విషయం తెలిసిందే. అధికారులు, MLA ర్రాతికి రాత్రే స్పందించి 10 రోజులుగా ప్రత్యేక బృందాలతో పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. <<14890737>>క్రెయిన్<<>> సాయంతో పనులు చేపట్టినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీల సమస్యలను సులువుగా తీర్చిన ఇంజినీర్ కన్నయ్య నాయుడి సలహాలు తీసుకుంటారా అన్నది తెలియాల్సిఉంది.
Sorry, no posts matched your criteria.