India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భోగి సందర్భంగా 13న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టం” కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయప్రయాసలు పడి ఈ నెల 13న జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా స్కిల్ అధికారి జె.రవితేజ తెలియజేశారు.12 నెలలు పాటు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 8125215216 నంబర్లను సంప్రదించాలన్నారు.
సంతమాగులూరు మండలంలోని పుట్ట వారి పాలెం వద్ద శనివారం కారు ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందినట్లుగా సంతమాగులూరు పోలీసులు చెప్పారు. కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో అతన్ని నరసరావుపేటలో ప్రవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా చెప్పారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామైన రావినూతల వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.
జిల్లాలో కోడి పందేలు, జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, క్రికెట్ నిర్వహించుకోవాలన్నారు. పండగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్ విద్యార్థులను ‘<<15113379>>తన దగ్గరకు వస్తే ఎక్కువ మార్కులు వేసి పాస్ చేస్తా<<>> అంటూ’ లైంగిక వేధింపులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాజశేఖర్ వేధిస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. విచారణ అనంతరం ఒంగోలు రూరల్ CI శ్రీకాంత్ శుక్రవారం ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో మూడు నెలలుగా జ్వరం తాండవిస్తోంది. ప్రస్తుతం మంచు ఎక్కువగా ఉండటంతో చాలా మంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో వందల సంఖ్యలో విష జ్వరాల కేసులు నమోదైనట్లు సమాచారం. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 2,3 రోజులకు మించి జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గత 10 రోజులుగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైన ఈ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ముందుగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, ఎత్తు, ఛాతి వంటి టెస్టులు నిర్వహించారు.
సంక్రాంతి సందర్భంగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఉప రవాణా కమిషనర్ ఆర్.సుశీల హెచ్చరించారు. తన కార్యాలయంలో ప్రైవేటు వాహనాల యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. డ్రైవర్, క్లీనర్లు ప్రయాణికులతో గౌరవంగా మెలగాలని సూచించారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. వాహనానికి సంబంధించిన రికార్డులు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.
ఒంగోలులోని పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు గురువారం కొనసాగాయి. 552 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 365 మంది రాత పరీక్షకు అర్హత సాధించారని ఎస్సీ ఆర్.దామోదర్ వెల్లడించారు. అభ్యర్థులకు శుక్రవారంతో పరీక్షలు ముగుస్తాయని చెప్పారు.
తమను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని విద్యార్థినులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీ ఉంది. అందులో పనిచేసే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నాడని విద్యార్థినులు వాపోయారు. గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. తనకు సహకరించకపోతే మార్కులు తక్కువ వేస్తానంటూ తమను బెదిరిస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.