India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పొగమంచు అధికంగా కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షసూచన ఉన్నట్లు ప్రకటన వెలువడింది.

ప్రకాశం జిల్లాలో ఈనెల 11వ తేదీలోగా పట్టాదారు పాసుపుస్తకాలన్నీ పంపిణీ చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ పరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అర్జీల స్థితిగతులను ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లాలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలో 350 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్కు 150, బెంగళూరుకు 30, చెన్నైకి 20, విజయవాడకు 150 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. 13వ తేదీ వరకు నడిపే ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూళ్లు చేస్తామని చెప్పారు.

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మరోమారు రెవిన్యూ అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు సంబంధించి అమాయకులైన ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తే ఊరుకోనంటూ కలెక్టర్ హెచ్చరించారు. అలాగే తమ అధికారాలను సక్రమంగా వినియోగించాలని, పద్ధతి పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు SC కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి వారికోసం ప్రస్తుతం వడ్డీ పూర్తి రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.

పర్చూరులోని NTR క్రీడా వికాస కేంద్రంలో ఈ నెల 14న మెన్ డబుల్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ సమీవుల్లా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. విజేతలకు 1వ బహుమతిగా రూ.15,116లు, 2వ బహుమతి రూ.10,116లు, 3వ బహుమతి రూ.5,116లు, 4వ బహుమతి రూ.3,116లగా నిర్ణయించినట్లు చెప్పారు. వివరాలకు స్టేడియం నిర్వాహకులను సంప్రదించాలన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అటువంటి వారి కోసం ప్రస్తుతం వడ్డీ రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా రుణాలు వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.
Sorry, no posts matched your criteria.