Srikakulam

News October 21, 2024

సోంపేట: డెంగీతో విద్యార్థి మృతి

image

సోంపేట మండలం బారువా గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి సాయి (14) డెంగీతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థి దసరా సెలవులకు గ్రామానికి వచ్చి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో బరంపురం హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స కోసం చేర్పించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ విద్యార్థి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News October 21, 2024

SKLM: జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పరిస్థితి ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఆదివారం అధికారులతో కలసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయిలో శ్రీకాకుళం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేయడమైనదన్నారు. తుఫాన్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారు.

News October 20, 2024

SKLM: కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం: ఎస్పీ

image

శిక్షలు శాతం పెరిగేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులే కీలకమని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో కోర్టు కేసులు, హాజరు పరచడం, కేసు అభియోగ పత్రాలు, ఇతర అంశాలపై సమీక్షా నిర్వహించారు. కోర్టు విధులలో భాగంగా ప్రతి ఒక్కరు బాధ్యత, అంకితభావంతో పని చేయాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట ఎస్ఐ పారినాయుడు ఉన్నారు.

News October 20, 2024

టెక్కలిలో దివ్వెల మాధురికి నోటీసులు 

image

టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి ఆదివారం తిరుపతి పోలీసులు నోటీసులు అందించారు. తిరుమల మాడ వీధుల్లో ఫొటో షూట్, రీల్స్ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొద్ది రోజుల క్రితం తిరుపతి పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం టెక్కలిలో మాధురికి నోటీసులు అందించారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్, మాధురి అంశం మరలా చర్చనీయాంశంగా మారింది. 

News October 20, 2024

నేడు జిల్లా జూనియర్స్ ఖోఖో జట్ల ఎంపిక

image

జిల్లా జూనియర్స్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపికలు ఆదివారం జరగనున్నాయని జిల్లా ఖోఖో అసోసియేషన్ శ్రీకాకుళం అధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదాన వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. క్రీడాకారుల ఇండెక్స్ వయస్సు, బరువు, ఎత్తు కలిపి మొత్తం 250పాయింట్లు ఉండాలన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 25న రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. 

News October 20, 2024

పోలాకి: మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు

image

తీర ప్రాంతాలు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ZP సీఈవో శ్రీధర్ రాజు సూచించారు. శనివారం పోలాకి మండలంలోని రామన్ కొత్త రేవు, DL పురం, గుప్పిడిపేట తదితర గ్రామ తీర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగా హెచ్చరించారు.

News October 20, 2024

శ్రీకాకుళం: జాబ్ కార్డు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించండి

image

జాబ్ కార్డు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హత ఉన్న వారికి జాబ్ కార్డు మంజూరు కాలేదని ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాబ్ కార్డులు మంజూరులో ఫిర్యాదులు వస్తే ఏపీఓపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.

News October 19, 2024

SKLM: నవంబర్ 6 వరకు ఉపాధ్యాయ ఓటర్ల నమోదు

image

ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు సూచించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను అనుసరించి సెప్టెంబరు 30వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడిందని, అదే రోజు నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. నవంబర్ 6వ తేదీన ఓటర్‌గా నమోదుకు చివరి తేదీగా నిర్ణయించామని స్పష్టం చేశారు.

News October 19, 2024

SKLM: ఒక్కో ఇంటికి ఒక ఉద్యోగం అవకాశం ఇవ్వాలి- MLA

image

అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి అయితే ఒక్కో ఇంటికి ఒక ఉద్యోగం అవకాశం కల్పించాలని ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కోరారు. శనివారం కలెక్టరేట్‌లో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. కాలనీల్లో షాపింగ్ కాంప్లెక్స్, సచివాలయాలు, ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ, సైక్లోన్ సెంటర్, బస్సు షెల్టర్, పోస్టాఫీసు ఏర్పాటు చేయాలన్నారు.

News October 19, 2024

SKLM: పథకాలు లబ్ధిదారులకు శతశాతం అందజేయాలి

image

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాలు లబ్ధిదారులకు శతశాతం అందజేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ మందిరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన జిల్లా స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. లబ్ధిదారులకు శతశాతం అందజేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

error: Content is protected !!