India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలోని రోడ్డు రైల్వేలకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం అయ్యారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నంలో జాతీయ రహదారులు & రైల్వే DRM Waltair అధికారులతో కీలక నిర్ణయాలపై చర్చించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనులు వేగవంతం చేసి ప్రజలకు సకాలంలో అందించడానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు.
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాబోయే మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనునట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో సూది కొండ వద్ద గుర్తుతెలియని యువకుడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 20 నుంచి 25 ఉంటుందన్నారు. నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 89850 21143 నంబర్ను సంప్రదించాలన్నారు.
పార్లమెంట్లో రిజర్వేషన్ వర్గీకరణపై చర్చ జరిగే వరకు వర్గీకరణను రాష్ట్రపతి నిలుపుదల చేయాలని ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఆదివారం పేట జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. హేతుబద్దత లేని అశాస్త్రీయమైన వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు పెరగడంతో కుదేలైన ఆక్వా రైతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో మరో పిడుగు పడింది. దిగుమతి సుంకాలు 27శాతానికి పెంచడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై పన్ను భారం పడింది. ఈ దెబ్బతో రైతుకి ధర తగ్గిపోయింది. జిల్లా నుంచి ఎక్కువ శాతం అమెరికాకే ఎగుమతి అవుతుండగా.. 4వేల హెక్టార్లలో సాగు జరుగుతోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
జిల్లా ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 5 సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను చట్ట పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు ఎండార్స్ చేసి పరిష్కరించాలని చెప్పారు.
లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
నరసన్నపేట మండలం మడపాం వద్ద వంశధార నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మత్స్యకారుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం చేపల వేట కోసం వెళ్లిన వాడ అంజలి అప్పన్న నదిలో వల విసరగా పెద్ద బండరాయి వలకు తగిలింది. చేపలు పడి ఉంటాయని గట్టిగా లాగడంతో జారిపడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి శ్రీశైన వీధిలో ఉన్న శ్రీ రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని రాములోరికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీకాకుళం MLA గొండు శంకర్ హాజరయ్యారు. వేద పండితులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో కేంద్రమంత్రికి, శాసనసభ్యులకు స్వాగతం పలికారు.
Sorry, no posts matched your criteria.