India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✮ రేపు అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం
✮శ్రీకాకుళం: కలెక్టర్ కు 108 ఉద్యోగుల సమ్మె నోటీసు
✮సోంపేట: గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిశా వాసి
✮శ్రీకాకుళం: ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
✮నరసన్నపేట: Way2News కథనానికి స్పందన..వ్యర్థాలు తొలగింపు
✮కొత్తూరు మండల ఏపీఎంగా రవిరాజు
✮టెక్కలి: అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్య
✮మందస: పశువుల తరలింపును అడ్డుకున్న పోలీసులు

నూతన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు జరిగిన పనులను స్వయంగా ఆయన గురువారం పరిశీలించారు. ఇంత వరకు పూర్తికాని నిర్మాణాల గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్ను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తి కట్టడాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ గురువారం నియామక పత్రాలు అందజేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతికుమారి (అమలపాడు), కె.పావని (బ్రాహ్మణతర్ల), హెచ్. శాంతిలక్ష్మి (బోరుభద్ర) కే ప్రసాదరావు (గొప్పిలి) పదోన్నతి పొందారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న మెనూలో స్వల్పమార్పులు జరిగాయి. కేంద్రాల్లో చిన్నారులకు మంగళ, శనివారాలు ఉదయం ఉడకబెట్టిన శనగలు, మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్రైస్ పెట్టాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అన్నం, ఆకుకూరలు, పప్పు, కూరగాయలు, పాలును అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,562 కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వచ్చింది.

శ్రీకాకుళం జిల్లాలోని మోడల్ స్కూల్ లలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు గురువారంతో ముగియనుంది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్స్ స్కూళ్లలో దాదాపు 15 పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవిబాబు ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయాన్ని సందర్శించాలని దరఖాస్తులను ఆయా మోడల్ స్కూల్లలో సమర్పించవచ్చని ఆయన సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలోని దేవాదాయశాఖలో ఈఓల(Executive Officers) కొరత ఉన్నట్లు సమాచారం. దీంతో జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో పర్యవేక్షణతో పాటు ఎండోమెంట్ భూముల పరిరక్షణ కొరవడుతోంది. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో 795 ఆలయాలకు కేవలం 8 మంది ఈఓలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఈఓలు నాలుగు నెలలలో ఉద్యోగ విరమణ కానున్నారు. దీంతో దేవాదాయశాఖ అంశాల పర్యవేక్షణ మరింత క్లిష్టతరమవుతోంది.

మందస మండలం రాధాకృష్ణపురం సమీపంలోని డా. బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మెనూ, వంటశాల, భోజనశాల, సరుకుల గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం గురుకులంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు.

మందస మండలం రాధాకృష్ణపురం సమీపంలోని డా. బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మెనూ, వంటశాల, భోజనశాల, సరుకుల గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం గురుకులంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు.

మందస మండలం రాధాకృష్ణపురం సమీపంలోని డా. బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మెనూ, వంటశాల, భోజనశాల, సరుకుల గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం గురుకులంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.