India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వచ్ఛ శ్రీకాకుళం సాధనతో సహా, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛతను ప్రజల దైనందిన జీవన విధానంలో భాగం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతీ మూడో శనివారం స్వచ్ఛదివాస్ కార్యక్రమాన్ని చేయాలన్నారు.
రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయం నుంచి మీడియాతో రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులు, ఉల్లి ధరలపై జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమన్నారు. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మంత్రి అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనలో రైతులు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డారన్నారు.
ఎమ్మార్పీ ధర కన్నా యూరియా అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత రాకూడదని ఆదేశించారు. కృత్రిమ కొరత నివారించేందుకు అగ్రికల్చరల్ కోపరేటివ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాకు అధిక సంఖ్యలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం వీసి ద్వారా సమీక్ష చేశారు. అవార్డులు గెలుచుకున్న వారికి రూ.లక్ష రివార్డు, జిల్లా స్థాయి అవార్డులకు రూ.25 వేల వరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో అవార్డులను సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
అన్నదాతలకు ఎక్కడ కూడా ఎరువులు, పురుగుల మందులు కొరత రానీయారదని, కృత్రిమ కొరత సృష్టించే ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 1.83 కోట్లు రూపాయలు విలువైన 934 మెట్రిక్ టన్నులు ఎరువులు సీజ్ చేసి 67 కేసులు నమోదు చేశామన్నారు.
కోటబొమ్మాలి–తిలారు రైల్వే స్టేషన్ మధ్య రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లుగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అతని కుడిచేయిపై ‘శ్రీను’ అనే పచ్చబొట్టు ఉందని వివరించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.
కోటబొమ్మాళి మండలం యలమంచిలి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కవిటి ఆనందరావు, భాస్కరరావు నాలుగు నెలల వ్యవధిలో మృతిచెందారు. తండ్రి ఆనందరావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈ ఏడాది మే 20వ తేదీన మరణించాడు. తండ్రి మరణంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన కుమారుడు భాస్కరరావు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో మద్ది జగన్మోహిని (34) అనే మహిళ సోమవారం మృతి చెందింది. టెక్కలి మండలం భగవాన్ పురం గ్రామానికి చెందిన మహిళ డెంగ్యూ జ్వరంతో కొన్ని రోజులుగా రిమ్స్లో చికిత్స పొందుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా భగవాన్పురం గ్రామంలో జ్వరాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వైద్య శిబిరాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
మెలియాపుట్టి(M) సానిపాలెం, సవర సానిపాలెం గ్రామాల పేర్లు మార్చాలని సోమవారం ఆయా గ్రామస్థులు జిల్లా అధికారులకు వినతిపత్రం అందించారు. తమ గ్రామాల పేర్లు పలికేందుకు అసభ్యకరంగా ఉండడంతో గ్రామస్థులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్వం ఒరిస్సా రాష్ట్రం పర్లాఖిమిడి రాజవంశీయులు ఈ ప్రాంతంలో ఒంపుడుగత్తెలను ఉంచి వారికి మాన్యం కింద భూములు ఇచ్చారు. ఆనాటి నుంచి ఈ ఊర్లను ఆ పేర్లతో పిలిచేవారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ప్రవేశాలకు సెప్టెంబర్ 3వ తేదీ తుది గడువు. ఈ మేరకు అన్ని కళాశాలకు ఉన్నత విద్యా మండలి నుంచి ఆదేశాలు రావడంతో సంబంధిత ప్రిన్సిపాల్స్, సిబ్బంది ప్రవేశాలపై దృష్టి సారించారు. వాస్తవానికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా గడువు పొడిగింపుతో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.