Srikakulam

News October 8, 2024

SKLM: 2714 అభివృద్ధి పనులకు అనుమతులు- కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంపై మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పంచాయతీల పరిధిలో 3071 పనులు గుర్తించామని.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.249 కోట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వీటిలో 2714 పనులకు అనుమతులు ఇచ్చామన్నారు.

News October 8, 2024

కంచిలి: భవానీ సన్నిధానంలో విషాదం

image

కంచిలి మండలం నారాయణ బట్టి గ్రామంలో భవానీ సన్నిధానంలో జరిగిన దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ సన్నిధానంలో గ్రామానికి చెందిన కోన మణి (21) అనే భవానీ మాలధారణ చేసిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు గురు స్వామి సూచనలతో భవానీ మాలధారణ చేసిన భక్తులందరూ దీక్ష విరమించుకున్నట్లు వారు పేర్కొన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: ఈ నెల 14వ తేదీన పల్లె పండుగ

image

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ‘పల్లె పండుగ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

News October 8, 2024

10న YCP శ్రీకాకుళం జిల్లాధ్యక్షుడిగా ధర్మాన ప్రమాణస్వీకారం

image

నరసన్నపేట YCP కార్యాలయంలో ఈ నెల 10న పార్టీ జిల్లాధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డాక్టర్స్ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంపీపీ మురళి తెలిపారు. నరసన్నపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News October 8, 2024

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ఖాళీలు.. 15 వరకు అప్లై చేసుకోండి

image

శ్రీకాకుళం జిల్లాలోని KGBVలో ఔట్ సోర్సింగ్‌లో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. కుకింగ్- 9, డేనైట్ వాచ్‌మెన్- 4, స్కావెంజర్- 3, స్వీపర్- 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో చౌకీదారు- 6, హెడ్‌కుక్- 4, సహాయ కుక్- 6 పోస్టులకు ఆసక్తి గల మహిళలు ఈ నెల 15లోగా MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ఖాళీలు.. 15 వరకు అప్లై చేసుకోండి

image

శ్రీకాకుళం జిల్లాలోని KGBVలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. కుకింగ్- 9, డేనైట్ వాచ్‌మెన్- 4, స్కావెంజర్- 3, స్వీపర్- 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో చౌకీదారు- 6, హెడ్‌కుక్- 4, సహాయ కుక్- 6 పోస్టులకు ఆసక్తి గల మహిళలు ఈ నెల 15లోగా MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: మద్యం దుకాణాలకు 880 దరఖాస్తులు

image

శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా ఏర్పాటుకానున్న ప్రైవేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులే గడువు ఉంది. ఈ నెల 2న ప్రారంభమైన ప్రక్రియ 9వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 7 నాటికి జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు 880 దరఖాస్తులు వచ్చాయి. శ్రీకాకుళంలో 32 దుకాణాలకు 266, టెక్కలిలో 11కు 19, కోటబొమ్మాళిలో 15 షాపులకు 31, రణస్థలంలో 15కు 176 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

News October 8, 2024

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి

image

మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారులు, ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: ‘సముద్రతీరానికి తీసుకెళ్లి అత్యాచారం’

image

ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. SI రంజిత్ తెలిపిన వివరాలు.. పోలాకి మండలానికి చెందిన బాలికతో నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన డొంకాన రాముకు పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో బాలికను ఆదివారం పోలాకిలోని సముద్రతీరానికి తీసుకెళ్లాడు. ఇంటికొచ్చాక తల్లి ప్రశ్నించగా విషయం బయటపడింది. కుమార్తెపై అత్యాచారం జరిగినట్లు SPకి ఫిర్యాదుచేసింది. రాముపై పోక్సో కేసు నమోదుచేసినట్లు చెప్పారు.

News October 8, 2024

ఎచ్చెర్ల: రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ

image

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒడిశా రాష్ట్రాన్ని కలుపుతూ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎచ్చెర్ల నాయకులు, VZM ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌత్ రీజియన్‌లో ఉన్న రైల్వే సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. ఎంపీతో పాటుగా
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఉన్నారు.