India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన పి జగన్మోహిని అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె కుమారుడు శివాజీ బెంగళూరులో వలస కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. మరణ వార్త తెలిసి వచ్చినప్పటికీ ఆయన భార్య గర్భిణి కావడంతో అంత్యక్రియలు చేసేందుకు అవకాశం లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో అవివాహితగా ఉన్న కుమార్తె నాగమ్మ తన తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేశారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసి, పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారన్నారు. సంస్కరణోద్యమంగా పేరుగాంచి కుల మత వర్ణ విబేధాలకు స్వస్తి పలికారన్నారు.
ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలు వేట నిషేధం ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 61 రోజులు పాటు వేటనిషేధం సమయంలో యాంత్రిక బోట్లు గాని, మోటారు బోట్లతో వేటకు వెళ్లరాద్దన్నారు. ఈ 61రోజుల వ్యవధిలో చేపలతో పాటు, సముద్రపు జీవులు గుడ్లు, పిల్లలు ఉత్పత్తి చేసే సమయం అయినందున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్(CHE), తెలంగాణలోని చర్లపల్లి(CHZ) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం CHZ- CHE(నెం.07025), ఏప్రిల్ 12 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం CHE- CHZ(నెం.07026) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
పాతపట్నం మండలంలోని పాసిగంగుపేట గ్రామం సమీపంలోని అప్పలమ్మ Garden మామిడి చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాసిగంగుపేట గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ (21) గురువారం సాయంత్రం ఊరేసుకుని మృతి చెందాడు. పాతపట్నం ఎస్ఐ బి.లావణ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నందిగాం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు కొండాల గోపాలంపై గురువారం మరో పొక్సో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 22న పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా కేసు నమోదైనప్పటికి ఆయన రిమాండ్లో ఉన్నారు. తాజాగా మరో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ అలీ తెలిపారు.
టెక్కలి పట్టుమహాదేవి కోనేరు గట్టును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. టెక్కలి రెవెన్యూ, పంచాయతీ, ఇంజినీరింగ్, మండల పరిషత్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కోనేరు పర్యాటక అభివృద్ధి చేయనున్న దృష్ట్యా పలు అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీభాయి తదితరులున్నారు.
గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణం పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్కి చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రీసర్వే, పీజీఆర్ఎస్, పౌర సేవల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా DMHOగా డాక్టర్. బి.సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు DMHOగా పనిచేసిన బాలమురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. సుజాత ప్రస్తుతం విశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.