Srikakulam

News July 31, 2024

శ్రీకాకుళం: ఆకట్టుకున్న మనూ భాకర్ సైకత శిల్పం

image

ఆమదాలవలస మండలం గాజులు కొల్లివలస పంచాయతీ పరిధికి చెందిన సైకత శిల్పి గేదెల హరికృష్ణ బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంది. 2024 ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలలో మన దేశం తరఫున డబుల్ మెడల్స్ సాధించిన షూటర్ మనూ భాకర్‌కి హరికృష్ణ సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఆయనను అభినందించారు.

News July 31, 2024

శ్రీకాకుళం జిల్లాకు రూ.250 కోట్లు!

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.250 కోట్లు రానున్నాయి. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు కూడా రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించనున్నారు.

News July 31, 2024

పలాస: ముద్దాయికి 12 నెలలు జైలు శిక్ష

image

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధి పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర శాంతమూర్తి నాటు సారా అమ్ముతూ జులై 07, 2021 తేదీన ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముద్దాయికి పలాస సివిల్ కోర్టు జడ్జి యు.మాధురి 12 నెలలు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించారు. ముద్దాయి జరిమానా కట్టని యెడల అదనంగా మూడు నెలలు జైలు శిక్ష పొడిగించాలని తీర్పు వెల్లడించారు.

News July 31, 2024

నందిగం గురుకులంలో విద్యార్థిని సూసైడ్

image

శ్రీకాకుళం జిల్లా నందిగం అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న అక్షిత(16) అనే విద్యార్థిని వసతిగృహం కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెది భామిని మండలం పారాపురం కొత్తూరు గ్రామం కాగా వసతిగృహం మరుగుదొడ్లు సమీపంలో సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు నందిగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 31, 2024

బూర్జ: ఓవి పేట VROపై పలువురు రైతులు దాడి

image

స్థానిక వీఆర్వో వ్యాపార లక్ష్మీనారాయణపై పలువురు రైతులు మంగళవారం దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యం పొందుతున్నారు. మంగళవారం ఉదయం తన విధుల్లో భాగంగా ఓవిపేట వెళ్తుండగా భూమి తగాదాల నేపథ్యంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో ఉన్న ఆయనకు కళింగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు బుడుమూరు శ్రీరామ్మూర్తి, బీవీఎస్ఎన్ రాజు, వెల్ఫేర్ అసిస్టెంట్ పరామర్శించారు.

News July 31, 2024

ఎచ్చెర్ల: నేడు పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు

image

పాలీసెట్-2024 రెండు విడతలు కౌన్సెలింగ్ పూర్తి కాగా, కళాశాలల్లో మిగులు సీట్లకు బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. విద్యార్థులు నేరుగా 9.30 గంటలకు కళాశాలను సంప్రదించాల్సి ఉంటుంది. జిల్లాలో ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాల, ఆమదాలవలస, టెక్కలి, సీతంపేట ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.

News July 31, 2024

శ్రీకాకుళం: సర్కారు బడుల్లో ఎన్నికల సందడి 

image

సర్కారు బడుల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. మంగళవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆగస్టు 1న నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 8న పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ(పి.ఎం.సీ) నిర్వహించినట్లు జీవోలో స్పష్టం చేసింది. ఆగస్టు 1న తల్లిదండ్రుల జాబితాను ప్రచురించి, ఆగస్టు 5న అభ్యంతరాలను స్వీకరించి, అదే రోజు ఓటర్ల తుది జాబితా(తల్లిదండ్రులు) ప్రచురణ చేసి ఆగస్టు 8న పీఎంసీ ఎన్నికలను నిర్వహిస్తారు.

News July 31, 2024

శ్రీకాకుళం జిల్లాలో 88.34 శాతం ఇంజినీరింగ్ ప్రవేశాలు

image

ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశానికి తొలి విడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసింది. ఈ మేరకు కౌన్సిలింగ్ అలాట్ మెంట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొదటి విడతలో 2154 సీట్లకు 1847 ప్రవేశాలు జరిగాయి. అనంతరం తుది విడతలో 1903 మంది అభ్యర్థులకు ప్రవేశాలు జరిగాయి. మొత్తం జిల్లాలో 88.34 శాతం ప్రవేశాలు జరిగాయి.

News July 31, 2024

చాకిపల్లిలో మహిళ పై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

image

టెక్కలి మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన బొమ్మాళి జ్యోతి అనే మహిళ తనపై గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు దాడి చేశారని మంగళవారం టెక్కలి పోలీసులకు పిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన పంగ చంద్రమౌళి, వాన నారాయణ, పొందర శ్రీనివాసరావు, యాళ్ల అప్పారావు, యాళ్ల హేమలత తనపై దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీకి ఓటు వేశారని అక్కసుతోనే దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

News July 31, 2024

మందస: రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభ్యం

image

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతీ, యువకుడు మృతిచెందిన విషయం విదితమే. మృతులు మందస మండలం కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్ (21)గా పోలీసులు గుర్తించారు. ఇందులో వదిన, మరిది దుర్మరణం పాలయ్యారు. తణుకు నుంచి బైక్ పై గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో ఘటన జరిగింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.