Srikakulam

News September 19, 2024

శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.యస్.జగన్ తాడేపల్లిలోని ఆపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ అధ్యక్షులుగా తమ్మినేని సీతారాం ని ప్రకటించారు. వారికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

News September 19, 2024

శ్రీకాకుళంలో సీఎం పర్యటన వివరాలు

image

AP CM నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పర్యటన షెడ్యూల్‌ను గురువారం సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో మ.1:10కి కవిటి మండలం రాజపురం సమీపంలో వింధ్య గిరి వద్దకు చేరుకొని ముఖ్య నాయకులను కలుస్తారు. 1:45కు స్థానిక రామాలయాన్ని సందర్శిస్తారు. 2:15కు లబ్ధిదారులతో మాట్లాడుతారు. 3:15 వరకు రాజపురంలో సమావేశంలో పాల్గొంటారు.

News September 19, 2024

SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ తాత్కాలిక వాయిదా

image

ఈ నెల సెప్టెంబరు 20వ తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. తిరిగి శుక్రవారం 27న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ జరుగునని, ఈ తాత్కాలిక వాయిదాను (తేదీ మార్పును) విభిన్న ప్రతిభావంతులు గమనించాలని కోరారు.

News September 19, 2024

దాసన్నకే మళ్లీ వైసీపీ పగ్గాలు

image

వైసీపీ జిల్లా అధ్యక్షునిగా Ex.Dy.CM ధర్మాన కృష్ణదాస్‌ని వైసీపీ అధినేత జగన్ గురువారం నియమించారు. దాసన్న కుటుంబం మొదట్నుంచీ వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, ఆప్తులుగా పేరుపొందారు. పార్టీ ఆవిర్భావం నుంచీ దాసన్న సతీమణి పద్మప్రియ జిల్లా
అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ధర్మాన గత ప్రభుత్వంలో మంత్రిమండలి నుంచి మళ్లీ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే పట్టంకట్టారు.

News September 19, 2024

కవిటి: చంద్రబాబు రాక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్

image

కవిటి మండలం రాజాపురానికి శుక్రవారం సీఎం రానున్నారు. రాజపురంలో జరిగే ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాకు తొలిసారిగా సీఎం వస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే అశోక్ బాబు, డీఎస్పీ మహేందర్ రెడ్డి గురువారం రాజాపురానికి చేరుకుని.. ఏర్పాట్లను పరిశీలించారు.

News September 19, 2024

శ్రీకాకుళం: 100 రోజుల TDP పాలనపై మీ కామెంట్?

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..

News September 19, 2024

శ్రీకాకుళంలో ప్రేమ పేరుతో ఛీటింగ్

image

శ్రీకాకుళానికి చెందిన బాలికను ఒడిశాకు చెందిన యువకుడు మోసం చేశాడని పోలీసులను తెలిపింది. వారి వివరాలు.. బాలికకు రెండేళ్ల కిందట పెళ్లిలో కృష్ణ పరిచయమయ్యాడు. అతను పొక్లెయిన్ డ్రైవర్‌గా పైడిభీమవరంలో ఉండేవాడు. పరిచయమైనప్పటి నుంచి ప్రేమపేరిట తిరిగి, పెళ్లి చేసుకోమంటే తప్పించుకుంటున్నాడని తెలిపింది. దీనిపై శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ASI నారాయణ రావు బుధవారం తెలిపారు.

News September 19, 2024

శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిటి మండలం రాజపురం గ్రామానికి సీఎం రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 19, 2024

రాజాం: పొగిరిలో కాకతీయుల నాటి శిల్పాలు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో 1000 ఏళ్ల కిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆగ్రామం కాకతీయుల నాడు గొప్ప శైవక్షేత్రంగా వెలసిందని, రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లగా ఊరి ముందర రోడ్డుపక్కన నాగదేవత శిల్పముంది. అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు. ఊర్లో ఉన్న వెయ్యేళ్ళ కిందటి అగస్త్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.

News September 19, 2024

SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.