India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఓల్డ్ రెగ్యులేషన్ సప్లిమెంటరీ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మొత్తం 1154 మంది హాజరు కాగా 822 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మొదలుకొని ఇచ్చాపురం వరకు రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసే విధంగా సంబంధిత అధికారులను నియమించడం జరిగింది.
➥ శ్రీ కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ, కలెక్టర్
➥ మార్క్ ఫెడ్ డైరెక్టర్గా జిల్లా వాసి
➥ విజయవాడ బాధితులకు శ్రీకాకుళం నుంచి సాయం
➥ వర్షాలు కారణంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
➥ కార్పొరేషన్ ఛైర్మన్గా శ్రీకాకుళం నేత
➥ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: RDO
➥ శ్రీకాకుళం వ్యక్తికి డైరెక్టర్ పదవి
➥ నరసన్నపేటలో ఉచిత గ్యాస్ అంటూ.. వ్యక్తికి మోసం
➥ శ్రీకాకుళంలో ఉండి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నామినేటేడ్ పోస్టుల భర్తీలో శ్రీకాకుళం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. పలాస కాశీబుగ్గకు చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాబురావు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్గా, బూర్జ మండలానికి చెందిన ఆనెపు రామకృష్ణ కార్పొరేషన్ పదవుల్లో మార్క్ఫెడ్ డైరెక్టర్గా, శ్రీకాకుళానికి చెందిన సీర రమణయ్య అర్బన్ ఫైనాన్స్& ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
రానున్న 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాజ్వే, వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో బూర్జ మండలాన్ని డైరెక్టర్ పోస్టులు వరించాయి. ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం పెద్దపేట గ్రామానికి చెందిన ఆనపు రామకృష్ణనాయుడు మార్క్ ఫెడ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. గతంలో రాష్ట్ర జడ్పీటీసీల సంఘ అధ్యక్షుడిగా, పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత తన సేవలు గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్జ బాబురావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నాయకులు అభినందనలు తెలిపారు. గతంలో ఈయన పలాస మున్సిపాలిటీ ఛైర్మన్గా చేశారు. టీడీపీలో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఈ పదవి వరించినందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
పలాసకు చెందిన వజ్జ బాబురావుని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC)కి ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి వజ్జ బాబురావు విధేయతకు దక్కిన గౌరవంగా పార్టీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అల్పపీడనం ప్రభావంతో సోమవారం జిల్లాలో పలు మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. టెక్కలి 29.0మి.మీ ,కోటబొమ్మాళి 30.2 ,నందిగం 24.0 , సంతబొమ్మాళి 23.0 , పలాస 40.0 , కవిటి 25.25 , ఇచ్ఛాపురం 29.5, ఆమదాలవలస12.75, బూర్జ27.5, రణస్థలం29.75, పైడిభీమవరం24.75, లావేరు18.5, నరసన్నపేట10.75, పాతపట్నం10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దీపావళి పండుగకు బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జట్టి శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి సూచిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో బాణాసంచా నిల్వలు, తయారీ, విక్రయాలు తదితర వాటిపై నిఘా ఉంచాలన్నారు.
Sorry, no posts matched your criteria.