India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల జాబితా సోమవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్వరరావు విడుదల చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న ఓటర్లు 15,037 మంది ఉన్నట్లు ప్రకటించారు. దీనిలో నరసన్నపేటలో 2,347 మంది, ఎచ్చెర్ల లో 2884, ఆమదాలవలసలో 2105, శ్రీకాకుళం 2,661, పాతపట్నం 1,952, టెక్కలి 2,606, పలాస 2,301, ఇచ్చాపురంలో 2,459 మంది యువ ఓటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
సంక్రాంతి నేపథ్యంలో శ్రీకాకుళం రోడ్డు (ఆముదాలవలసకు) రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 7,8,9,10,12,13, 14,15 తేదీల్లో చర్లపల్లి, కాచిగూడ నుంచి శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ఈమేరకు సంక్రాంతి పండుగకు జిల్లాకు రానున్న ప్రయాణీకులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకులు టిక్కెట్లు బుక్కింగ్ కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో సోమవారం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు వావిలపల్లి సురేశ్(25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మడకముడిగాం గ్రామానికి చెందిన యువకుడు పోర్టులో భోజనాలు అందించే వర్కర్గా పనిచేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని సంతబొమ్మాళి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.
వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టి రెవెన్యూ అధికారుల సమక్షంలో హద్దులు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా మైనార్టీ అధికారి మెంబర్ అండ్ కన్వీనర్ ఆర్ ఎస్ జాన్ సమక్షంలో జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని వాక్ఫ్ ఆస్తులను ఏడీ సర్వే ద్వారా సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.
పొందూరు తోలాపి గ్రామానికి చెందిన బొనిగి రమణారావు ఛత్తీసగఢ్ CRPF జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన పండగ సెలవులకు స్వగ్రామానికి వచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం వాష్ రూమ్కు వెళ్లారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఆమదాలవలసలో ఓ మైనర్ బాలికపై అదే వీధికి చెందిన కోటిపల్లి రాజు (23) మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన విధితమే. ఈ మేరకు సోమవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు పోలీసులు ఉన్నారు.
బాలికను ప్రేమ పేరుతో గర్భిణిని చేసిన ఘటన ఆమదాలవలస మండలంలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన కె.రాజు ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యాడు. రెండేళ్లుగా ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో లైంగికంగా దాడి చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.
శ్రీకాకుళం జిల్లాలో జనవరి 8న జరుగనున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేసినట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు వివిధ శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 11న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. PET, PMT నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి 8 తేది మినహా మిగిలిన తేదీల్లో PET పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. అభ్యర్థులు గమనించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో గంగిరెద్దుల రాకతో సంక్రాంతి సందడి మొదలైంది. ‘అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అని ఎద్దుల బసవన్నలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అందర్నీ దీవించి వాళ్ళు ఇచ్చిన పండగ కానుకలని స్వీకరిస్తూ వెళుతున్నారు. సన్నాయి చప్పుళ్ల నడుమ గంగిరెద్దుల నృత్యం చేశాయి. ప్రతీ ఏటా ఈ గంగిరెద్దులతో రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది.
Sorry, no posts matched your criteria.