India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SC, ST అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం పై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని చెప్పారు. కమిటీలోని 8 మంది నూతన సభ్యుల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.
శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామానికి చెందిన చింతాడ చిన్ని జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచి పట్టణంలో జరగనున్న 14వ హాకీ ఇండియా జూనియర్ మహిళా జాతీయ స్థాయి పోటీలకు ఏపీ తరపున పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు.
కేరళ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు విస్తరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి వి.అబ్దురేహిమాన్ లతో చర్చలు జరిపారు. చిన్న విమానాశ్రయాలను మరింత బలోపేతం చేయడానికి, కేరళను అనుసంధానించేందుకు ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.
టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రతిఏటా సైబీరియా నుంచి సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చే ఈ విదేశీపక్షులు ఏప్రిల్ వరకు ఇక్కడ విడిది కేంద్రంలో విడిది చేస్తాయి. పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ అనే రెండు రకాల పక్షులు సుదూర తీరాలు దాటి టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామానికి వచ్చి ఇక్కడ చింత చెట్లపై నివసిస్తాయి. అటవీశాఖ అధికారులు వాటిని పర్యవేక్షిస్తారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. మన ఇళ్లు..మన గౌరవం పథకంలో ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఒకవేళ పూర్తిచేయకపోతే ఆ నిర్మాణాలు రద్దవుతాయని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డిని, శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా.ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ను విధి నిర్వహణలో బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన కోరారు. అనంతరం పలు ముఖ్యమైన అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
శ్రీకాకుళం జిల్లాలో పురాతన ఆలయాలు, బీచ్ లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అరసవిల్లి, తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం, దంతపురి, శ్రీముఖలింగంతో పాటు పలు ప్రాంతాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. వీటితో పాటు కళింగపట్నం , భావనపాడు,బారువ బీచ్లు ఉల్లాసంగా గడిపేందుకు తోడ్పాటునిస్తున్నాయి. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.
సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు హేమసుందరావు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. ఆ బాలిక 9వ తరగతి చదువుతుండగా.. మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
శ్రీకాకుళం కారగరంలో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సును గురువారం నిర్వహించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జైలు ముద్దాయిలకు ఉచిత న్యాయసేవలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముద్దాయిలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసులు విషయంలో రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని అవగాహన కల్పించారు. రాజియే రాజమార్గం అన్నారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.