Srikakulam

News October 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో 158 పేర్లు ఖరారు

image

శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లాటరీ నిర్వహించారు. జిల్లాలో 158 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో 158 పేర్లు ఖరారు చేసినట్లు వారు పేర్కొన్నారు.

News October 14, 2024

శ్రీకాకుళంలో 113 మద్యం షాపుల పేర్ల ప్రకటన

image

శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదిలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీవో కె.సాయి ప్రత్యూషలు లాటరీ నిర్వహణ చేపట్టారు. ఇప్పటి వరకు 113 మద్యం షాపుల పేర్లు లాటరీ పద్ధతిలో ప్రకటించినట్లు వారు తెలిపారు.

News October 14, 2024

సంతబొమ్మాళిలో వివాహిత అనుమానాస్పద మృతి

image

సంతబొమ్మాళి మండలం తెనిగిపెంట గ్రామానికి చెందిన పెంట రేవతి (19) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈనెల 4వ తేదీ నుంచి రేవతి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 6వ తేదీన గ్రామంలోని ఒక బావిలో రేవతి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే రేవతిది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 14, 2024

SKLM: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న 158 మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. 158 మద్యం దుకాణాలకు 4,671 దరఖాస్తులు అందాయి. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 14, 2024

SKLM: DSC అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

DSC రాయనున్న SC,ST అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ DD విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 3 నెలల పాటు శిక్షణ పొందేందుకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http:jnanabhumi.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 22 నుంచి 25లోగా హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు.

News October 14, 2024

SKLM: నేడు మద్యం దుకాణాలు లాటరీ

image

శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాలను సోమవారం లాటరీ పద్ధతిలో దరఖాస్తుదార్లకు కేటాయించనున్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు గాను, 4670 దరఖాస్తులు వచ్చాయి. మద్యాన్ని ప్రయివేట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం వెలువరించిన విధివిధానాలకు లోబడి ఈప్రక్రియ జరగనుంది. స్టేషన్ల వారీగా ఆడిటోరియంలోకి పిలిచి లాటరీ తీస్తారు.

News October 13, 2024

ముగిసిన సెలవులు.. రేపటి నుంచే స్కూల్స్, కాలేజీలు

image

శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి పాఠశాలు, ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వగా నేటితో ముగిశాయి. అలాగే మరో పక్క జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు ఈనెల 7వ తేదీ నుంచి సెలవులు ప్రకటించగా నేటితో ముగియనున్నాయి. దీనితో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.

News October 13, 2024

లావేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

లావేరు మండలం కేశవరాయనిపాలెం పంచాయతీ హనుమయ్యపేట గ్రామానికి చెందిన నాయిని చంటి (26) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న మురపాకు టిఫిన్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీకొంది. భర్త మృతి చెందడంతో భార్య భవాని ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భవాని మూడు నెలల గర్భవతి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News October 13, 2024

టెక్కలి: వారంలో కుమార్తె పెళ్లి.. యాక్సిడెంట్‌లో తండ్రి మృతి

image

టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన రుంకు మోహనరావు(55) అనే వ్యక్తి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈనెల 20వ తేదీన తన కుమార్తె హిమ వివాహం నేపథ్యంలో పెళ్లి పిలుపులకు సైకిల్‌పై వెళ్తుండగా టెక్కలి జాతీయ రహదారిపై విక్రంపురం గ్రామం సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News October 13, 2024

శ్రీకాకుళం: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

SC, STఅభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష కోసం మూడు నెలలు పాటు అర్హులైన మెరిట్ అభ్యర్థులకు రాష్ట్రంలో శిక్షణ పొందుటకు అవకాశం ఉందని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం http://jnanabhumi.ap.gov.in ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం ఉందని పేర్కొన్నారు.