Srikakulam

News January 13, 2025

శ్రీకాకుళం: ఈ గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర

image

సంక్రాంతి అనగా మనకు గ్రామాలు గుర్తుకు వస్తాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని S.Mపురం గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం రాజులకు ఫౌజదారిగా వ్యవహరించిన షేర్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ గ్రామానికి వచ్చింది. ఇతను క్రీ.శ 1600 సం. కాలంలో గ్రామంలో కోట, ఏనుగుల ద్వారం, పెద్ద చెరువు, తాగునీటి కోసం 7 బావులను సైతం ఏర్పాటు చేశారు. నేడు అవి శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని సంరక్షించాలని స్థానికులు అన్నారు.

News January 13, 2025

శ్రీకాకుళం జిల్లాలో భోగిని జరుపుకోని ప్రాంతాలివే..!

image

తెలుగు పండుగల్లో మొదటిది భోగి. ఈ భోగికి పురణాల గాథలతోపాటు సైంటిఫిక్ రీజన్ ఉంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశించే క్రమంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడంతో భోగి మంటలు వేస్తారు. కాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని గాజులకొల్లివలస, నరసన్నపేటలోని బసివలస, జలుమూరులోని బసివాడ, లింగాలవలస మాత్రం పలు కారణాలతో భోగి మంటలు వేయరు. మీ ప్రాంతాల్లో కూడా భోగి చేయకపోతే కామెంట్ చేయండి.

News January 13, 2025

శ్రీకాకుళం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

SKLM: ఆదిత్యుని నేటి ఆదాయం 

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారికి టికెట్లు రూపేనా రూ.25,900/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.62,490/-లు, ప్రసాదాల రూపంలో రూ.55,315/-లు సమకూరినట్లు  ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో వెల్లడించారు.

News January 12, 2025

శ్రీకాకుళం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

శ్రీకాకుళం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

శ్రీకాకుళం: పాఠశాలల్లో కొత్తగా క్లస్టర్ విధానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా క్లస్టర్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న 235 కాంప్లెక్స్‌లకు గాను 170A క్లస్టర్లుగా.. 65బి క్లస్టర్లగా విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ తిరుమల చైతన్య తెలిపారు. అలాగే పంచాయతీ పరిధిలో మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు కూడా ఉత్తర్వులు వచ్చాయన్నారు.

News January 12, 2025

పలాస నేషనల్ హైవేపై వ్యాన్ బోల్తా

image

మండలంలోని నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై మినీ వ్యాన్ శనివారం రాత్రి అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ సమయంలో భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.

News January 11, 2025

SKLM: ఈ నెల 12 నుంచి పోలీస్ పీఈటీ పరీక్షలు వాయిదా

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు పోలీస్ పీఈటీ పరీక్షలు నిర్వహించడం లేదని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు. మళ్లీ జనవరి 16వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు యథావిథిగా దేహదారుఢ్య పరీక్షలు పునఃప్రారంభం అవుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.

News January 11, 2025

SKLM: ఈ నెల13న మీకోసం ఫిర్యాదుల స్వీకరణ రద్దు

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 13న సోమవారం జరుగు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలు వృథా చేసుకొని పోలీసు కార్యాలయానికి రావద్దని ఎస్పీ సూచించారు.

error: Content is protected !!