Prakasam

News October 25, 2024

వెలిగొండ ప్రాజెక్టుపై BIG UPDATE

image

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్షించి పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా ప్రాజెక్టును ప్రాధాన్యత జాబితాలో చేర్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత YCP ప్రభుత్వంలో బడ్జెట్‌లో రూ.4,012 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రూ.764 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

News October 25, 2024

సింగరాయకొండ: జల్సాలకు అలవాటు పడి.. కటకటాల పాలయ్యారు

image

జల్సాలకు అలవాటు పడి ఐదుగురు యువకులు కటకటాల పాలయ్యారు. దొంగతనాలు, గంజాయి అమ్మకాలు చేసి జల్సాలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి 13 బైక్‌లు, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ హజరత్తయ్య తెలిపారు. గురువారం రాత్రి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరు పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారని సీఐ పేర్కొన్నారు. ఇలా తప్పుడు దారుల్లో నడవద్దని సూచించారు.

News October 25, 2024

ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థవంతంగా పనిచేయాలి: ప్రకాశం జేసీ

image

రేషన్ సరుకుల పంపిణీ, సరఫరాలో ఎన్ఫోర్స్మెంట్ మరింత సమర్థంగా పనిచేయాలిన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఇటీవల బదిలీల అనంతరం జిల్లా పౌర సరఫరాల శాఖలో కొత్తగా వచ్చిన అధికారులతో గురువారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేషన్ సరుకుల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు.

News October 24, 2024

ప్రకాశం జిల్లా నూతన డీఈవోగా కిరణ్ కుమార్

image

ప్రకాశం జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌లో విధులు నందు కాగా గురువారం జరిగిన డీఈవోల బదిలీల్లో ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యారు.

News October 24, 2024

ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువుల కొరత లేకుండా చూడాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన శాఖ, మార్క్ ఫెడ్, ఏపీఎంఐపీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News October 24, 2024

ప్రకాశం జిల్లాలో కామాంధుడు

image

ఒంగోలులో ఓ ఘనుడు తల్లితో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురితో ప్రేమాయణ నడిపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలులోని ఓ మహిళతో టంగులూరు మండలానికి చెందిన రాజు సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె కూతురితో ప్రేమాయణం నడిపాడు. 2 రోజుల క్రితం బాలికతో కలిసి బయటికివెళ్లారు. సాయంత్రమైనా రాకపోవడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో వారిద్దరూ హైదరాబాద్‌లో గుర్తించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

News October 24, 2024

ప్రకాశం: టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

image

ప్రకాశం జిల్లాలో మరో నేత YCPకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని సచివాలయంలో బుధవారం చీరాల మాజీ MLA కరణం బలరాం CM చంద్రబాబును కలిశారు. ఆయనతో పాటు MLA దామచర్ల ఉన్నారు. ఈయన 2019లో చీరాల నుంచి TDP తరఫున MLAగా గెలిచి YCPలో చేరారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేశ్‌ YCP నుంచి MLAగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బలరాం కలవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

ప్రకాశం జిల్లాలో రూ. లక్షలలో పలుకుతున్న పందెం కోళ్లు

image

సంక్రాంతి రానున్న నేపథ్యంలో నాటుకోడి, కోడిపుంజులకు భలే గిరాకీ ఉంటోందని కోళ్ల పెంపకం రైతులు అంటున్నారు. ముఖ్యంగా మన జిల్లాలోని మర్రిపూడి, కొండపి ప్రాంతాల్లో రైతులు కోళ్లను పెంచి రూ. లక్షలలో ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి పందెం కోడిపుంజు రూ. లక్షలు పలుకుతాయని, ప్రస్తుతం నాటు కోడి మాంసం రూ. 750 దాకా అమ్ముతున్నట్లు తెలిపారు.

News October 23, 2024

ఒంగోలు: మహిళల ఎదుగుదలకు రుణాలు

image

మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా ప్రకాశం జిల్లాలోని 837 స్వయం సహాయక సంఘాలకు రూ.100 రోట్ల రుణాలు మంజూరైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. మంగళవారం ఒంగులులో నిర్వహించిన డీఆర్డీఏ, కెనరా బ్యాంకు అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25న ఒంగోలులో ని ఏ-1 హాల్లో రుణాలు అందిస్తామన్నారు. మహిళలకు చేయూతనందించి వారి ఉన్నతికి తోడ్పడాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు.