India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శుక్రవారం రోజుతో కొండపి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 2023-24కు సంబందించి పొగాకు కొనుగోళ్లు ముగిశాయని వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునిల్ కుమార్ తెలిపారు. కొనుగోళ్లు 154 రోజుల పాటు నిర్వహించామని, వేలంలో 50 కంపినీలు పాల్గొన్నాయన్నారు. రూ.467కోట్ల కొనుగోళ్లు జరిగాయని ఆయన వెల్లడించారు. రోజుకు సగటున 873 బేళ్ళ అమ్మకాలు జరిగాయన్నారు.
మార్కాపురంలో మానవత్వం మంట కలిసింది. పట్టణంలోని కంభం సెంటర్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో అప్పుడే పుట్టిన శిశువును డ్రైనేజీ కాలవలు శుభ్రం చేస్తుండగా కాలువలో మున్సిపల్ కార్మికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత పసికందును పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో కాలువలో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సింగరాయకొండ డ్రైవర్ పేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సీఐ హజరత్తయ్య వివరాల ప్రకారం.. సందాని, రషీదా దంపతులకు రెండో సంతానంలోనూ ఆడపిల్ల ఏడో నెలలో అనారోగ్యంతో పుట్టింది. తన భర్త సరైన వైద్యం చేయించకపోవడంతో బిడ్డ చనిపోయిందని తల్లి రషీదా ఆరోపించింది. దీంతో భర్త సందాని, అత్త మామలే చిన్నారి మరణానికి కారణమని సింగరాయకొండ పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అధికార వెబ్సైట్ ప్రకారం.. కనిగిరి రూరల్లోని షాప్ నంబర్ 123కు అత్యల్పంగా 4 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా చీమకుర్తి రూరల్లోని షాప్ నంబర్ 58కి 43మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ షాపునకు రూ.కోటీ 16 లక్షలు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇవాళ చివరి రోజు కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్ర ట్రాన్స్ పోర్టు & స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని దర్శి TDP ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలోని మినీ స్టేడియం ఇతరత్రా అంశాలపై మంత్రికి ఆమె వివరించారు. దర్శికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రిని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం మంత్రికి గౌతమ బుద్ధుడి ప్రతిమ బహూకరించారు.
అద్దంకి పట్టణంలో వేంచేసియున్న శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవస్థానం 53వ దసరా నవరాత్రులు సందర్భంగా.. 53 కిలోల లడ్డూను అద్దంకి పట్టణానికి చెందిన భక్తులు వూటుకూరి సుబ్బరామయ్య, వారి సోదరులు గురువారం అమ్మవారికి సమర్పించారు.
చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనను సినీ నటుడు శ్రీకాంత్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా త్రిముఖ దుర్గాంబిక అమ్మవారిని, శివయ్యను, భైరవేశ్వరుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ను సత్కరించారు.
అతనో పేద రైతు. ఎంతో కష్టపడ్డాడు. అయినా సరే అప్పులే మిగిలాయి. మరోవైపు ఎదిగి వచ్చిన కుమార్తె పెళ్లి. తప్పనిస్థితిలో మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టాడు. అర్ధరాత్రి ఆ నగదును దొంగలు దోచేశారు. ఉదయాన్నే నిద్రలేచిన రైతుకు డబ్బు కనపడకపోవడంతో బోరున విలపించారు. ఈ <<14311035>>బాధాకరమైన<<>> ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లె గ్రామంలోని వీరంరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 16.1 మిలియన్ల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు వేలం కేంద్రం అధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కిలో పొగాకు సరాసరి రూ.221లు రైతులకు లభించింది. ఈ ఏడాదికి రూ.279 అందినట్లు చెప్పారు. ప్రస్తుత ధర పోల్చుకుని పొగాకు అత్యధికంగా పండిస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు.
ప్రకాశం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. అర్ధవీడు మండల MRO కుక్కమూడి దాసు (54) యర్రగొండపాలెం నుంచి విధులకు బయల్దేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో ప్రథమ చికిత్స చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా చనిపోయారు. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమళ్లపాడు గ్రామం.
Sorry, no posts matched your criteria.