Srikakulam

News March 22, 2024

శ్రీకాకుళం: ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ చేపట్టాలి

image

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా ఎన్నికల అధికారులకు జిల్లా స్థాయి ముఖ్య శిక్షణ బృందం అధికారులు ఎం.కిరణ్ కుమార్, బాలాజీ నాయక్, శేషగిరిలు కలిసి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్స్ మిషన్ వినియోగంపై అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు తప్పనిసరిగా ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు.

News March 21, 2024

మందస: ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

image

మండలంలోని భోగాపురం పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అగ్గున్న దేవేంద్రను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకుడు జివి.చిట్టిరాజు గురువారం తెలిపారు. దేవేంద్ర రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ దాన్ని ధ్రువీకరించారు. దీంతో దేవేంద్రను సస్పెండ్ చేశారు. 

News March 21, 2024

మెలియాపుట్టి: రాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘా

image

రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒడిశా చెక్‌పోస్టు వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ అన్నారు. మెలియాపుట్టి మండలం వసుంధర గ్రామం వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సరిహద్దును గురువారం కలెక్టర్ పరిశీలించారు. సరిహద్దుపై నిఘా నిరంతరం ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై మండల స్థాయి అధికారులతో సమీక్ష చేశారు. ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు.

News March 21, 2024

కోటబొమ్మాళి: విశ్వనాథపురం కొండ సమీపంలో అస్థిపంజరం

image

కోటబొమ్మాళి మండలం విశ్వనాధపురం గ్రామంలోని ఓ కొండ సమీపంలో గురువారం గుర్తుతెలియని అస్థిపంజరం గ్రామస్థుల కంటపడింది. దీంతో గ్రామస్థులు స్థానిక వీఆర్వో పైల దాలప్పకు సమాచారం ఇవ్వటంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు.

News March 21, 2024

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యే?

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. నేటి రోజుల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారింది. అలాంటిది ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కె.ప్రతిభా భారతి టీడీపీ తరఫున 1983 నుంచి 2004 వరకు పోటీ చేసి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించింది. పోటీ చేసిన ప్రతిసారి 10 వేలకుపైగానే మెజార్టీతో గెలుపొందారు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటి మహిళ స్పీకర్ గా పనిచేశారు.

News March 21, 2024

పాతపట్నం: ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ గురువారం పాతపట్నం మండలంలో పర్యటించారు. పాతపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికలు సజావుగా సాగేందుకు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎన్నికల్లో అవలంబించిన విధివిధానాలను అధికారులకు వివరించారు.

News March 21, 2024

తేలినీలాపురంలో చుక్కల దుప్పి మృతి

image

తేలినీలాపురం విదేశీపక్షుల విడిది కేంద్రంలో గురువారం ఒక చుక్కల దుప్పి మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం నందిగం మండలం రాంపురం సమీపంలోని తెట్టంగి పంట పొలాల్లో ఇరుక్కున్న దుప్పిని గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖ అధికారులు తేలినీలాపురం విడిది కేంద్రంలో ఉంచారు. ఈ క్రమంలో గురువారం దుప్పి అస్వస్థతకు గురై మృతి చెందింది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

News March 21, 2024

పొందూరు: కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌పై నిబంధనల ఉల్లంఘన కేసు

image

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రామారావు‌పై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పొందూరు మండలం తోలాపి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈనెల 17న రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ సభ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎంగా తన అనుమతి లేకుండా సభ నిర్వహించినట్లు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం, ఎంపీడీవోల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రవికుమార్ తెలిపారు.

News March 21, 2024

పాతపట్నం నుంచి ఈ సారి గెలిచేదెవరు?

image

పాతపట్నం నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కలమట వెంకటరమణమూర్తి, రెడ్డిశాంతి వరసగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ వెంకటరమణ 2019 టీటీపీ నుంచి వైసీపీ అభ్యర్థి రెడ్డిశాంతిపై పోటీచేసి ఓడిపోయారు. కలమట వెంకటరమణ తండ్రి కలమట మోహనరావు టీడీపీ నుంచి నాలుగుసార్లు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి గెలిచారు. వైసీపీ నుంచి రెడ్డిశాంతికి టికెట్ కన్ఫామ్ అయ్యింది. పాతపట్నంలో ఈ సారి గెలిచేదెవరు.

News March 21, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లు త్వరగా చేపట్టాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని శ్రీకాకుళం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని నమూన్ ఆదేశించారు. బుధవారం ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట పట్టణాల్లో సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.