Prakasam

News December 23, 2024

ఒంగోలు: పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌కు 68 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 68 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.

News December 23, 2024

ప్రకాశం జట్టుకు ప్రథమ స్థానం

image

ఈనెల 21వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించినట్లు ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారాంరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్టును చంద్రగిరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అభినందించారన్నారు. ఈ జట్టు బాపట్ల జిల్లా పంగులూరులో 20 రోజులు పాటు శిక్షణ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

News December 23, 2024

ప్రకాశం జిల్లాలో ఒకేరోజు 2సార్లు భూకంపం

image

ప్రకాశం జిల్లా తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో వరుస భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ముండ్లమూరు మండలంలో ఉదయం 11 గంటలకు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాత్రి 7 గంటల సమయంలో మరోసారి భూమి కంపించినట్లు సమాచారం. తాళ్లూరు మండలంలో సాయంత్రం గంట వ్యవధిలో‌ 2సార్లు భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇలా భూమిలో ప్రకంపనలకు కారణం భూమిలోని పొరల సర్దుబాటేనని పరిశోధకులు అంటున్నారు.

News December 23, 2024

ఒంగోలు పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ మాట్లాడారు. క్రిస్మస్‌ శాంతి, సంతోషాలకు ప్రేమ, త్యాగనిరతికి చిహ్నమన్నారు.‌ క్రీస్తు బోధనలు మంచి మార్గంలో నడిపిస్తాయని‌ చెప్పారు. అనంతరం పెయింట్, డ్రాయింగ్ గ్రీటింగ్ కార్డులు, నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను ఎస్పీ అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో AR అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు.

News December 22, 2024

 ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించింది. అదే మండల పరిధిలోని సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూ ప్రకంపనలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే శనివారం రోజు కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

News December 22, 2024

పుష్ప-2 సినిమా చూసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నర్సు మృతి

image

దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.

News December 22, 2024

ప్రకాశం: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం

image

గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూత వేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం.

News December 21, 2024

చీపురు పట్టిన జాయింట్ కలెక్టర్

image

మద్దిపాడు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పరిశ్రమ శుభ్రత కార్యక్రమాన్ని ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

News December 21, 2024

జీఎస్‌డీపీ వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేయాలి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా 15% జీఎస్‌డీపీ వృద్ధిరేటు లక్ష్యంతో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15 శాతం జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు.

News December 20, 2024

సింగరాయకొండ: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

image

సింగరాయకొండలో భాష్యం స్కూల్ బస్సు అదుపుతప్పి పంట కాలవలోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. 13 మంది స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లుతుండగా అదుపు తప్పి పంట పొలాల్లోకి వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది.