Srikakulam

News January 15, 2026

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

News January 15, 2026

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

News January 15, 2026

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

News January 14, 2026

శ్రీకాకుళం: భోగికి దూరంగా బూరవెల్లి, లింగాలవలస గ్రామాలు

image

శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలోని బూరవెల్లి, జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్థులు భోగి పండగకు దూరంగా ఉంటారు. ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులంతా వచ్చినా ఇక్కడ భోగి మంటను మాత్రం వేయరు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమను అందరిలాగే ఘనంగా జరుపుకొంటారు. పెద్దల కాలం నుంచి గ్రామంలో భోగి మంటను వేయడం లేదని, అందువల్ల తాము కూడా భోగి పండుగకు దూరంగా ఉంటామని బూరవెల్లి గ్రామస్థులు చెబుతున్నారు.

News January 14, 2026

అరసవల్లిలో ‘సామాన్య’ దర్శనానికే పెద్దపీట

image

అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకే అగ్రతాంబూలం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలనిన్నారు

News January 13, 2026

శ్రీకాకుళం: మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు పూర్తి

image

మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు శ్రీకాకుళంలో మంగళవారం పూర్తి చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రజా సేవ లక్ష్యంగా పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్యే రమణమూర్తి పేర్కొన్నారు. ఎన్నో ఎదురు దెబ్బలకు ఎదుర్కొన్న ఆయన టీడీపీలో ఊపిరి పోయేవరకు కొనసాగారని వివరించారు. ఆయన మృతితో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News January 13, 2026

మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

image

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.

News January 13, 2026

కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

image

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.