Srikakulam

News August 2, 2024

రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్‌తో ఉద్యోగం

image

రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన విద్యార్థి నిర్మల ప్రియ పారిస్‌లోని గ్రూప్ ADP అంతర్జాతీయ సంస్థలో 40 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. నిర్మల ప్రియ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామం వాసి. ఆమె తండ్రి వెంకట రావు ఓ సాధారణ క్యాటరింగ్ వ్యాపారి. సైబర్ సెక్యూరిటీ కోర్స్‌ను పూర్తి చేయడం ద్వారా ఈ కొలువును సాధించగలిగానని ఆమె అన్నారు.

News August 2, 2024

శ్రీకాకుళం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గం మార్పు

image

విజయవాడ డివిజన్లో మరమ్మతుల కారణంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 2, 3, 5, 7, 9, 10వ తేదీలలో విజయవాడ-ఏలూరు మీదుగా కాకుండా రాయనపాడు-గుడివాడ- భీమవరం మీదగా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైను ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News August 2, 2024

శ్రీకాకుళం: APESET-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

image

APESET-2024 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ దామోదర్ రావు తెలిపారు. ఈనెల 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. 4న ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసి ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. 5న ఆప్షన్లలో మార్పు-చేర్పులు, 8న సీట్లను కేటాయిస్తారు. OC, BC విద్యార్థులు రూ.1200 SC, ST విద్యార్థులు రూ.600 రుసుం చెల్లించాలి.

News August 2, 2024

నరసన్నపేట: పెన్షన్ పంపిణీలో అలసత్వం.. 30 మందికి నోటీసులు

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నగదు పంపిణీలో అలసత్వం ప్రదర్శించిన 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులిచ్చినట్లు నరసన్నపేట ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకు పెన్షన్ ప్రారంభించాల్సి ఉండగా 6.30 గంటలు వరకు కూడా నగదు పంపిణీని సిబ్బంది ప్రారంభించలేదన్నారు. దీంతో వారికి నోటీసులిచ్చినట్లు తెలిపారు.

News August 2, 2024

నరసన్నపేట: బ్రెస్ట్ ఫీడింగ్ గది ఏర్పాటుకు పరిశీలన

image

ప్రతి ఒక్క ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తప్పనిసరిగా మహిళలకు సంబంధించి బ్రెస్ట్ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ ఆదేశించారు. ఈ మేరకు నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గది ఏర్పాటు చేసేందుకు టెక్కలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. దీనిలో భాగంగా స్థానిక సీడీపీవో నాగమణి మాట్లాడుతూ.. మహిళలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News August 1, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP UPDATES

image

✦ శ్రీకాకుళం జిల్లాలో 97.50 శాతం పెన్షన్ల పంపిణీ✦ నిమ్మాడ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం✦ రైల్వే సమస్యలపై లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ కలిశెట్టి✦ జిల్లావ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం✦ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి:కలెక్టర్✦ శ్రీకాకుళంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి✦ డిగ్రీ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ నమోదు ప్రారంభం✦ జిల్లాలో 39 మంది తహశీల్దార్లకు పోస్టింగ్.

News August 1, 2024

శ్రీకాకుళం జిల్లాలో 97.49శాతం పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో గురువారం ఉదయం నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. వివిధ కేటగిరీల్లోని లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి 9.30గంటల వరకు 97.49శాతం మందికి పింఛన్లు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 3,18,017 మందికి గానూ 3,10,046మందికి పెన్షన్ అందినట్లు పేర్కొంది.

News August 1, 2024

తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా అధికారి

image

శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బి.మీనాక్షి గురువారం శ్రీకాకుళంలోని ఆమె కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి 7వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. సంబంధిత అధికారులు ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ర్యాలీలు నిర్వహించి, ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తారన్నారు.

News August 1, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు వర్షసూచన

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలో శుక్రవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, పార్వతీపురంలోని పలు మండలాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

News August 1, 2024

పింఛన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా టాప్

image

ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3,18,017 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఉదయం 10.15 సమయానికి 2,89,523 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో జిల్లా 91.04 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలించింది.