Srikakulam

News April 2, 2024

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఇచ్చాపురం – వసుపత్రి చక్రవర్తిరెడ్డి, పలాస – మజ్జి త్రినాథ్ బాబు, పాతపట్నం – కొప్పురోతు వెంకటరావు, శ్రీకాకుళం – పైడి నాగభూషణరావు, ఆమదాలవలస – సనపల అన్నాజీరావు, ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు, నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి, రాజాం – కంబాల రాజవర్దన్, పాలకొండ – చంటిబాబు.

News April 2, 2024

పొగట్టుకున్న మొబైల్ ఫోన్లు… బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ

image

పొగట్టుకున్న మొబైల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే రికవరీ చేసి బాధితులకు మంగళవారం ఉదయం జిల్లా పోలిసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాధిక అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో Lost Mobile Tracking System (LMTS) ద్వార 446 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. దీనితో బాధితులు సంతోషం వ్యక్తపరచి, జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, శ్రీనువాసు, ఉన్నారు.

News April 2, 2024

శ్రీకాకుళం: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

image

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మన్యం జిల్లావాసిని హత్య చేసిన ఘటన ఒడిశాలోని పర్లాఖెముండిలో జరిగింది. గురండి పోలీసుల కథనం మేరకు.. భామిని మండలం బట్టిపురం గ్రామానికి చెందిన లింగరాజు(28), జయలక్ష్మి దంపతులు. ఆమెకు మన్యం జిల్లా బత్తిలికి చెందిన ఉపేంద్రతో వివాహేతర సంబంధం ఉంది. లింగరాజును గురువారం తన స్వగ్రామంలో జరిగిన వివాహానికి భార్య తీసుకెళ్లింది. పథకం ప్రకారం 53 సార్లు పొడిచి చంపారు.

News April 2, 2024

తాగునీటికి సమస్య ఉండకూడదు: కలెక్టర్

image

ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సిబ్బందికి ఆదేశించారు. తాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, నీటి నిల్వలకు అనుగుణంగా వేసవి మొత్తం సరఫరాకు చేసేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. రానున్న రోజులలో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 2, 2024

శ్రీకాకుళం: 1210 మందితో పది మూల్యాంకనం

image

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల కేంద్రాలుగా స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. తొలిరోజు 7 సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేపట్టారు. 1210 మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

News April 2, 2024

శ్రీకాకుళం: REWIND: ద్విసభ్య విధానం అంటే?

image

ఇద్దరేసి సభ్యులు ప్రాతినిధ్యం వహించే వాటిని ద్విసభ్య నియోజకవర్గాలు అంటారు. ఇవి పార్లమెంటుకే కాక, రాష్ట్ర శాసనసభలకూ ఉండేవి. బ్రిటిషు వారు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ స్వాతంత్రం తరువాత కూడా కొనసాగింది. ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు జనరల్, ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందినవారు ఉంటారు. ఈవ్యవస్థలో లోపాలు ఉండటంతో కాంగ్రెస్ 1961లో రద్దు చేసింది. 1952లో పాతపట్నం ద్విసభ్య ఎన్నికలు జరిగాయి.

News April 2, 2024

సరుబుజ్జిలి: నవోదయ పాఠశాలకు 80 మంది ఎంపిక

image

సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస వద్ద ఉన్న జవహర్ నవోదయ పాఠశాలకు 80 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికైనట్లు నవోదయ ప్రిన్సిపల్ దాసరి పరశురామయ్య సోమవారం తెలిపారు. ఇటీవల నవోదయ నిర్వహించిన ప్రవేశ పరీక్ష లకు 7,170 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచామని పేర్కొన్నారు. వారంతా ఈ నెల 3వ తేదీన విద్యాలయంలో హాజరుకావాలని సూచించారు.

News April 2, 2024

శ్రీకాకుళం: ఓ ఇంటిలోకి చొరబడిన ఎలుగుబంటి

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి మంగళవారం తెల్లవారుజామున ఎలుగుబంటి చొరబడి హల్‌చల్ చేసింది. గమనించిన స్థానికులు భయంతో వణుకుతూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల కాలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు.

News April 2, 2024

శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట

image

ఈనెల 4వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట సెలవులు ఇస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీఓ బి.శాంతి శ్రీ సోమవారం తెలిపారు. వేసవి నేపథ్యంలో జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అన్ని కేంద్రాలకు ఈ నెల 31వ తేదీ వరకు ఒంటిపూట సెలవులు ఉంటాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యకర్త కేంద్రంలో ఉండాలన్నారు.

News April 2, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: డీజీపీ

image

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, సమాచారం సేకరణ వంటి అంశాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి ఎస్పీ జీ.ఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ డీజీపీ జిల్లాలోని పోలింగ్ వద్ద భద్రత వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.