Srikakulam

News August 11, 2024

శ్రీకాకుళం రోడ్డు వరకే పలాస మెము

image

పలాస-పూండి-నౌపడ-విజయనగరం సెక్టరులో ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 15,17 తేదీల్లో విశాఖ-పలాస (07470) మెము ట్రైన్ శ్రీకాకుళం వరకు నడుస్తుందని అధికారులు వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో పలాస-విశాఖ (07471) మెము ఈనెల 15,17 తేదీల్లో శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆయా తేదీల్లో శ్రీకాకుళం, పలాస మధ్య రైలు ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు.

News August 11, 2024

శ్రీకాకుళం: డిగ్రీ 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ రెండో సెమిస్టర్ ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్ ఉదయాభాస్కర్ విడుదల చేశారు. ఈ మేరకు 2020, 2021, 2022 బ్యాచ్‌ల విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా.. 58.87 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్ కోసం 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News August 11, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థుల రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల చేశారు. 2020 నుంచి 2022 వరకు సప్లిమెంటరీ ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచామని ఉదయభాస్కర్ ప్రకటించారు. సప్లిమెంటరీలో 58.87% ఉత్తీర్ణత నమోదయింది. 6011 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు.

News August 10, 2024

టెక్కలిలో ఇరువర్గాలపై కేసు నమోదు

image

టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద చోటుచేసుకున్న ఘటనలపై అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణీ, కుమార్తె హైందవి పరస్పర ఫిర్యాదుల మేరకు శనివారం సాయంత్రం నాటికి టెక్కలి పోలీసులు ఇరువర్గాలపై పలు సెక్షన్ల కింద మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద మోహరించగా పోలీసులు తదుపరి నిర్ణయంపై స్థానికంగా చర్చ జరుగుతుంది.

News August 10, 2024

శ్రీకాకుళంలో పలు పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

image

క్రైమ్ రేటు నియంత్రణకై ప్రతీ పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ జిల్లాలోని హిరమండలం, కొత్తూరు, సరుబుజ్జిలి మండల పోలీస్ స్టేషన్లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిస్థితులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇటీవల నమోదైన కేసులు వివరాలను ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు

News August 10, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు సీట్లు కేటాయింపు

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అనుబంధ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి సీట్లు కేటాయించినట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయభాస్కర్ ఓ ప్రకటన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 16వ తేదీ లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని, ఈ క్రింది లింకు ద్వారా https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/ తెలుసుకోవచ్చని తెలిపారు.

News August 10, 2024

భామిని: రైలు పట్టాలపై యువకుడి మృతి

image

భామిని మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన ఈరోతూ అప్పలస్వామి, సావిత్రమ్మ చిన్న కుమారుడు కార్తీక్ (28) ఐటీఐ పూర్తి చేసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి కంపెనీలో చేరాడు. కార్తీక్ హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తానని గురువారం బయలుదేరి, శుక్రవారం రాత్రి శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సమీపంలో మృతి చెందాడు. టికెట్ ఆధారంగా కార్తీక్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 10, 2024

శ్రీకాకుళం: పారిశుద్ధ్య కార్మికుల సేవలు నిరుపమానం

image

పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలు నిరుపమానమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి, జెమ్స్ హాస్పటల్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ప్రారంభించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు.

News August 10, 2024

శ్రీకాకుళం: పదవుల పందేంలో ఎవరు విజేతలయ్యేనో..?

image

నామినేటెడ్ పదవుల భర్తీకై సీఎం చంద్రబాబు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆశావహులు ఆ పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఊహాగానాలు వచ్చినందున ఆ పదవులు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపేట్టారు. జిల్లాలోని 10 ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానం టీడీపీ దక్కించుకుంది. దీంతో నామినేటెడ్ పోస్టలకు కూటమి పార్టీల నుంచి ఆశావహులు భారీగా ఉన్నారు.

News August 10, 2024

శ్రీకాకుళం: 12,13,14 తేదీలలో మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం నిరుద్యోగులకు ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కెమిస్ట్రీలో ఎంఎస్సీ, బీఎస్సీ, బీటెక్, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చదివిన 21నుంచి 25 ఏళ్ళ వయస్సు మధ్యగల వారు అర్హులని పేర్కొనారు. ఆగస్టు 12న పాతపట్నం మహేంద్ర డిగ్రీ కాలేజీలో, 13న పాలకొండ CL నాయుడు డిగ్రీ కళశాల, 14న శ్రీకాకుళం సన్ డిగ్రీ కళాశాలల్లో జరుగుతుందని వివరించారు.