India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థలును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీరిలో దర్శి నుంచి కొండారెడ్డి, అద్దంకి నుంచి కిషోర్ బాబు, ఒంగోలు నుంచి రమేశ్ బాబు, కొండపి నుంచి సతీశ్, మార్కాపురం నుంచి షేక్ సైదా, గిద్దలూరు నుంచి పగడాల పెద్ద రంగస్వామి, కనిగిరి నుంచి కదిరి భవాని బరిలో నిలిచారు. ఈ మేరకు పీసీసీ ఛీఫ్ షర్మిలా ప్రకటన విడుదల చేశారు.
అద్దంకిలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ముందు వెళ్తున్న ఎక్సెల్ బైక్ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అద్దంకి మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన గుదే వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం
బాడీని అద్దంకి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలో YCP ఆవిర్భావం నుంచి సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసింది. 2014లో మొత్తం 12 స్థానాలకు గాను 6 చోట్ల.. 2019లో 8 చోట్ల గెలిచింది. పర్చూరు, చీరాలలో YCP ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేశ్, TDP నుంచి ఏలూరి సాంబశివ రావు, పర్చూరులో యడం బాలాజీ TDP నుంచి కొండయ్య బరిలో ఉన్నారు. ఈసారి TDP పట్టు నిలుపుకుంటుందా, YCP పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.
అద్దంకి మండలం కుంకుపాడుకు చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్ గత నెల 19వ తేదీన బైక్పై తాళ్లూరు వైపు వెళుతూ కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు 108లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్లో చేర్పించారు. చికిత్స పొందుతూ యువకుడు సోమవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం ఓవర్గం బెల్లంకొండ సాయిబాబునే తమకు ఇన్ఛార్జ్గా కావాలని అంటుండగా, సోమవారం మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. జనసేనలో వర్గ విభేదాలు బయటపడటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో టీజేఆర్ సుధాకర్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా పీసీపల్లిలో 42.67 డిగ్రీల రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలో 42.40 డిగ్రీలు, మార్కాపురం మండలం దరిమడుగులో 42.30, గుండ్లాపల్లిలో 42.03 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో కే.ఎల్.పి అభ్యర్థి రామారెడ్డి 5199 ఓట్లతో గెలుపొందారు. 1978 ఎన్నికల్లో సీపీఐ నుంచి పూలసుబ్బయ్య కేవలం 83 ఓట్ల తేడాతో వి.వి నారాయణ రెడ్డి (జనతా)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా వీరిద్దరూ నిలిచారు.
J. పంగులూరు మండలంలోని చందలూరు గ్రామ పంచాయతీకి ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ పంచాయతీ సుమారు రూ.1,10,00,000 వరకు బకాయి ఉంది. గ్రామ పంచాయతీకి విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులలో 20 శాతం విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లిస్తామని అధికారులకు చెప్పినా.. సరఫరా నిలిపివేశారని సర్పంచ్ పెంట్యాల కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి పన్నుల వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీ బాపట్ల జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4.55 కోట్ల వసూలు లక్ష్యం కాగా ఆదివారం నాటికి రూ.3.72 కోట్లు వసూలు చేసినట్టు చెప్పారు. జిల్లాలో 81.80 శాతం వసూళ్లతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.