Prakasam

News September 20, 2024

మానవత్వం చాటుకున్న ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేఫథ్యంలో జిల్లా SP దామోదర్ బందోబస్తు నిమిత్తం వెళుతున్న క్రమంలో.. ఒంగోలులోని ఉడ్ కంప్లెక్ వద్ద నెల్లూరు జిల్లా జలదంకు చెందిన బ్రహ్మయ్య మూర్ఛ వచ్చి పడిపోయాడు. విషయం గమనించిన ఎస్పీ తనవాహనం ఆపి అతని చేతిలో తాళాలు పెట్టి, సృహ తెప్పించి అనంతరం మంచి నీళ్లు తాగించి అక్కడినుంచి వెళ్లారు. మంచి మనస్సు చాటుకున్న SPని పలువురు అభినందించారు.

News September 20, 2024

నేడు జగన్‌ను కలవనున్న MLA తాటిపర్తి

image

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన నేపథ్యంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. దీంతో ఆయన ఇవాళ జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

News September 20, 2024

నేడు జగన్‌ను కలవనున్న MLA తాటిపర్తి

image

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన నేపథ్యంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. దీంతో ఆయన ఇవాళ జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

News September 20, 2024

ప్రకాశం జిల్లాలో నేడు CM పర్యటన

image

ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం మద్దిరాలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పాలన పూర్తయిన సందర్భంగా.. ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్యం 2 గంటలకు మద్దిపాడు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్‌లో పాల్గొంటారు. అధికారులు పర్యటనా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News September 19, 2024

ఒంగోలు: వారంతా ఒక్కటయ్యారు.. ఫొటో వైరల్

image

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణను సైతం బాలినేని కలిశారు. ఈ కలయికతో జనసేనలో బాలినేని చేరికకు రియాజ్ అడ్డు తగులుతున్నారన్న వివాదానికి తెర పడింది. మొత్తం మీద వీరి కలయిక ఫొటో వైరల్‌గా మారింది.

News September 19, 2024

FLASH.. పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలో కలిశారు. నిన్న YCPకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్‌ను కలవడంతో జనసేనలో చేరుతారనే వార్తలకు బలం చేకూరాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పడు పార్టీలో చేరుతారు. ఈయనపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జిల్లా జనసేన ఇన్‌ఛార్జ్ రియాజ్, MLA దామచర్ల ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

News September 19, 2024

ఒంగోలు: కంప్యూటర్, ట్యాలీ‌పై ఉచిత శిక్షణ

image

ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కంప్యూటర్, ట్యాలీ నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలు కలిగి ఉండి, గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ మహిళలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని, శిక్షణ సమయంలో శిక్షణతో పాటు భోజన, వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.

News September 19, 2024

నేను ఆ మాటలు అనలేదు: బాలినేని

image

ప్రతిపక్షంతో పాటు స్వపక్షంతోనూ తాను ఎన్నో బాధలు ఎదుర్కొన్నట్లు బాలినేని చెప్పారు. ‘సామాజికవర్గ న్యాయమంటూ నా పదవి పీకేశారు. ముందు ప్రకాశం జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి లేదని.. చివరకు సురేశ్‌కు ఇచ్చారు. ఈడ్రామాలు అవసరమా? YSను తిట్టిన వాళ్లనూ మంత్రిగా కొనసాగించారు. పిల్ల కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ కలిసిపోతోందని నేను చెప్పినట్లు నాపై దుష్ర్పచారం చేశారు. నేను ఆ మాటలు అనలేదు’ అని బాలినేని చెప్పారు.

News September 19, 2024

ఎర్రగొండపాలెం MLA సమావేశం ఆంతర్యం ఏంటి?

image

ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇలా కార్యకర్తలతో సమావేశమవడం ఉత్కంఠ రేపుతోంది. కేవలం నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి ఇలా సమావేశం పెట్టారని కొందరు నేతలు చెబుతున్నారు.

News September 19, 2024

బాలినేని రాజీనామా.. వైవీ ఎంట్రీ

image

బాలినేని రాజీనామాతో ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయనతో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ సైతం వైసీపీని వీడతారని అనుమానం రావడంతో జగన్ అప్రమత్తమయ్యారు. చంద్రశేఖర్‌ని తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారు. మరోవైపు బాలినేని వెంట కీలక నాయకులు వెళ్లకుండా అడ్డుకోవడానికి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే పలువురితో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది.