Srikakulam

News August 1, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు వర్షసూచన

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలో శుక్రవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, పార్వతీపురంలోని పలు మండలాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

News August 1, 2024

పింఛన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా టాప్

image

ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3,18,017 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఉదయం 10.15 సమయానికి 2,89,523 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో జిల్లా 91.04 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలించింది. 

News August 1, 2024

రాష్ట్రంలో రెండో స్థానంలో శ్రీకాకుళం జిల్లా

image

ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఉదయం 9.25 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 86.33% మేర పింఛన్ల పంపిణీ పూర్తయ్యింది. జిల్లాలో 3,18,017 మంది లబ్దిదారులుండగా 2,74,529 మందికి ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్ అందజేయడంతో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.

News August 1, 2024

శ్రీకాకుళం జిల్లాలో 39 మంది తహశీల్దార్లకు పోస్టింగ్

image

ఎన్నికల విధుల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లి తిరిగివచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్ దక్కింది. ఈ సందర్భంగా జిల్లాలో 39 మంది తహశీల్దార్లకు పోస్టింగ్ ఇస్తూ బుధవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే పోస్టింగ్ బట్టి ఆయా తహశీల్దార్లు విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News August 1, 2024

హైకోర్టు పీపీగా .. సిక్కోలు వాసికి చోటు …!

image

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కృష్ణచంద్రాపురం గ్రామానికి చెందిన మెండ లక్ష్మీనారాయణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా అవకాశం చేజిక్కించుకున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా నియమితులయ్యారు. ఆయనను పీపీగా నియమిస్తూ న్యాయశాఖ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి సునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని పలువురు న్యాయవాది లక్ష్మీనారాయణను ప్రశంసిస్తున్నారు.

News August 1, 2024

శ్రీకాకుళంలో రేపు జాబ్ మేళా

image

శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ వద్ద స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు 18-40 ఏళ్ల మధ్య వయస్సున్న యువతీయువకులు అర్హులన్నారు. అలాగే అభ్యర్థులు తగిన అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీతం రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు ఉండనుంది.

News August 1, 2024

నేడు టెక్కలికి అచ్చెన్న రాక

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఉదయం టెక్కలి మండల కేంద్రంలోని కండ్రవీధిలో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం 10.30 గంటలకు టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో అభివృద్ధి సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొంటారని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ప్రకటన విడుదల చేశారు.

News July 31, 2024

రేపు టెక్కలికి అచ్చెన్న రాక

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఉదయం టెక్కలి మండల కేంద్రంలోని కండ్రవీధిలో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం 10.30 గంటలకు టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో అభివృద్ధి సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొంటారని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ప్రకటన విడుదల చేశారు.

News July 31, 2024

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్, టెన్త్‌లో ప్రవేశాలు

image

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ టెన్త్, ఇంటర్లో 2024- 25 సంవత్సరానికి ప్రవేశాలు ఇస్తున్నట్టు శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను జూలై 31 నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News July 31, 2024

శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు డీఎస్పీల బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డీఎస్పీలు శృతి, బాల చంద్రారెడ్డి, నాగేశ్వర రెడ్డిలను ప్రభుత్వం బదిలీ చేసింది. వారందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు.