Srikakulam

News August 14, 2024

శ్రీకాకుళం: డెంగ్యూ వ్యాధితో పీజీ విద్యార్థిని మృతి

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ కాలనీకి చెందిన పీజీ విద్యార్థి కొంచాడ నీలమ్మ (22) డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. జ్వరం రావడంతో పీహెచ్‌స్సీకీ తరలించగా రక్త పరీక్షలు నిర్వహించి ప్లేట్‌లేట్స్‌ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్‌ సూచించారు. అంతలోనే ఆమె మరణించింది. వైద్యులు నిర్లక్ష్యంతోనే నీలమ్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

News August 14, 2024

మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డీగా పోలినాయుడు

image

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓఎస్డీగా ఎం.పోలినాయుడును నియమిస్తూ మంగళవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లా పరిషత్‌లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ఓఎస్డీగా నియమించారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పోలినాయుడు అచ్చెన్నాయుడుకు ఓఎస్డీగా ఉన్నారు.

News August 13, 2024

Phd పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ph.D పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి మంగళవారం విడుదల చేశారు. ఈ క్రమంలో అభ్యర్థులు పరీక్ష ఫీజును ఈ నెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. దీనికోసం మొత్తం పరీక్ష ఫీజు రూ.2030 చెల్లించాలన్నారు. పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రారంభం కానున్నాయి.

News August 13, 2024

పలాస వద్ద వ్యాన్ బోల్తా

image

పలాస మండలం నీలావతి గ్రామ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఓ బొలెరో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమంగా పశువులను తిలారు సంతకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు, పశువులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని రహదారి పక్కకు తరలించారు.

News August 13, 2024

దువ్వాడ వివాదం.. చర్చలు విఫలం

image

టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి కుటుంబసభ్యులు సోమవారం రాత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దువ్వాడ తరఫున ఆయన సోదరుడు శ్రీధర్, వాణి తరఫున ఆమె సోదరి చర్చల్లో పాల్గొనగా అర్ధాంతరంగా ముగిశాయి. వారు నేడు మరోసారి సమావేశమై వివాదం సద్దుమణిగేలా చర్చలు జరపనున్నట్లు సమాచారం. వాణి డిమాండ్లపై నేడు చర్చించే అవకాశం ఉంది.

News August 13, 2024

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

image

ఎచ్చెర్ల మండలంలో పంచాయతీ కార్యదర్శి ఎం.అప్పల రాజు సస్పెండ్ అయ్యారు. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చిలకపాలెంలో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు సరిగా చేపట్టక పోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పంచాయతీ కార్యదర్శిని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్లు డీపీవో ఉత్వర్వులు జారీ చేశారు. అలాగే ఈవోపీఆర్డీ దేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

News August 13, 2024

కోటబొమ్మాలి: స్వాతంత్ర్య వేడుకలకు రైతుకు ఆహ్వనం

image

మండలంలోని నిమ్మాడ గ్రామానికి చెందిన రైతు దాము మోహనరావు, పుణ్యవతి దంపతులకు పీఎం కిషన్ పథకంపై ఈ నెల ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర వేడుకలకు నిమ్మాడకు చెందిన ఈ దంపతులకు ఆహ్వనం అందినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి పాల్గొనే వేడుకలకు ఓ సాదరణ రైతుకు ఆహ్వనం అందడంపై మండల వ్యవసాయ అధికారి సువ్వారి గోవిందరావు, పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు.

News August 12, 2024

మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దాం: కలెక్టర్

image

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు అవగాహన తప్పనిసరి అని, యువతపై వాటి ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

News August 12, 2024

15 నుంచి ప్రతి మండలంలో అన్న క్యాంటీన్: మంత్రి అచ్చెన్న

image

ప్రతి మండల కేంద్రంలో ఈ నెల 15 నుంచి అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని, దీని కోసం దాతలు ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో నందిగాం మండలానికి చెందిన విశ్రాంతి హోమియో మెడికల్‌ అధికారి రోణంకి ఆనందరావు ఆదివారం అన్న క్యాంటీన్‌కు విరాళంగా రూ.లక్ష చెక్కును మంత్రికి అందజేశారు.

News August 11, 2024

రాజకీయ లబ్ధి కోసమే దువ్వాడ వాణి ఆరాటం: దివ్వల మాధురి

image

రాజకీయ లబ్ధి కోసమే దువ్వాడ వాణి తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు సృష్టించి వివాదాలకు కారణం అవుతుందని టెక్కలికి చెందిన దివ్వల మాధురి ఆదివారం అన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన వాణి తన ఎదుగుదలను చూసి ఓర్వలేక అక్రమ సంబంధాలు అంటగట్టి తనను రోడ్డు మీదకు లాగిందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌తో తనకున్న స్నేహపూర్వక సంబంధాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తానని స్పష్టం చేశారు.