Srikakulam

News October 1, 2024

శ్రీకాకుళం: మొదలైన మద్యం అమ్మకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్‌లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఉదయం నుంచి సేల్స్ మాన్‌లు, సూపర్వైజర్‌లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్‌లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.

News October 1, 2024

కలెక్టర్‌ని కలిసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే

image

ఇచ్ఛాపురం నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కవిటి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలంలో ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

News October 1, 2024

శ్రీకాకుళం: 12 మంది సీఐ, 21 మంది ఎస్సైలు బదిలీ

image

ఎక్సైజ్ Dy కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 12 మంది CI లను నూతనంగా నియమించారు. 21 మంది SIలు బదిలీ జరిగింది. CIలు గోపాలకృష్ణ-శ్రీకాకుళం, సతీష్ కుమార్-ఆమదాలవలస, అనురాధాదేవి-రణస్థలం, రాజు-పొందూరు, రమణమూర్తి-నరసన్నపేట, కృష్ణారావు-పాతపట్నం, కిరణ్మణీశ్వరి-కొత్తూరు, మీరాసాహెబ్-టెక్కలి, గాయత్రి-కోటబొమ్మాళి, మల్లికార్జునరావు-పలాస, బేబీ-సోంపేట, ప్రసాద్-ఇచ్ఛాపురానికి నియమితులయ్యారు.

News October 1, 2024

SKLM: పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి-కలెక్టర్

image

శ్రీకాకుళం నగరంలోని అక్టోబర్ 2న R&B అతిథి గృహం డచ్ బిల్డింగ్ వద్ద జిల్లాస్థాయి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిసరాలను, నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అధికారులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఈ సమావేశానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.

News September 30, 2024

శ్రీకాకుళం: దసరా సెలవులకు ఊర్లకు వెళ్తున్నారా జార జాగ్రత్త

image

దసరా సెలవులు నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు లాక్డ్ హౌసింగ్ మోనిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందించాలని చెప్పారు. ఎల్‌హెచ్ ఎంఎస్ ద్వారా ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే ఇంటి యజమానికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తుందన్నారు.

News September 30, 2024

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల UPDATES

image

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మొదటి రోజున అమ్మవారిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, రూ.20, రూ.50 దర్శనాలను కల్పించనున్నారు.

News September 30, 2024

శ్రీకాకుళం: అక్టోబర్ మూడు నుంచి టెట్ పరీక్షలు

image

జిల్లాలో అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు ఉంటాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎచ్చెర్లలో 2 పరీక్ష కేంద్రాలు, నరసన్నపేటలో ఒక పరీక్ష కేంద్రం బరంపురంలో 3 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో ఉంటుందన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలు ఉంటాయని తెలిపారు.

News September 30, 2024

SKLM: ఈవీఎం గోదాంల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

image

త్రైమాసిక తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంల‌ను క‌లెక్ట‌ర్ స్వప్నిల్ దినకర్ సోమవారం త‌నిఖీ చేశారు. గోదాముల‌కు వేసిన సీళ్ల‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సిబ్బందితో తెరిపించి ప‌రిశీలించారు. అనంత‌రం వాటికి తిరిగి సీళ్లు వేయించారు.ఎన్నిక‌ల్లో వినియోగించిన, రిజ‌ర్వులో ఉంచిన‌ ఈవిఎంల‌ను సీరియల్ నెంబర్.. నియోజకవర్గాల వారీగా డిఆర్ఓని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

News September 30, 2024

పాలకొండ: విద్యుత్ వైర్ తగిలి మహిళా కూలీ రైతు మృతి

image

పాలకొండ మండలం పెద్దమంగళాపురం గ్రామానికి చెందిన మహిళా కూలీ రైతు సోమవారం మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలో చెరుకు తోటలో విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైన లంక పార్వతి(58) మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 30, 2024

SKLM: ఈసీసీఈ డిప్లొమా కోర్సుల ప్రవేశాల దరఖాస్తుకు నేడే లాస్ట్

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లొమా కోర్సు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లో దరఖాస్తు సోమవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు www.brau.edu.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, రూ.250 ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు కోసం విద్యా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.