Prakasam

News March 19, 2024

గిద్దలూరు: గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

image

గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గిద్దలూరు మండలం పరమేశ్వర్ నగర్ గ్రామానికి చెందిన <<12881965>>TDP కార్యకర్త<<>> మునయ్యపై నలుగురు వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునయ్యను హైదరాబాద్ లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మునయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 19, 2024

ఒంగోలు: వైసీపీకి మేలు చేశారన్న అభియోగంపై టీచర్ రిలీవ్

image

రానున్న ఎన్నికలలో వైసీపీకి మేలు చేసేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం.ప్రసాద్ వ్యవహరిస్తుండడంతో ఆ బాధ్యత నుంచి రిలీవ్ చేశారు. ఒంగోలులో ఆయ‌న ప్రస్తుతం సిబ్బందికి ఎన్నికల విధులు వేసే పనిలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

News March 19, 2024

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా‌ లోడు వ్యాను ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైకు మీద ఉన్న ఇద్దరు యువకులు డివైడర్‌ మీద పడి అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

అనుమానస్పద ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమానస్పద ఆర్థిక లావాదేవీలు అక్రమంగా డబ్బు తరలింపును కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగము బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్ లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమానస్పద లావాదేవీలు అంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.

News March 18, 2024

ప్రకాశం: 74 మంది ఇంటర్ అధ్యాపకులకు నోటీసులు

image

జిల్లాలో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి గైర్హాజరైన 74 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ అయ్యాయి. ఒంగోలులోని ఓ జూనియర్ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, పౌరశాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు 405 మంది అధ్యాపకులను నియమించారు. వీరిలో 331 మంది హాజరు కాగా, 74 మంది గైర్హాజరయ్యారు. వీరికి ఆర్‌ఐవో సైమన్ విక్టర్ నోటీసులు జారీ చేశారు.

News March 18, 2024

ప్రకాశం: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

అతివేగంగా వస్తున్న బైకు అదుపు తప్పడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మద్దిపాడు ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ఒంగోలు కేంద్రంగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసుకుని తిరిగి ఒంగోలు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను కొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతిచెందాడు.

News March 18, 2024

విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి: డీఈవో

image

జాతీయ ఉపకార వేతనం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికైన విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో కోరారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాలలో స్కాలర్ షిప్ నకు ఎంపికై ప్రస్తుతం 9 నుంచి ఇంటర్ చదువుతూ రెన్యూవల్ చేయించుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా తమ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని తెలిపారు.

News March 18, 2024

పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తప్పక పాటించి సహకారం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయా పార్టీల పాలసీల గురించి మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.

News March 18, 2024

గుడ్లూరు: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

మండలంలోని పొట్లూరులో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా ఉండేందుకు కొందరు విద్యుత్ తీగ ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు(53) శనివారం రాత్రి తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా కాలికి కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. దీంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News March 18, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతి చెందారు. వోలేటివారిపాలెం మండలం కొండ సముద్రానికి చెందిన వేణుగోపాల్(32) జగిత్యాల జిల్లా కొండగట్టుకు వలస వెళ్లారు. నిన్న ఉదయం పసుపులేటి శ్రీకాంత్ (27), వెంకటేశ్ (33) కూలీలను తన బైక్‌పై తీసుకుని మెట్‌పల్లిలో మేస్త్రి పనులకు బయలుదేరాడు. జగిత్యాల-కోరుట్ల మార్గంలో వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు.