India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని ఇష్టకామేశ్వరీ దేవి ఆలయానికి వెళుతూ తప్పిపోయిన 15 మంది భక్తులను పోలీసులు రక్షించారు. బుధవారం శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి ఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి కాలి నడకన వెళుతూ అటవీప్రాంతంలో తప్పిపోయి 100కు కాల్ చేయగా యర్రగొండపాలెం పోలీసులు వారికోసం నల్లమల అడవిలో గాలించి వారిని రక్షించారు. వీరంతా రేపల్లె మండలం మంత్రిపాలెం వాసులుగా గుర్తించారు.
జిల్లాలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు విజయవాడలో గాంధీజీ మున్సిపల్ హైస్కూలులో ఈనెల 21, 22వ తేదీల్లో నిర్వహించనున్న అకౌంట్ టెస్ట్కు హాజరుకావాలని DEO కిరణ్ కుమార్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే హెచ్ఎంలు ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అందరూ సకాలంలో హాజరుకావాలని చెప్పారు.
తండ్రీకొడుకు, భార్యాభర్త అనురాగం ఎంత గొప్పదో తెలిపే ఘటన ఇది. కట్టుకున్న వాడి కోసం కిడ్నీని, కన్నతండ్రి కోసం కాలేయాన్నే వదులుకున్న త్యాగమూర్తుల కథ ఇది. ఒంగోలుకు చెందిన రామారావు(54)కు కిడ్నీ, లివర్ ఫెయిల్ అయ్యాయి. ఎవరైనా అవయవాలు డొనేట్ చేస్తారేమోనని చూసినా ఫలితం లేకపోయింది. నాగవల్లి కిడ్నీని, కౌశిక్ లివర్లో కొంత భాగాన్ని రామారావుకు ఇవ్వడంతో హైదరాబాద్ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
ప్రకాశం జిల్లాలో ఈనెల 18 నుంచి 23 వరకు APPSC నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం JC ఎపీపీఎస్సీ అధికారులు, పోలీస్, విద్యుత్, వైద్యశాఖ, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
ప్రకాశం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో మంగళవారం ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జీషీట్లు ఏవిధమైన ఆలస్యం లేకుండా ఫైల్ చేయాలన్నారు. అనంతరం కోర్టులో విచారణ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఒంగోలులో ఈనెల 14న కిడ్నాపైన బాలుడి కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. త్రోవగుంట వద్ద దయామణి, మణికంఠలను అదుపులోకి తీసుకోని విచారించగా బాలుడిని తామే కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు. దయామణి మణికంఠతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఒంగోలులో ఉంటుంది. బాలుడిని ఇద్దరూ కలిసి కిడ్నాప్ చేశారని సీఐ తెలిపారు. నిందితులకు జడ్జి రిమాండ్ విధించారని సీఐ వెల్లడించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని <<14846862>>రాళ్లపాడు ప్రాజెక్ట్<<>> కుడి కాలువ గేటు మరమ్మతులకు గురైన విషయం తెలిసిందే. అధికారులు, MLA ర్రాతికి రాత్రే స్పందించి 10 రోజులుగా ప్రత్యేక బృందాలతో పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. <<14890737>>క్రెయిన్<<>> సాయంతో పనులు చేపట్టినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీల సమస్యలను సులువుగా తీర్చిన ఇంజినీర్ కన్నయ్య నాయుడి సలహాలు తీసుకుంటారా అన్నది తెలియాల్సిఉంది.
హైవేపై లిఫ్ట్ ఇవ్వడం ఎంత డేంజరో అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ఉలవపాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఈనెల 11న బైకుపై వెళ్తుండగా GVR ఫ్యాక్టరీ వద్ద ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. ప్లాన్ ప్రకారం కాస్త ముందుకు వెళ్లాక ఊళ్లపాలేనికి చెందిన ప్రశాంత్ ఫ్రెండ్స్ కొల్లా సాయి, పసుపులేటి శ్రీకాంత్.. వెంకటేశ్వర్లును బెదిరించి బైక్ తీసుకుని పారిపోయారు. సింగరాయకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
కొమరోలు మండలం వెన్నంపల్లిలో వెంకట లక్ష్మమ్మ అనే వృద్ధురాలి పట్ల కన్న కొడుకులు కనికరం లేకుండా వ్యవహరించారు. వయసు పైబడిన తల్లిని పట్టించుకోకుండా నడిరోడ్డుపై వదిలేశారు. గత కొద్ది కాలంగా చలికి వణుకుతూ.. నడిరోడ్డుపై వృద్ధురాలు జీవనం సాగిస్తుందని స్థానికులు ఆదివారం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ వృద్ధురాలు పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడతామన్నారు.
ప్రకాశం జిల్లా జూనియర్ బాలికల కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ అదివారం తెలిపారు. ఈ జట్టు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు హాజరత్తయ్య సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.