Srikakulam

News August 7, 2024

శ్రీకాకుళం: సాయం కోసం ఎదురుచూపులు

image

శ్రీకాకుళం జిల్లా గంగువారి సిగడాం మండలం సంతవురిటి గ్రామానికి చెందిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ పడాల రూపాదేవి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది థాయిలాండ్ లోపారా బ్యాడ్మింటన్ పోటీలో సిల్వర్ మెడల్, ఖేలో ఇండియాలో సిల్వర్, లక్నోలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండోనేషియాలో సెప్టెంబరులో జరిగే అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలకు వెళ్లడానికి ప్రభుత్వం సాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

News August 7, 2024

శ్రీకాకుళం: రైళ్లకు అదనంగా కోచ్‌ల జత

image

శ్రీకాకుళం రోడ్ మీదుగా భువనేశ్వర్, పుదుచ్చేరి మధ్య ప్రయాణించే రైళ్లకు అదనంగా జనరల్ కోచ్ జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12897/98 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక అదనపు జనరల్ కోచ్ జత చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైలు నం.12898 ఆగస్టు 6వ తేదీ నుంచి సెప్టెంబరు 24 వరకు, నం.12897 రైలును ఆగస్టు 7 నుంచి సెప్టెంబరు 25 వరకు అదనపు జనరల్ కోచ్‌తో నడపనున్నారు.

News August 6, 2024

శ్రీకాకుళం: పీజీ విద్యార్థులకు అలర్ట్

image

ఈ విద్యా సంవత్సరంలో శ్రీకాకుళం డా. బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 7 నుంచి వెబ్ ఆప్షన్ ప్రక్రియ మొదలు కానుందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత తెలిపారు. ఆగస్టు 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ కొనసాగే ఈ వెబ్ ఆప్షన్ ద్వారా డా.బీఆర్ఏయూకు సంబంధించిన కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చునని తెలియజేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News August 6, 2024

చెన్నైలో సిక్కోలు వాసి అనుమానాస్పద మృతి

image

సోంపేట మండలంలోని రామయ్యపట్నం గ్రామానికి చెందిన వాడ ధర్మారావు చెన్నైలోని జట్టి వద్ద అనుమానాస్పదంగా మంగళవారం మృతి చెందాడు. నీటిలో మృతదేహం పడి ఉండడంతో తోటి మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో చేపల వేట కోసం ఆయన ఇటీవల వలస వెళ్లాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆయన మరణవార్తతో మత్స్యకారుల్లో విషాదం నెలకొంది.

News August 6, 2024

శ్రీకాకుళం: B.Tech పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ ఏయూ B.Tech రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు ఈ నెల 13వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News August 6, 2024

నందిగాం: రాయితీ పై వ్యవసాయ పరికరాలు

image

జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు సూక్ష్మ నీటి పారుదల పధకం ద్వారా బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీ పై అందివ్వనున్నట్లు ఆ పధక అధికారి ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది 2400 ఎకరాల్లో సాగు లక్ష్యంగా రూ.11.17 కోట్లు రాయితీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీ పై పొందుటకు రైతులు సమీప రైతు సేవా కేంద్రాలు, మండల ఉద్యానవనాధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

News August 6, 2024

శ్రీకాకుళం: మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేసే NMMS (2024-25) పరీక్ష నోటిఫికేషన్ సోమవారం విడుదలైందని అధికారులు తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్థులకు డిసెంబర్ 8న పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://bse.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News August 5, 2024

SKLM: ఆ స్కూల్లో ఒకరే స్టూడెంట్

image

మీరు చదివింది నిజమే. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస పంచాయతీ అవతరబాద్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. అతని కోసం టీచర్, పాఠశాల పారిశుద్ధ్య కార్మికురాలు, మధ్యాహ్నం భోజనం కార్మికురాలు కూడా పని చేస్తున్నారు. చిన్న గ్రామం కావడంతో స్థానికంగా ఉన్న సుమారు పదిమంది పిల్లలు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోతున్నారు.

News August 5, 2024

పథకాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: తమ్మినేని

image

రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన పోయి, రెడ్ బుక్ పాలన ఆవిష్కృతమైందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమంలో పరుగులు తీస్తున్న రాష్ట్రాన్ని ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. పథకాలు పూర్తిస్థాయిలో అందక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నేతలను వేధింపులకు గురి చేయడం తగదన్నారు.

News August 5, 2024

పోస్టాఫీసులో ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో మొత్తం 79 పైగా పోస్టులు ఉన్నాయి. బీపీఎం అయితే రూ.12 వేలు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు వరకు జీతం అందుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం.. నేటి సాయంత్రం(ఆగస్టు 5)తో గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలు appost.gdsonlineలో చూడవచ్చు.