Prakasam

News December 29, 2024

క్రికెటర్ నితీశ్‌‌ తల్లిది మన ప్రకాశం జిల్లానే.!

image

ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌లో తెలుగు తేజం నితీశ్ కుమార్ సెంచరీ (189 బంతుల్లో 114)తో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. కాగా నితీశ్ తల్లి జోత్స్న ప్రకాశం జిల్లా వాసులే కావడం గమనార్హం. ఆమె ఒంగోలు మండలంలోని చెరువుకొమ్మాలెం గ్రామానికి చెందిన వారు. అలాగే నితీశ్ కుటుంబీకులు మేనమామలు, తాతయ్య, అమ్మమ్మలు జిల్లాలోనే ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో నితీశ్ ప్రతిభ చాటడంతో ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2024

ప్రకాశం: పదో తరగతి‌ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలో వచ్చే సంవత్సరం జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజును తత్కాల్ కింద వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని DEO కిరణ్ కుమార్ తెలిపారు. రూ.1000 జరిమానా రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వచ్చేనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్లో నామినల్ రోల్స్ అందజేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

News December 29, 2024

పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ సమావేశం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పీఎం సూర్యఘర్ పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. 5వేలకు పైగా జనాభా ఉండి, సౌర విద్యుత్ వినియోగించే గ్రామాలను గుర్తించాలన్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News December 28, 2024

ఒంగోలు: ఆరు నెలల్లో 367 మంది క్షేమంగా ఇళ్లకు.!

image

జిల్లాలో గత ఆరు నెలల్లో 367 మంది తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురైన వారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు  ఎస్పీ దామోదర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఉన్నట్లు చెప్పారు. అలా 367 ‌మందిని గుర్తించి తీసుకొచ్చామన్నారు.

News December 28, 2024

పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: ఎస్పీ

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ – 2025ని శనివారం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, నాగరాజు పాల్గొన్నారు.

News December 28, 2024

గుండెపోటుతో కనిగిరి మాజీ ఎమ్మెల్యే అల్లుడి మృతి

image

కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అల్లుడు విష్ణు స్వరూప్ గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులోని వారి ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

News December 28, 2024

ఒంగోలు YCP కార్పొరేటర్‌పై దాడి

image

ఒంగోలు 32వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ తాడి కృష్ణలత, ఆమె భర్త వెంకటేశ్‌పై శుక్రవారం అర్ధరాత్రి కొందరు దాడి చేశారు. దాడికి పూర్తి కారణాలు తెలియనప్పటికీ వ్యక్తిగత విభేదాలతో వారిపై దాడికి పాల్పడ్డినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో మద్యంమత్తులో వారిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. కాగా వారు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడింది సమీపంలోని వాళ్ళని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 28, 2024

ప్రకాశం: పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారా?.

image

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈనెల 30న ప్రారంభమై జనవరి 10 వరకు జరగనున్నాయి. మొత్తం 5,345 మంది హాజరు కానుండగా.. అందులో 4,435 మంది పురుషులు, 910 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా డబ్బు కడితే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేస్తారని SP అన్నారు. ఎవరైనా ఇలా నగదు వసూలుకు పాల్పడితే 9121102266కు కాల్ చేయాలన్నారు.

News December 28, 2024

ఒంగోలు: పదో తరగతి‌ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో వచ్చే సంవత్సరం జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజును తత్కాల్ కింద వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. రూ.1000 జరిమానా రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల 10వ తేదీలోపు ఆన్‌లైన్లో నామినల్ రోల్స్ అందజేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

News December 28, 2024

జపనీస్ భాషపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా జపనీస్ భాషపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న డిమాండుకు అనుగుణంగా కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.