India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొందూరు మండలం దళ్లవలస సచివాలయంలో వీఆర్ఓ జె.తవిటయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయన మీద ఆరోపణలు రావడంతో తహశీల్దార్ విచారించి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. గ్రామ సభలను నిర్లక్ష్యం, మ్యూటేషన్కు డబ్బులు అడగడం తదితర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడ్రోజులు క్రమశిక్షణ చర్యల కింద ఆర్టీవో కార్యాలయానికి సరెండర్ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక సోమవారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా తినుబండారాలు ఇచ్చి లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ విషయం తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. డిఎస్పీ డి.ప్రసాదరావు విచారణ చేపట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి, సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డు తరహాలో అందించనున్నదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సొంత భూమి కలిగిన ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు.
రాష్ట్ర పీఈటి సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్, క్రీడా పోటీలలో శ్రీకాకుళం జిల్లా హ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు మంగళవారం జిల్లా కేంద్రంలో డీఈవో, తిరుమల చైతన్య, డిప్యూటీ డిఈవో విజయ కుమారి అభినందించారు. క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం రావడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.
శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 34 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. >Share it
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు అధికారులు తెలిపారు. నగదు రూపంలో రూ.64,39,016 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. అలాగే 17.4గ్రాముల బంగారం, 1.212కేజీ వెండి వచ్చిందని వెల్లడించారు.
ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో 75 కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలకు 40,346 మంది హాజరు అవుతారని, పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతాయన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల పదవ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయని అన్నారు.
విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్ చేసేది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్పై ఆటోనగర్ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఆమె కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు గాజువాక ట్రాఫిక్ CI కోటేశ్వరరావు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షావుకారి డిల్లేశ్వరరావు (75) మద్యం మత్తులో తన భార్య రత్నాలు(70)పై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, అందులో ఒకరు మృతి చెందగా మరో కుమారుడు టీ దుకాణం నడిపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై లవరాజు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి నుండే వేసవిని తలపించే విధంగా భానుడు ప్రభావం చూపుతుండటంతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో వాటర్ మిలాన్, పండ్లు, జ్యూస్ షాపుల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ మిలాన్ విక్రయాలు జోరందుకున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
Sorry, no posts matched your criteria.