Srikakulam

News October 3, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి 13 వరకు దసరా సెలవులు

image

జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ఆర్ఎఓ పి.దుర్గా రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెలవు రోజుల్లో విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులకు సహాయపడుతూ బాధ్యతగా ఉండాలని కోరారు. బైక్ రైడింగ్‌లు, బీచ్‌లకు గాని వెళ్లరాదన్నారు

News October 3, 2024

దుబాయ్‌లో సిక్కోలు యువకుడి మృతి

image

సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన పోతుమాల అప్పన్న(37)అనే యువకుడు దుబాయిలో మృతిచెందాడు. జీవనోపాధి నిమిత్తం దుబాయిలో గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న ఈయన గత నెల 5వ తేదీన అక్కడ ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 19న మృతిచెందాడు. అయితే కేంద్ర, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చొరవతో అక్టోబర్ 1న మృతదేహం స్వగ్రామం చేరుకుంది.

News October 3, 2024

వైసీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి అప్పలరాజు

image

వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని విడుదల చేశారు. పార్టీకి సంబంధించి డాక్టర్స్, విద్యార్థి, ఇంటలెక్చువల్ విభాగాలకు సంబంధించి నియామకాలు చేపట్టారు. ఇందులో డాక్టర్స్ విభాగానికి సిక్కోలుకు స్థానం లభించింది.

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సిద్ధం: కేంద్ర మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పాతపట్నంలో పీఎం జన్మాన్ వసతిగృహ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్నారు.

News October 2, 2024

సికింద్రాబాద్- శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 07487 నంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అన్నవరం, విజయనగరం మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు సూచించారు.

News October 2, 2024

స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యం : రామ్మోహన్ నాయుడు

image

స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నగరంలో సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు.

News October 2, 2024

శ్రీకాకుళం: గిల్టు నగలకు రూ.16 లక్షల రుణం

image

శ్రీకాకుళంలోని ఓ బ్యాంకులో అప్రైజర్‌ అవినీతి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు..గిల్ట్ నగలు తన బంధువుల పేర్ల మీద తాకట్టు పెట్టి రూ.16 లక్షల రుణం తీసుకున్నారు. గుర్తించిన అధికారులు రూ.1.50 లక్షలు రికవరీ చేయగా..మిగిలింది కట్టకుండా కాలయాపన చేస్తుండడంతో సిబ్బంది అతనిపై ఫిర్యాదు చేయాలనుకున్నారు. మంగళవారం పోలీసులను ఆశ్రయించగా పూర్తి వివరాలు లేవని ఫిర్యాదు తీసుకోలేదని ఎచ్చెర్ల సీఐ తెలిపారు.

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి దసరా సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 2 (బుధవారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ దసరా సెలవుల్లో… బీచ్ లకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అలాగే వారికి బైకు ఇవ్వరాదని దానివల్ల ప్రమాదాలు ఉంటాయని సూచించారు.

News October 2, 2024

ఆమదాలవలస: మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహా వృక్షం

image

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్‌కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.

News October 2, 2024

స్వర్ణాంధ్ర విజన్‌లో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా తొలిస్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అన్ని వర్గాలను కోరుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మాట్లాడారు.