India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెక్కలి – మెలియాపుట్టి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న AP39 UU 7060 నంబరు లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 1033 హైవే అంబులెన్స్
ద్వారా అతన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్, మటన్, చేపల ధరలు పెరిగాయి. బాయిలర్ స్కిన్ చికెన్ కిలో రూ. 210, స్కిన్లెస్ రూ.220, నాటుకోడి రూ.800కి విక్రయించారు. గత వారంతో పోలిస్తే ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మటన్ కిలో రూ. 900, చేపలలో బొచ్చలు రూ.250, కోరమీను రూ.450కి అమ్మకాలు జరుగుతున్నాయి. సాధారణ వినియోగదారులు ఖర్చులు భారమవుతున్నాయని అంటున్నారు.

రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ అనిల్ చంద్ర పునేఠ శనివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ ఈయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

⍟జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
⍟ జిల్లాలో పలు చోట్ల సర్ధార్ గౌతు లచ్చన్న జయంతి
⍟ టీడీపీ ఎమ్మెల్యే కూన రవి తీరుపై వైసీపీ మండిపాటు
⍟ ఎల్.ఎన్ పేట: భారీ గుంతతో ప్రమాదం తప్పదా ?
⍟ టెక్కలి: షాపు తెరవకపోయినా.. రూ.7వేలు విద్యుత్ బిల్లు
⍟కిడ్నీ వ్యాధిగ్రస్థుల మృత్యుఘోష పట్టదా: సీపీఎం
⍟ కాశీబుగ్గలో 20 కేజీల గంజాయి స్వాధీనం
⍟ శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు

పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ ఎమ్మెల్యే కూన రవికుమార్పై నిరాధారణమైన ఆరోపణలు చేయడం తగదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత అన్నారు. ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే రవికుమార్ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని అన్నారు. ప్రిన్సిపల్ తన ఉద్యోగరీత్యా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యేపై YCP ఆరోపణల్లో నిజం లేదన్నారు.

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులకు ఫోన్లు చేసి వేధిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘కేజీబీవీ ప్రిన్సిపల్కు కూడా ఆయన వేధింపులు తప్పడం లేదు. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బదిలీ చేయిస్తానని బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది. ఎమ్మెల్యే తన శాడిజం చూపుతున్నారని మండిపడింది.

ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన నాయక్, రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్ వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకి పంపించామని అన్నారు.

జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అభివృద్ధికి కృషి చేసిన రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు త్యాగాలు మరువలేని అన్నారు.

స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 79వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో త్రివర్ణ పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జన్మించారు. బారువ, మందస పాఠశాలలో విద్యాభ్యాసం ముగించుకొని 21వ ఏట గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. పలు ఉద్యమాలలో పాల్గొన్న లచ్చన్న అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు. లచ్చన్న భారతదేశం స్వాతంత్ర్యం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించారు. స్వాతంత్ర అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.
Sorry, no posts matched your criteria.