Prakasam

News October 13, 2024

ప్రకాశం జిల్లాకు వర్ష సూచన.. కాల్ సెంటర్ ఏర్పాటు

image

దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా అప్రమత్తం చేశారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వరద బీభత్సం వల్ల సాయం కావలసినవారు 1077 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

News October 13, 2024

ప్రకాశం జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.

News October 13, 2024

ప్రకాశం జిల్లాలో ‘కిక్కు’ ఎవరికో

image

రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఈ నెల 12తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 171 మద్యం షాపులకు గాను 3416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14న ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమక్షంలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. మొదటి రోజే మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలని నిబంధనలో ఉంది.

News October 13, 2024

పండుగపూట కూడా అరాచకం: ఎమ్మెల్యే తాటిపర్తి

image

ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వంలో పండుగపూట కూడా అరాచకం. శ్రీస‌త్య‌సాయి జిల్లా, చిల‌మ‌త్తూరు మండ‌లం న‌ల్ల‌బొమ్మ‌య్య ప‌ల్లిలో వాచ్‌మెన్‌, అత‌ని కొడుకును ఐదుగురు క‌త్తుల‌తో బెదిరించి అత్తాకోడ‌ళ్ల‌పై అత్యాచారం చేసిన కామాంధులు. రాష్ట్రంలో కామాంధులు నుంచి ఆడబిడ్డలకి మీరు కల్పించే రక్షణ ఇదేనా?’ అంటూ పోస్ట్ చేశారు.

News October 13, 2024

ప్రకాశం జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.

News October 12, 2024

ప్రకాశం జిల్లాలో 28 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం తాగి వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లాలో బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు నిర్వహించి, 28 కేసులను నమోదు చేశారు. అలాగే సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 468 మంది వాహనదారులకు జరిమానా విధించామన్నారు. మొత్తం రూ.1,00,365ల జరిమానా వసూలైనట్లు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు.

News October 12, 2024

ప్రకాశం: పతనమైన టమాటా ధర.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో టమాటా ఉత్పత్తి తగ్గడం వలన సెంచరీకి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గిద్దలూరు పట్టణంలో పండుగ సమయంలో టమాటా ధర ఒక్కసారిగా 1kg రూ.80 నుంచి రూ.30కి పడిపోయింది. దీంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది. స్థానికంగా ఉత్పత్తి పెరగడంతో టమాటా ఉత్పత్తి కూడా పెరిగిందని, దీని ద్వారా టమాటా ధరలు తగ్గాయని వ్యాపారస్థులు తెలియజేశారు.

News October 12, 2024

ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తుల వివరాలు.!

image

➤ఒంగోలులో 34 దుకాణాలకు 590 దరఖాస్తులు
➤చీమకుర్తిలో 16 దుకాణాలకు 351
➤సింగరాయకొండలో 14 దుకాణాలకు 385
➤పొదిలిలో 16 దుకాణాలకు 291
➤దర్శిలో 23 దుకాణాలకు 375
➤మార్కాపురంలో 13 దుకాణాలకు 320
➤కనిగిరిలో 19 దుకాణాలకు 387
➤గిద్దలూరులో 13 దుకాణాలకు 231
➤కంభంలో 10 దుకాణాలకు 239
➤యర్రగొండపాలెంలో 13దుకాణాలకు 247 దరఖాస్తులు
మొత్తం 171 దుకాణాలకు 3,416 దరఖాస్తులు అందాయి.

News October 12, 2024

ప్రకాశం జిల్లాలో 171 దుకాణాలకు 3,416 దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 171 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3,416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఒంగోలులో 34 దుకాణాలకు 590 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా గిద్దలూరులో 13 దుకాణాలకు 231 దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.68.32 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 12, 2024

లోక్ సభ స్పీకర్‌తో బాపట్ల ఎంపీ భేటీ

image

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఎంపీ కృష్ణ ప్రసాద్ సత్కరించి అభినందనలు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలోని అద్దంకి, పర్చూరు, చీరాల, బాపట్ల, సంత నూతలపాడు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో నెలకొన్న పలు సమస్యలను ఆయనతో చర్చించారు.