India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంతబొమ్మాళి మండలం గోవింధాపురం పంచాయితిలో ఉన్న కోటబొమ్మాళి రైల్వే స్టేషన్(గ్రామంలో )వద్ద ఉన్న ఈ మర్రి చెట్టుకు ఎన్ని ఏళ్లో తెలియదు. రెండు వందల ఏళ్లు కిందట ఈ చెట్టు ఉన్నట్లు మా ముందు తరం వారు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఈ వృక్షం పైకొమ్మలు నుంచి ఊడలు (వేర్లు) భూమిలోకి పాతుకుపోయాయి. చెట్టు చుట్టూ వరండా కట్టారు. వేశవి కాలంలో సేద తీర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందనీ స్థానికులు అంటున్నారు.
రథసప్తమి సందర్భంగా దర్శన టికెట్లను అందుబాటులో ఉంచామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. రూ.100 దర్శన టికెట్లు: అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్లో లభిస్తాయి. అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్లోనే రూ.100 దర్శన టికెట్లు, రూ.300 దర్శన టికెట్లు, రూ. 500 క్షీరాభిషేకం టికెట్లు(ఇద్దరికి దర్శన అవకాశం) లభించనున్నాయన్నారు
శ్రీకాకుళం పట్టణంలోని “డచ్” భవనం ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా విహరించే విషయం తెలిసిందే. ఈ మేరకు టిక్కెట్ రూ. రూ.1800లుగా వుంటుంది. 2 సంవత్సరాల వయసు లోపల గల పిల్లలకు ప్రవేశం లేదు. సదరు హెలికాప్టర్ ద్వారా విహరించు టికెట్స్ ఆన్ లైన్ తో పాటుగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. వెబ్సైట్ https://heliride.arasavallisungod.org/ లో టికెట్ చేసుకోవచ్చు.
శ్రీకాకుళం పట్టణంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఆదిత్యుని రథసప్తమి వేడుకలు బందోబస్తు విధులపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో రథసప్తమి వేడుకల బందోబస్తుకు సంబంధించి బందోబస్తు, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, భక్తుల దర్శనం, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై సెక్టార్ వారీగా పోలీసు అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శాంతిభద్రతలకు తీసుకున్న చర్యలను ఎస్పీ డీజీపీకి తెలియజేశారు.
ఓర్పు, సహనంతోనే లక్ష్యం సాధించగలమని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం పట్టణంలో స్థానిక ఉమెన్స్ కాలేజీలో ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, సెల్ ఫోన్లు ద్వారా విజ్ఞానాన్ని పెంపుదించుకోవాలన్నారు. డీఎస్పీ సి.హెచ్ వివేకానంద ఉన్నారు.
తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం జిల్లాలో అందుబాటులోకి తెచ్చారు. రథసప్తమి వేడుకలు సందర్భంగా ఈ హెలికాప్టర్ టూరిజం జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం, సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డచ్ బిల్డింగ్, కలెక్టరేట్ దగ్గర హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేశారు. రూ.1800తో 8 నిమిషాలపాటు రైడ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
సుదీర్ఘకాలంగా పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి కొనియాడారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ చిన్నారావు, హెడ్ కానిస్టేబుల్ రాఘవరావులను శనివారం ఆయన ఘనంగా సన్మానించారు. వారికి పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
రథసప్తమి ఏర్పాట్లను SKLM జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం పరిశీలించారు. సూర్య నమస్కారాలు నిర్వహించబోయే 80 అడుగుల రోడ్డు వద్ద ఏర్పాట్లు, అక్కడే పార్కింగ్ ఏర్పాట్లు పై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఎస్పీ వివేకానందతో చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. నగరంలో మిల్లు జంక్షన్, పాలకొండ రోడ్డులో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.
శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం-3 వార్డెన్ ఎం.పూర్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి హాస్టల్ విద్యార్థినిపై జరిగిన దాడి నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ విద్యార్థినిపై వ్యక్తులు దాడి చేసిన విషయం సంచలనం కావడంతో యుద్ధప్రాతిపదికన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.